సమంత ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో రూపొందించిన సినిమా ‘శాకుంతలం’. ‘రుద్రమదేవి’ లాంటి సాహసోపేత చిత్రంతో మంచి ఫలితాన్నందుకున్న గుణ.. ఆ తర్వాత మళ్లీ రిస్క్ చేసి ఈ భారీ చిత్రాన్ని తీశాడు. ‘రుద్రమదేవి’ వర్కవుట్ అయింది కాబట్టి మళ్లీ ఓ కథానాయికను పెట్టి తీసిన భారీ చిత్రం కూడా అలాగే ప్రేక్షకులను మెప్పిస్తుందని గుణ ఆశించినట్లున్నాడు.
కానీ ‘శాకుంతలం’ ట్రైలర్ చూశాక నిజంగా ఇది వర్కవుట్ అయ్యే సినిమానేనా అని సందేహాలు కలుగుతున్నాయి. ‘రుద్రమదేవి’లో ఉన్న సహజమైన భారీతనం.. కథానాయిక పాత్రలో వీరోచిత లక్షణాలు ఇందులో కనిపించలేదు. సమంతకు అనుష్క తరహా ఇమేజ్ లేదు. సినిమాలో ఆమె పాత్ర కూడా రుద్రమదేవి లాగా యోధురాలి క్యారెక్టర్ కాదు. దీని వల్ల ఇది ‘రుద్రమదేవి’లా మాస్ను అట్రాక్ట్ చేయడం కష్టమే.
‘రుద్రమదేవి’లో రానా ఉండడం దానికి కొంత ప్లస్ అయింది. కానీ ఇందులో మనకు పరిచయం లేని ఒక మలయాళ నటుడిని కథానాయికకు జోడీగా పెట్టారు. అతను సినిమాలో ఎన్ని వీరోచిత విన్యాసాలు చేసినా మన వాళ్లు కనెక్ట్ కావడం కష్టమే. ‘రుద్రమదేవి’కి అల్లు అర్జున్ ప్లస్ అయినట్లు ఇందులో స్పెషల్ క్యారెక్టర్ కూడా ఏమీ కనిపించడం లేదు. కథ పరంగా విషయం ఉన్నప్పటికీ.. ట్రైలర్ చూసిన జనాలకు మాత్రం క్యూరియాసిటీ పెంచే అంశాలేమీ పెద్దగా కనిపించలేదు. గ్రాఫిక్స్ అవీ గట్టిగానే ఉన్నట్లు అనిపించినా.. నేచురల్ ఫీలింగ్ కలగలేదు. సమంత తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం కూడా మైనస్ అయినట్లు కనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే గుణ అండ్ టీం అంత కష్టపడి, భారీగా ఖర్చు పెట్టి చేసిన ‘శాకుంతలం’ సినిమా కమర్షియల్గా ఏమాత్రం ఆడుతుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘రుద్రమదేవి’ విషయంలోనూ బడ్జెట్ వర్కవుట్ అవుతుందా అన్న డౌట్లు కలిగాయి. కానీ ఆ సినిమా అంచనాలను మించి విజయం సాధించింది. ‘శాకుంతలం’ కూడా సందేహాలను పటాపంచలు చేసి బాక్సాఫీస్ సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.
This post was last modified on January 10, 2023 5:30 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…