సమంత ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో రూపొందించిన సినిమా ‘శాకుంతలం’. ‘రుద్రమదేవి’ లాంటి సాహసోపేత చిత్రంతో మంచి ఫలితాన్నందుకున్న గుణ.. ఆ తర్వాత మళ్లీ రిస్క్ చేసి ఈ భారీ చిత్రాన్ని తీశాడు. ‘రుద్రమదేవి’ వర్కవుట్ అయింది కాబట్టి మళ్లీ ఓ కథానాయికను పెట్టి తీసిన భారీ చిత్రం కూడా అలాగే ప్రేక్షకులను మెప్పిస్తుందని గుణ ఆశించినట్లున్నాడు.
కానీ ‘శాకుంతలం’ ట్రైలర్ చూశాక నిజంగా ఇది వర్కవుట్ అయ్యే సినిమానేనా అని సందేహాలు కలుగుతున్నాయి. ‘రుద్రమదేవి’లో ఉన్న సహజమైన భారీతనం.. కథానాయిక పాత్రలో వీరోచిత లక్షణాలు ఇందులో కనిపించలేదు. సమంతకు అనుష్క తరహా ఇమేజ్ లేదు. సినిమాలో ఆమె పాత్ర కూడా రుద్రమదేవి లాగా యోధురాలి క్యారెక్టర్ కాదు. దీని వల్ల ఇది ‘రుద్రమదేవి’లా మాస్ను అట్రాక్ట్ చేయడం కష్టమే.
‘రుద్రమదేవి’లో రానా ఉండడం దానికి కొంత ప్లస్ అయింది. కానీ ఇందులో మనకు పరిచయం లేని ఒక మలయాళ నటుడిని కథానాయికకు జోడీగా పెట్టారు. అతను సినిమాలో ఎన్ని వీరోచిత విన్యాసాలు చేసినా మన వాళ్లు కనెక్ట్ కావడం కష్టమే. ‘రుద్రమదేవి’కి అల్లు అర్జున్ ప్లస్ అయినట్లు ఇందులో స్పెషల్ క్యారెక్టర్ కూడా ఏమీ కనిపించడం లేదు. కథ పరంగా విషయం ఉన్నప్పటికీ.. ట్రైలర్ చూసిన జనాలకు మాత్రం క్యూరియాసిటీ పెంచే అంశాలేమీ పెద్దగా కనిపించలేదు. గ్రాఫిక్స్ అవీ గట్టిగానే ఉన్నట్లు అనిపించినా.. నేచురల్ ఫీలింగ్ కలగలేదు. సమంత తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం కూడా మైనస్ అయినట్లు కనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే గుణ అండ్ టీం అంత కష్టపడి, భారీగా ఖర్చు పెట్టి చేసిన ‘శాకుంతలం’ సినిమా కమర్షియల్గా ఏమాత్రం ఆడుతుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘రుద్రమదేవి’ విషయంలోనూ బడ్జెట్ వర్కవుట్ అవుతుందా అన్న డౌట్లు కలిగాయి. కానీ ఆ సినిమా అంచనాలను మించి విజయం సాధించింది. ‘శాకుంతలం’ కూడా సందేహాలను పటాపంచలు చేసి బాక్సాఫీస్ సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.
This post was last modified on January 10, 2023 5:30 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…