సెకండ్ ఇన్నింగ్స్లో యంగ్ హీరోల కంటే స్పీడ్గా వరుసగా ప్రాజెక్ట్లను ప్రకటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ మూవీ చేస్తున్న మెగాస్టార్, ఆ తర్వాత ముగ్గురు డైరెక్టర్లతో సినిమాలు ఉంటాయని ఇప్పటికే ప్రకటించారు. యంగ్ డైరెక్టర్స్ సుజిత్, బాబీ, మెహార్ రమేశ్లతో సినిమాలు చేస్తానని చెప్పి, మెగా ఫ్యాన్స్కు షాక్ ఇచ్చిన చిరూ… ఓ వెబ్ సిరీస్లో కూడా నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం మిగిలిన భాషలతో పాటు తెలుగులోనూ వెబ్ సిరీస్లకు కూడా క్రేజ్ పెరుగుతోంది. లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన జనాలు, సినిమాల కంటే వెబ్ సిరీస్లను వీక్షించడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో స్టార్ హీరోలను వెబ్ సిరీస్ల్లో నటింపచేసి, వాటికి మరింత క్రేజ్ తేవాలని ప్రయత్నిస్తున్నాయి ఓటీటీ ఫ్లాట్ఫామ్స్.
అలా ఓ టాప్ ఓటీటీ నుంచి మెగాస్టార్కు కాల్ వచ్చిందట. వారి ఆఫర్కు పాజిటివ్గా స్పందించిన చిరూ ‘డైరెక్టర్ను పంపించండి… కథను వింటానని’ చెప్పారట. మంచి క్రేజీ కథలతో వచ్చే యంగ్ దర్శకులను తనవద్దకు తీసుకురమ్మని మేనేజర్కు ప్రత్యేకంగా చెప్పారట. దీంతో చిరూ త్వరలో ఓ వెబ్ సిరీస్లో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటిదాకా శ్రీకాంత్, జగపతిబాబు వంటి మిడియం రేంజ్ సీనియర్ హీరోలు మాత్రమే వెబ్ సిరీస్ల్లో నటించారు. చిరంజీవిలాంటి టాప్ స్టార్ ఎంట్రీ ఇస్తే, తెలుగులోనూ వెబ్ సిరీస్లకు మహర్ధశ పట్టినట్టే. మెగా బావమరిది అల్లుఅరవింద్ ‘ఆహా’ పేరు ఓ ఓటీటీ ఫ్లాట్ఫామ్ ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే ఆదరణ దక్కించుకుంటున్న ‘ఆహా’కు క్రేజ్ తేవడం కోసం చిరూ ఈ మెగా స్టెప్ తీసుకుంటాడనే టాక్ కూడా వినిపిస్తోంది.
This post was last modified on April 23, 2020 6:50 am
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి…
జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత ఆ స్థాయి ఫాంటసీ మూవీగా అంచనాలు మోస్తున్న విశ్వంభర వ్యవహారం ఎంతకీ తెగక, విడుదల తేదీ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు భారీ మేలును…
ఏపీలోని అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడులో ఎలాంటి మార్పులు…
ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో…
ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…