పాపం సమంత.. గత కొన్ని నెలల నుంచి ఈ మాట అనుకోని అభిమానులు లేరు. ఒకటిన్నర దశాబ్దం నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ చెన్నై అమ్మాయి.. తెలుగమ్మాయిగా మారిపోయి చాలా కాలం అయింది. సినీ కెరీర్లో పీక్స్ను అందుకున్నాక అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుని మూడేళ్లు సంతోషంగా వైవాహిక జీవితాన్ని ఆస్వాదించిన ఆమె.. ఏడాదిన్నర కిందట అతడి నుంచి విడిపోవడం తెలిసిందే.
ఆ తర్వాత తన కెరీర్ను పొడిగించుకుని తిరిగి పీక్స్ను అందుకునేలా కనిపించిన సామ్.. కొన్ని నెలల కిందట మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అప్పట్నుంచి చికిత్స తీసుకుంటున్న సామ్.. ఇటీవల కోలుకున్నట్లుగా వార్తలొచ్చాయి. తన కొత్త చిత్రం శాకుంతలం ప్రెస్ మీట్కు కూడా సమంత వస్తోందని తెలిసి అభిమానులు సంతోషించారు.
కానీ శాకుంతలం ప్రెస్ మీట్లో సమంత అంత సౌకర్యంగా కనిపించలేదు. ఆమెలో అన్ ఈజీనెస్ స్పష్టంగా తెలిసిపోయింది. ఉన్నంతసేపు సమంత ఇబ్బందిగానే కనిపించింది. సమంత డల్గా కనిపించడంపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. తనలో గ్లో పోయిందంటూ పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్టుపై సమంత స్వయంగా స్పందించడం గమనార్హం.
తనలా నెలల తరబడి ట్రీట్మెంట్ తీసుకోకూడదని తాను కోరుకుంటానని.. తాను అందిస్తున్న ప్రేమతో గ్లో పొందాలని ఆ పోస్టు మీద కౌంటర్ వేసింది సమంత. ఆమెకు మద్దతుగా నెటిజన్లు చాలామంది ట్వీట్లు వేశారు. వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులను తట్టుకుని నిలబడ్డ కొంత కాలానికే ఇలా అనారోగ్యం పాలై పోరాడాల్సి రావడంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె పూర్తిగా కోలుకుని ముందులా హుషారుగా తయారవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.
This post was last modified on January 10, 2023 6:09 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…