భారీ బడ్జెట్ తో ఒక తెలుగు నిర్మాత ఓ తెలుగు దర్శకుడితో తమిళంలో సినిమా తీశాడనే అభిమానంతో హీరో విజయ్ ఇక్కడికి వచ్చి ప్రమోషన్లో పాల్గొంటాడనే ఆశ అడియాశే అయ్యేలా ఉంది. చెన్నైలో గ్రాండ్ గా ఆడియో ఫంక్షన్ కి హాజరవ్వడమే కాదు స్టేజి మీద పాట పాడి డాన్స్ చేసిన విజయ్ హైదరాబాద్ కు మాత్రం ససేమిరా రానని తెగేసి చెప్పినట్టు చెన్నై టాక్. ఒకప్పుడు తనకు ఫాలోయింగ్ లేదు కానీ తుపాకీతో మొదలు ఇక్కడ డీసెంట్ మార్కెట్ ఏర్పడిన మాట వాస్తవం. తరచూ ఇతని పాత హిట్లు స్పెషల్ ప్రీమియర్లుగా వేసిన దాఖలాలు ఈ మధ్యే ఉన్నాయి. అలాంటిది కొంచెం ఫోకస్ పెడితే మంచి ఫలితాలుంటాయి.
కానీ విజయ్ మాత్రం అదేమీ జాన్తా నై అంటున్నాడు కాబోలు. వారసుడుకి తెలుగులో ఏమంత బజ్ లేదు. పైగా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల ఊర మాస్ ట్రైలర్లు చూశాక మన జనానికి డబ్బింగ్ బొమ్మలు కంటికి ఆనవు. అజిత్ కేసు వేరు. తెగింపు అమ్మిందే చాలా తక్కువ రేట్లకు. పైగా దాని నిర్మాత బోనీ కపూర్ ఏపీ తెలంగాణ బిజినెస్ ని అంత సీరియస్ గా తీసుకోలేదు. సో బొమ్మ ఆడినా ఆడకపోయినా సేఫ్ అవుతుంది. కానీ వారసుడు సంగతి అలా కాదు. భారీ ఎత్తున గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ విషయం ఇంకా తేలలేదు మరికొద్ది గంటల్లో అంటూ సాగదీస్తూనే ఉన్నారు.
వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా హీరోలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రమోషన్లో భాగమవ్వడం ఇప్పుడున్న పరిస్థితిలో చాలా అవసరం. విక్రమ్ కోసం కమల్ హాసన్ రెండు మూడు సార్లు భాగ్యనగరానికి వచ్చారు. పొన్నియన్ సెల్వన్ ని మార్కెట్ చేసుకోవడానికి టీమ్ మొత్తం ఇక్కడికే వచ్చింది. సూర్య, కార్తీలు హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా నిత్యం ప్రచారానికి వస్తూ పోతూ ఉంటారు. కానీ విజయ్ మాత్రం తన రూటే వేరు అంటున్నారు. ఇంత గ్రాండ్ స్కేల్ మీద తీసినందుకు, లో ప్రొఫైల్ లో ఉన్న వారసుడు మీద అంచనాలు పెంచేందుకైనా ఓసారి వచ్చి ఉంటే బాగుండేది. వారసుడు తెలుగు ట్రైలర్ నే ట్విట్టర్ షేర్ చేయనప్పుడు ఇంకేం ఆశిస్తాం.
This post was last modified on January 8, 2023 5:36 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…