ఇంకో వారం రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది తమిళ భారీ చిత్రం వారిసు (తెలుగులో వారసుడు). ఆ సినిమా విడుదల ఏర్పాట్లలో టీం అంతా తలమునకలై ఉన్న సమయంలో చిత్ర బృందంలోని ఒక కీలక వ్యక్తి హఠాత్తుగా మరణించడం అందరినీ విషాదంలో ముంచెత్తింది. ఆ వ్యక్తి పేరు.. సునీల్ బాబు. అతను వారిసుకు ఆర్ట్ డైరెక్టర్.
ఇదే కాదు.. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పెద్ద పెద్ద సినిమాలు చాలా వాటికే అతను ప్రొడక్షన్ డిజైనర్గా పని చేశాడు. సునీల్ బాబు వయసు 50 ఏళ్లు. గురువారం రాత్రి హఠాత్తుగా గుండెపోటు రాగా.. సునీల్ బాబును కేరళలోని ఎర్నాకులంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ అతను శుక్రవారం తుది శ్వాస విడిచాడు. సునీల్ బాబుకు భార్య, కూతురు ఉన్నారు.
సునీల్ మరణ వార్త తెలిసి వారిసు టీం విషాదంలో మునిగిపోయింది. ఆయనకు నివాళిగా ఒక ఎమోషనల్ నోట్ రిలీజ్ చేసింది శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థ. చిత్ర బృందలోని వాళ్లే కాదు.. భారతీయ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులంతా సునీల్ బాబు మరణంతో షాక్ అవుతున్నారు. లెజెండరీ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ శిష్యుడు సునీల్ బాబు. గురువు దగ్గర మెలకువలు నేర్చుకుని.. ఆ తర్వాత ఆర్ట్ డైరెక్టర్గా మారిన సునీల్ బాబు.. ఇండియాలో టాప్ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకడిగా ఎదిగాడు.
హిందీలో లక్ష్య, గజిని, స్పెషల్ చబ్బీస్, ఇకబ్బాల్… తమిళంలో గజిని, విల్లు, కాసనోవా, మలయాళంలో భీష్మపర్వం, బెంగళూరు డేస్ లాంటి ప్రముఖ చిత్రాలకు సునీల్ ఆర్ట్ డైరెక్షన్ చేశాడు. తెలుగులో ఊపిరి, మహర్షి, సీతారామం లాంటి చిత్రాలకు ఆయన పని చేశాడు. ఊపిరి, మహర్షి సినిమాలకు సునీల్ పనితనం నచ్చి వారిసుకు కూడా వంశీ ఆయన్నే ఆర్ట్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు. ఇదే ఆయనకు చివరి చిత్రం అయింది.
This post was last modified on January 6, 2023 10:16 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…