ఇంకో వారం రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది తమిళ భారీ చిత్రం వారిసు (తెలుగులో వారసుడు). ఆ సినిమా విడుదల ఏర్పాట్లలో టీం అంతా తలమునకలై ఉన్న సమయంలో చిత్ర బృందంలోని ఒక కీలక వ్యక్తి హఠాత్తుగా మరణించడం అందరినీ విషాదంలో ముంచెత్తింది. ఆ వ్యక్తి పేరు.. సునీల్ బాబు. అతను వారిసుకు ఆర్ట్ డైరెక్టర్.
ఇదే కాదు.. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పెద్ద పెద్ద సినిమాలు చాలా వాటికే అతను ప్రొడక్షన్ డిజైనర్గా పని చేశాడు. సునీల్ బాబు వయసు 50 ఏళ్లు. గురువారం రాత్రి హఠాత్తుగా గుండెపోటు రాగా.. సునీల్ బాబును కేరళలోని ఎర్నాకులంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ అతను శుక్రవారం తుది శ్వాస విడిచాడు. సునీల్ బాబుకు భార్య, కూతురు ఉన్నారు.
సునీల్ మరణ వార్త తెలిసి వారిసు టీం విషాదంలో మునిగిపోయింది. ఆయనకు నివాళిగా ఒక ఎమోషనల్ నోట్ రిలీజ్ చేసింది శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థ. చిత్ర బృందలోని వాళ్లే కాదు.. భారతీయ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులంతా సునీల్ బాబు మరణంతో షాక్ అవుతున్నారు. లెజెండరీ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ శిష్యుడు సునీల్ బాబు. గురువు దగ్గర మెలకువలు నేర్చుకుని.. ఆ తర్వాత ఆర్ట్ డైరెక్టర్గా మారిన సునీల్ బాబు.. ఇండియాలో టాప్ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకడిగా ఎదిగాడు.
హిందీలో లక్ష్య, గజిని, స్పెషల్ చబ్బీస్, ఇకబ్బాల్… తమిళంలో గజిని, విల్లు, కాసనోవా, మలయాళంలో భీష్మపర్వం, బెంగళూరు డేస్ లాంటి ప్రముఖ చిత్రాలకు సునీల్ ఆర్ట్ డైరెక్షన్ చేశాడు. తెలుగులో ఊపిరి, మహర్షి, సీతారామం లాంటి చిత్రాలకు ఆయన పని చేశాడు. ఊపిరి, మహర్షి సినిమాలకు సునీల్ పనితనం నచ్చి వారిసుకు కూడా వంశీ ఆయన్నే ఆర్ట్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు. ఇదే ఆయనకు చివరి చిత్రం అయింది.
This post was last modified on January 6, 2023 10:16 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…