ఇంకో వారం రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది తమిళ భారీ చిత్రం వారిసు (తెలుగులో వారసుడు). ఆ సినిమా విడుదల ఏర్పాట్లలో టీం అంతా తలమునకలై ఉన్న సమయంలో చిత్ర బృందంలోని ఒక కీలక వ్యక్తి హఠాత్తుగా మరణించడం అందరినీ విషాదంలో ముంచెత్తింది. ఆ వ్యక్తి పేరు.. సునీల్ బాబు. అతను వారిసుకు ఆర్ట్ డైరెక్టర్.
ఇదే కాదు.. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పెద్ద పెద్ద సినిమాలు చాలా వాటికే అతను ప్రొడక్షన్ డిజైనర్గా పని చేశాడు. సునీల్ బాబు వయసు 50 ఏళ్లు. గురువారం రాత్రి హఠాత్తుగా గుండెపోటు రాగా.. సునీల్ బాబును కేరళలోని ఎర్నాకులంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ అతను శుక్రవారం తుది శ్వాస విడిచాడు. సునీల్ బాబుకు భార్య, కూతురు ఉన్నారు.
సునీల్ మరణ వార్త తెలిసి వారిసు టీం విషాదంలో మునిగిపోయింది. ఆయనకు నివాళిగా ఒక ఎమోషనల్ నోట్ రిలీజ్ చేసింది శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థ. చిత్ర బృందలోని వాళ్లే కాదు.. భారతీయ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులంతా సునీల్ బాబు మరణంతో షాక్ అవుతున్నారు. లెజెండరీ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ శిష్యుడు సునీల్ బాబు. గురువు దగ్గర మెలకువలు నేర్చుకుని.. ఆ తర్వాత ఆర్ట్ డైరెక్టర్గా మారిన సునీల్ బాబు.. ఇండియాలో టాప్ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకడిగా ఎదిగాడు.
హిందీలో లక్ష్య, గజిని, స్పెషల్ చబ్బీస్, ఇకబ్బాల్… తమిళంలో గజిని, విల్లు, కాసనోవా, మలయాళంలో భీష్మపర్వం, బెంగళూరు డేస్ లాంటి ప్రముఖ చిత్రాలకు సునీల్ ఆర్ట్ డైరెక్షన్ చేశాడు. తెలుగులో ఊపిరి, మహర్షి, సీతారామం లాంటి చిత్రాలకు ఆయన పని చేశాడు. ఊపిరి, మహర్షి సినిమాలకు సునీల్ పనితనం నచ్చి వారిసుకు కూడా వంశీ ఆయన్నే ఆర్ట్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు. ఇదే ఆయనకు చివరి చిత్రం అయింది.
This post was last modified on January 6, 2023 10:16 pm
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…