టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ మధ్య సోషల్ మీడియాకు బాగా టార్గెట్ అయిపోతున్నాడు. అందుకు ప్రధాన కారణం.. ఆయన నిర్మించిన తమిళ సినిమా ‘వారిసు’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరుతో ఆయనే రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ లాంటి భారీ చిత్రాలు పోటీలో ఉండగా.. వాటికి దీటుగా, ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువగా థియేటర్లను కొన్ని ఏరియాల్లో ‘వారసుడు’కు అట్టిపెట్టడం వివాదస్పదమై.. దీని మీద చాన్నాళ్లుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. చిరు, బాలయ్య అభిమానులు ఈ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు బాలయ్యపై. సరైన టైం కోసం ఎదురు చూస్తున్న వారికి ‘వారిసు’ తమిళ ఆడియో వేడుక.,. ఈ సినిమా ట్రైలర్ మంచి అవకాశంగా కనిపించాయి., ఇప్పటికే తెలుగులో వచ్చిన చాలా సినిమాల కలబోతలాగా ఈ సినిమా ఉండడం, కొత్తదనం కనిపించకపోవడంతో.. ట్రైలర్ లాంచ్ అయినా కాసేపటి నుంచే విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
కొన్ని గంటల్లో వందల కొద్దీ మీమ్స్ వచ్చి పడిపోయాయి ఈ సినిమా మీద. ఇదంతా ఒకెత్తయితే.. చెన్నైలో ‘వారిసు’ ఆడియో వేడుక సందర్భంగా దిల్ రాజు చేసిన ప్రసంగం మీద జరుగుతున్న ట్రోలింగ్ మరో ఎత్తు. రాజు ఇంగ్లిష్లో్ వీక్ అన్న సంగతి తెలిసిందే. ఆయనకు తమిళం కూడా రాదు. ఐతే ‘వారిసు’ వేడుకలో కొంచెం ఇంగ్లిష్, కొంచెం తమిళం కలిపి మాట్లాడడానికి రాజు ప్రయత్నించాడు. కానీ అది తేడా కొట్టేసింది. ఈ స్పీచ్ మీద అటు తమిళ జనాలు.. ఇటు తెలుగు వాళ్లు పోటీ పడి మీమ్స్ తయారు చేస్తున్నారు.
రాజు కామెంట్లను ‘జిఫ్’లు కూడా చాలానే వచ్చేశాయి. సోషల్ మీడియాలో రెండు మూడు రోజుల నుంచి ఇదే రచ్చ నడుస్తోంది. దిల్ రాజు ఇంతకుముందు ఎన్నడూ లేని స్థాయిలో ఇప్పుడు ట్రోల్ అవుతున్నాడు.
This post was last modified on January 6, 2023 6:56 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…