Dil Raju
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ మధ్య సోషల్ మీడియాకు బాగా టార్గెట్ అయిపోతున్నాడు. అందుకు ప్రధాన కారణం.. ఆయన నిర్మించిన తమిళ సినిమా ‘వారిసు’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరుతో ఆయనే రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ లాంటి భారీ చిత్రాలు పోటీలో ఉండగా.. వాటికి దీటుగా, ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువగా థియేటర్లను కొన్ని ఏరియాల్లో ‘వారసుడు’కు అట్టిపెట్టడం వివాదస్పదమై.. దీని మీద చాన్నాళ్లుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. చిరు, బాలయ్య అభిమానులు ఈ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు బాలయ్యపై. సరైన టైం కోసం ఎదురు చూస్తున్న వారికి ‘వారిసు’ తమిళ ఆడియో వేడుక.,. ఈ సినిమా ట్రైలర్ మంచి అవకాశంగా కనిపించాయి., ఇప్పటికే తెలుగులో వచ్చిన చాలా సినిమాల కలబోతలాగా ఈ సినిమా ఉండడం, కొత్తదనం కనిపించకపోవడంతో.. ట్రైలర్ లాంచ్ అయినా కాసేపటి నుంచే విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
కొన్ని గంటల్లో వందల కొద్దీ మీమ్స్ వచ్చి పడిపోయాయి ఈ సినిమా మీద. ఇదంతా ఒకెత్తయితే.. చెన్నైలో ‘వారిసు’ ఆడియో వేడుక సందర్భంగా దిల్ రాజు చేసిన ప్రసంగం మీద జరుగుతున్న ట్రోలింగ్ మరో ఎత్తు. రాజు ఇంగ్లిష్లో్ వీక్ అన్న సంగతి తెలిసిందే. ఆయనకు తమిళం కూడా రాదు. ఐతే ‘వారిసు’ వేడుకలో కొంచెం ఇంగ్లిష్, కొంచెం తమిళం కలిపి మాట్లాడడానికి రాజు ప్రయత్నించాడు. కానీ అది తేడా కొట్టేసింది. ఈ స్పీచ్ మీద అటు తమిళ జనాలు.. ఇటు తెలుగు వాళ్లు పోటీ పడి మీమ్స్ తయారు చేస్తున్నారు.
రాజు కామెంట్లను ‘జిఫ్’లు కూడా చాలానే వచ్చేశాయి. సోషల్ మీడియాలో రెండు మూడు రోజుల నుంచి ఇదే రచ్చ నడుస్తోంది. దిల్ రాజు ఇంతకుముందు ఎన్నడూ లేని స్థాయిలో ఇప్పుడు ట్రోల్ అవుతున్నాడు.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…