సినిమా ప్రమోషన్ల విషయంలో మెగాస్టార్ చిరంజీవి పెద్దగా మొహమాటపడరు కానీ అవి ఏవైనా సరే ఆయన స్థాయికి తగ్గట్టే ఉండాలని అభిమానులు ఆశిస్తారు. కొన్నేళ్ల క్రితం మీలో ఎవరు కోటీశ్వరుడులో యాంకర్ గా చేసినప్పుడు మెగా ఫ్యాన్స్ నుంచే కొంత వ్యతిరేకత వచ్చింది. రాజకీయాలకు బ్రేక్ అప్ చెప్పి తిరిగి కంబ్యాక్ ఇస్తున్నప్పుడు ఇలాంటి క్విజ్ షోలు చేయడం ఏమిటనే కామెంట్లు గట్టిగానే వినిపించాయి. వాళ్ళ భయానికి తగ్గట్టే చిరు నడిపించిన సిరీస్ అంతగా సక్సెస్ కాకపోవడంతో అది నాగార్జున చేతికి వెళ్లిపోయింది. సో మెగాస్టార్ రేంజ్ ని ఆయన కాదు ఫాలోయర్స్ డిసైడ్ చేసి పెట్టారు.
తాజాగా యాంకర్ సుమ నిర్వహించే కొత్త గేమ్ షో అడ్డాకు చిరు బోణీ అతిథిగా హాజరయ్యారు. వాల్తేరు వీరయ్య కోసం దర్శకుడు బాబీతో కలిసి ఇందులో పాల్గొన్నారు. త్వరలో సంక్రాంతి సందర్భంగా ప్రసారం కానుంది. మాములుగా సుమ చేసే ప్రోగ్రాంస్ కి గతంలో చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ కు రాకపోయినా బ్రహ్మాస్త్ర కోసం రన్వీర్ కపూర్ అలియా భట్ లతో రాజమౌళి వచ్చాడు. చిన్నా చితక హీరోలు డైరెక్టర్లు లెక్కలేనంత మంది షోకి కలర్ ఇచ్చారు.అయితే నలుగురు అగ్ర సీనియర్లలో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఎప్పుడూ ఇలాంటి సరదా షోకి వచ్చిన దాఖలాలు లేవు.
ఇక్కడ సుమ స్థాయి పెరిగిందా లేక చిరు తన మూవీ కోసం ఓ మెట్టు దిగారా అనేది సమాధానం కష్టమే కానీ దీన్ని నిర్మిస్తున్న మల్లెమాల అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి మెగాస్టార్ తో ఉన్న అనుబంధమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దానికి తోడు సుమలో చలాకి యాంకరింగ్ ని పలు సందర్భాల్లో మెచ్చుకున్న చిరంజీవికి ఇప్పుడో సరికొత్త అనుభూతి దక్కనుంది. ఇది రెగ్యులర్ ఇంటర్వ్యూ కాదు కాబట్టి ఆయన గౌరవానికి తగ్గట్టు సుమ ఎలాంటి గేమ్స్ ఆడిస్తుంది, ఏఏ ప్రశ్నలు అడుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. షూటింగ్ పూర్తి చేసుకుంది కాబట్టి ఆల్రెడీ దీని తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చేశాయి .
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…