ఇంకో వారం రోజుల కంటే తక్కువ వ్యవధిలో మొదలుకాబోతున్న సంక్రాంతి దెబ్బకు ఈ ఫ్రైడే చెప్పుకోదగ్గ కొత్త రిలీజులేవీ బాక్సాఫీస్ వద్ద కనిపించడం లేదు. ధైర్యం చేసిన కొద్ది నిర్మాతలకు సైతం కనీస ఫలితం వచ్చే తక్కువగానే ఉన్నాయి. గత వారం ఇరవై ఏళ్ళ పాత సినిమా పవన్ కళ్యాణ్ ఖుషి హల్చల్ చేస్తే ఈసారి ఆ బాధ్యతని మహేష్ బాబు ఒక్కడు తీసుకోబోతోంది. వీటికి హౌస్ ఫుల్ బోర్డులు తాజాగా వచ్చిన వాటికి ఖాళీ టికెట్ కౌంటర్లు కనిపించడం అసలు విచిత్రం. ఎలాగూ జనవరి 11 నుంచి ఒక్క స్క్రీన్ ఉండదు. అలాంటప్పుడు ఇంత తక్కువ సంబరానికి రిస్క్ ఎందుకు చేయాలని గమ్మునైపోయారు.
ఇవాళ రిలీజైన వాటిలో ప్రత్యర్థి, మైఖేల్ గ్యాంగ్, ఏ జర్నీ టు కాశీ, ఉత్తమ విలన్ కేరాఫ్ మహాదేవపురం వగైరా ఉన్నాయి. దేనికీ కనీస బజ్ లేదు. మౌత్ టాక్ ని నమ్ముకోవాల్సిందే. కింగ్ డం అఫ్ డైనోసార్స్ అనే ఇంగ్లీష్ మూవీని డబ్ చేసి వదిలారు కానీ ట్రైలర్ చూస్తే అందులో ఉన్న లో క్వాలిటీ విఎఫ్ఎక్స్ కి దండం పెట్టాల్సిందే. కలర్ మాయాబజార్ నే మరోసారి తీసుకొచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ స్లంప్ ఇంకో అయిదు రోజుల పాటు భరించాలి. ఈ వీకెండ్ సైతం పూర్తిగా రవితేజ ధమాకా చేతుల్లోకి వెళ్లనుంది. అనూహ్యంగా అవతార్ 2కి శని ఆదివారాలు భారీ వసూళ్లు నమోదవుతున్నాయి.
సో ఈ రోజు వచ్చినవన్నీ తాత్కాలికంగా థియేటర్ల ఫీడింగ్ కి తప్ప చెప్పుకోదగినవి ఏవీ లేకపోవడం టాలీవుడ్ లవర్స్ కి నిరాశ కలిగించేదే. అయితే పండక్కు వచ్చే నాలుగైదు సినిమాలకు సరిపడా టికెట్ డబ్బులు సమకూరాలంటే ఇప్పుడు థియేటర్ల వైపు వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయం సినీ అభిమానుల్లో ఉంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తెగింపు, కళ్యాణం కమనీయంలు రావడానికి రెడీ అవుతుండటంతో ఎగ్జిబిటర్లు వాటికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. స్క్రీన్ కౌంట్ ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. ఇంకో రెండు మూడు రోజుల్లో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది.
This post was last modified on January 6, 2023 11:23 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…