ఇంకో వారం రోజుల కంటే తక్కువ వ్యవధిలో మొదలుకాబోతున్న సంక్రాంతి దెబ్బకు ఈ ఫ్రైడే చెప్పుకోదగ్గ కొత్త రిలీజులేవీ బాక్సాఫీస్ వద్ద కనిపించడం లేదు. ధైర్యం చేసిన కొద్ది నిర్మాతలకు సైతం కనీస ఫలితం వచ్చే తక్కువగానే ఉన్నాయి. గత వారం ఇరవై ఏళ్ళ పాత సినిమా పవన్ కళ్యాణ్ ఖుషి హల్చల్ చేస్తే ఈసారి ఆ బాధ్యతని మహేష్ బాబు ఒక్కడు తీసుకోబోతోంది. వీటికి హౌస్ ఫుల్ బోర్డులు తాజాగా వచ్చిన వాటికి ఖాళీ టికెట్ కౌంటర్లు కనిపించడం అసలు విచిత్రం. ఎలాగూ జనవరి 11 నుంచి ఒక్క స్క్రీన్ ఉండదు. అలాంటప్పుడు ఇంత తక్కువ సంబరానికి రిస్క్ ఎందుకు చేయాలని గమ్మునైపోయారు.
ఇవాళ రిలీజైన వాటిలో ప్రత్యర్థి, మైఖేల్ గ్యాంగ్, ఏ జర్నీ టు కాశీ, ఉత్తమ విలన్ కేరాఫ్ మహాదేవపురం వగైరా ఉన్నాయి. దేనికీ కనీస బజ్ లేదు. మౌత్ టాక్ ని నమ్ముకోవాల్సిందే. కింగ్ డం అఫ్ డైనోసార్స్ అనే ఇంగ్లీష్ మూవీని డబ్ చేసి వదిలారు కానీ ట్రైలర్ చూస్తే అందులో ఉన్న లో క్వాలిటీ విఎఫ్ఎక్స్ కి దండం పెట్టాల్సిందే. కలర్ మాయాబజార్ నే మరోసారి తీసుకొచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ స్లంప్ ఇంకో అయిదు రోజుల పాటు భరించాలి. ఈ వీకెండ్ సైతం పూర్తిగా రవితేజ ధమాకా చేతుల్లోకి వెళ్లనుంది. అనూహ్యంగా అవతార్ 2కి శని ఆదివారాలు భారీ వసూళ్లు నమోదవుతున్నాయి.
సో ఈ రోజు వచ్చినవన్నీ తాత్కాలికంగా థియేటర్ల ఫీడింగ్ కి తప్ప చెప్పుకోదగినవి ఏవీ లేకపోవడం టాలీవుడ్ లవర్స్ కి నిరాశ కలిగించేదే. అయితే పండక్కు వచ్చే నాలుగైదు సినిమాలకు సరిపడా టికెట్ డబ్బులు సమకూరాలంటే ఇప్పుడు థియేటర్ల వైపు వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయం సినీ అభిమానుల్లో ఉంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తెగింపు, కళ్యాణం కమనీయంలు రావడానికి రెడీ అవుతుండటంతో ఎగ్జిబిటర్లు వాటికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. స్క్రీన్ కౌంట్ ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. ఇంకో రెండు మూడు రోజుల్లో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది.
This post was last modified on January 6, 2023 11:23 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…