మాస్ మహారాజా ధమాకా మూడో వారంలో సగర్వంగా అడుగు పెట్టింది. ఏకంగా 100 కోట్ల గ్రాస్ తో మాస్ మహారాజా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ ఫిగర్ మీద ట్రేడ్ వర్గాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ గా వచ్చింది కాబట్టి దీన్నే ప్రామాణికంగా తీసుకోవాలి. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో భారీ ఆక్యుపెన్సీతో చెడుగుడు ఆడిన ధమాకా ఇటు ఏ కేంద్రాల్లోనూ వీకెండ్స్ లో హ్యాపీగా ఆధిపత్యం చెలాయిస్తోంది. కనీస పోటీ లేకపోవడం ధమాకాకు అది పెద్ద సానుకూలాంశం. నిఖిల్ 18 పేజెస్ కి పర్వాలేదనే టాక్ వచ్చినా మరీ పోటీ ఇచ్చేంత స్థాయిలో కాదు.
ధమాకా ఫలితం వంద కోట్ల విలువైన పాఠాలు నేర్పిస్తోంది. టెక్నాలజీ ఎంత పెరిగినా, సగటు మనిషి జీవన ప్రమాణాల్లో ఎంత మార్పు వచ్చినా సినిమాకు సంబంధించి మూలం మాస్ లోనే ఉంది. ఆ పల్స్ ని సరిగ్గా ఒడిసిపట్టుకుంటే కథాకథనాలు ఎంత రొటీన్ గా ఉన్నా సరే కేవలం కొన్ని అంశాలతో బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలవొచ్చు. ముఖ్యంగా ఒక సినిమా సక్సెస్ లో ఆడియో ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మరోసారి అర్థమయ్యింది. హీరోయిన్ ఛాయస్ ఫలితం మీద ఎంత సానుకూల ప్రభావం చూపిస్తుందో శ్రీలల సాక్షిగా నిలుస్తోంది. రవితేజ పక్కన ఈ పడుచుపిల్లా అని కామెంట్ చేసిన వాళ్లే ఆ జంట కెమిస్ట్రీని ఎంజాయ్ చేస్తున్నారు.
అనవసరమైన పోటీకి దిగకుండా చక్కగా సోలోగా ప్లాన్ చేసుకోవడం ధమాకాకు చాలా పెద్ద ప్లస్ అయ్యింది. ఒకవేళ ఇది సంక్రాంతి లాంటి సీజన్ లో భారీ కంటెంట్ ఉన్న చిత్రాల మధ్య కాంపిటీషన్ కి సై అంటే వంద కోట్లు కలలో మాటే అయ్యేది. ఈ విషయంలో నిర్మాతలు తీసుకున్న శ్రద్ధ, మార్కెట్ పరిస్థితులను తమకు అనుకూలంగా వాడుకున్న తీరు అదిరిపోయే రిజల్ట్ ఇచ్చింది. నువ్వా నేనా అని కవ్వించుకోకుండా ఒంటరిగా రావడమనే అజెండా ధమాకాకు వర్కౌట్ అయ్యింది. ఫైనల్ రన్ కి ఎప్పుడు వచ్చినా ఇక టెన్షన్ లేదు. జనవరి 10 దాకా డామినేషన్ ధమాకాదే కాబట్టి పెద్ద ఫిగర్ తోనే సెలవు తీసుకుంటుంది.
This post was last modified on January 6, 2023 11:20 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…