గత ఏడాది ‘బింబిసార’ మూవీతో బాక్సాఫీస్కు పెద్ద షాకే ఇచ్చాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. పూర్తిగా ఫామ్ కోల్పోయిన అతను ఒక కొత్త దర్శకుడితో కలిసి అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. లుక్స్, యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్.. ఇలా అన్ని విషయాల్లోనూ కెరీర్ బెస్ట్ అనేలా కనిపించాడు ఆ చిత్రంలో కళ్యాణ్ రామ్. జానపద టచ్ ఉన్న ఆ సినిమాతో పెద్ద హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్.. తన తర్వాతి సినిమాకు పూర్తిగా అవతారం, జానర్ మార్చేస్తుండడం విశేషం.
రాజేంద్ర రెడ్డి అనే కొత్త దర్శకుడితో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అతను చేసిన ‘అమిగోస్’ విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేస్తున్న ఒక్కో లుక్ చూసి జనాలు షాకవుతున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ మూడు భిన్న రకాల పాత్రలు చేస్తుండడం విశేషం. ఆ మూడూ ఒక్క వ్యక్తికి సంబంధించిన లుక్స్ కాదు. మనుషులను పోలిన మనుషులు ముగ్గురి చుట్టూ తిరిగే కథ ఇది.
తొలి లుక్లో మోడర్న్ కుర్రాడిలా స్టైలిష్గా కనిపించిన కళ్యాణ్ రామ్.. రెండో లుక్లో ఫార్మల్ డ్రెస్, కళ్లజోడుతో ఒక సగటు ఉద్యోగిలా కనిపించాడు. లేటెస్ట్గా రిలీజ్ చేసిన మూడో లుక్లో అతన పూర్తి భిన్నమైన అవతారంలో కినపించాడు. గుబురు గడ్డం, అందులో తెల్ల వెంట్రుకలు, జులపాల జుట్టు, చేతిలో గన్నుతో వయొలెంట్గా కనిపించాడు కళ్యాణ్. సినిమాలో ఇది నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయి ఉండొచ్చని భావిస్తున్నారు.
‘118’ తరహాలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ లాగా కనిపిస్తోందీ చిత్రం. ఇప్పటిదాకా డిఫరెంట్ లుక్స్తో రిలీజ్ చేసిన పోస్టర్లయితే భలే ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. మరి సినిమా కూడా అంతే భిన్నంగా ఉండి ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి రేసులో నిలిపారు మేకర్స్. ఆ నెల 3న ప్రేక్షకుల ముందుకు వస్తుందీ చిత్రం. అదే రోజు సందీప్ కిషన్ ‘మైకేల్’ పాన్ ఇండియా మూవీతో ఇది పోటీ పడుతుంది.
This post was last modified on January 5, 2023 8:01 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…