మళ్లీ షూటింగ్స్ మొదలుపెట్టుకోవడం కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగి తిరిగి అనుమతులు సంపాదించారు టాలీవుడ్ పెద్దలు. సమావేశాలు, ప్రెస్ మీట్లతో హంగామా నడిచింది ఆ మధ్య. ఇంతా చేసి చివరికి అనుమతులు ఇస్తే.. టాలీవుడ్లో ఏ పెద్ద సినిమా కూడా తిరిగి షూటింగ్ మొదలుపెట్టుకోలేదు.
చిన్నా చితకా సినిమాలు కొన్ని ధైర్యం చేసి చిత్రీకరణ పునఃప్రారంభించాయి. కానీ మళ్లీ భయపడి వెనక్కి తగ్గాయి. టీవీ సీరియళ్ల షూటింగ్స్ చేయడం.. కొన్ని కరోనా కేసులు బయటపడటంతో భయపడి వాటికీ బ్రేక్ వేశారు.
హైదరాబాద్లో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతండటంతో నిర్మాతలు ధైర్యం చేస్తున్నా.. హీరోలైతే వద్దుబాబోయ్ అనేస్తున్నారని.. అందుకే షూటింగ్స్ పునఃప్రారంభం కావడం లేదని తెలుస్తోంది. ఐతే మన హీరోలు ఇలా భయపడుతుంటే.. తెలుగు వాళ్లకు కూడా బాగా పరిచయం ఉన్న కన్నడ సూపర్ స్టార్ సుదీప్.. వచ్చి హైదరాబాద్లో తన సినిమా షూటింగ్ మొదలుపెట్టడం విశేషం. కొన్ని నెలల విరామం తర్వాత అతను మళ్లీ మేకప్ వేసుకున్నాడు.
తన కొత్త చిత్రం ఫాంటమ్ షూటింగ్ను హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో మొదలుపెట్టాడు. రంగితరంగ లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీ తీసిన అనూప్ బండారి ఈ చిత్రానికి దర్శకుడు. మళ్లీ షూటింగ్లో పాల్గొన్న సందర్భంగా ఆ ఎగ్జైట్మెంట్తో ఒక చిన్న వీడియో కూడా వదిలాడు సుదీప్. మనవాళ్లు కరోనాకు భయపడుతుంటే.. ఓ కన్నడ హీరో ఇలా హైదరాబాద్ వచ్చి తన సినిమా షూటింగ్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on July 20, 2020 11:19 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…