మళ్లీ షూటింగ్స్ మొదలుపెట్టుకోవడం కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగి తిరిగి అనుమతులు సంపాదించారు టాలీవుడ్ పెద్దలు. సమావేశాలు, ప్రెస్ మీట్లతో హంగామా నడిచింది ఆ మధ్య. ఇంతా చేసి చివరికి అనుమతులు ఇస్తే.. టాలీవుడ్లో ఏ పెద్ద సినిమా కూడా తిరిగి షూటింగ్ మొదలుపెట్టుకోలేదు.
చిన్నా చితకా సినిమాలు కొన్ని ధైర్యం చేసి చిత్రీకరణ పునఃప్రారంభించాయి. కానీ మళ్లీ భయపడి వెనక్కి తగ్గాయి. టీవీ సీరియళ్ల షూటింగ్స్ చేయడం.. కొన్ని కరోనా కేసులు బయటపడటంతో భయపడి వాటికీ బ్రేక్ వేశారు.
హైదరాబాద్లో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతండటంతో నిర్మాతలు ధైర్యం చేస్తున్నా.. హీరోలైతే వద్దుబాబోయ్ అనేస్తున్నారని.. అందుకే షూటింగ్స్ పునఃప్రారంభం కావడం లేదని తెలుస్తోంది. ఐతే మన హీరోలు ఇలా భయపడుతుంటే.. తెలుగు వాళ్లకు కూడా బాగా పరిచయం ఉన్న కన్నడ సూపర్ స్టార్ సుదీప్.. వచ్చి హైదరాబాద్లో తన సినిమా షూటింగ్ మొదలుపెట్టడం విశేషం. కొన్ని నెలల విరామం తర్వాత అతను మళ్లీ మేకప్ వేసుకున్నాడు.
తన కొత్త చిత్రం ఫాంటమ్ షూటింగ్ను హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో మొదలుపెట్టాడు. రంగితరంగ లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీ తీసిన అనూప్ బండారి ఈ చిత్రానికి దర్శకుడు. మళ్లీ షూటింగ్లో పాల్గొన్న సందర్భంగా ఆ ఎగ్జైట్మెంట్తో ఒక చిన్న వీడియో కూడా వదిలాడు సుదీప్. మనవాళ్లు కరోనాకు భయపడుతుంటే.. ఓ కన్నడ హీరో ఇలా హైదరాబాద్ వచ్చి తన సినిమా షూటింగ్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on July 20, 2020 11:19 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…