సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాల్లో ముందుగా డబ్బింగ్ సినిమాల ట్రైలర్స్ ఒకటి తర్వాత మరొకటి రిలీజ్ అయ్యాయి. ఇటీవల ‘తెగింపు’ ట్రెయిలర్ వచ్చింది. అజిత్ ఈ ట్రైలర్ తో మంచి మార్కులు స్కోర్ చేసి ఎట్రాక్ట్ చేశాడు. ఈసారి విజయ్ వంతు. తాజాగా ‘వారసుడు’ ట్రెయిలర్ రిలీజైంది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ ట్రైలర్ ట్రోలర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చేసింది.
ఇప్పటి వారసుడు మీద ఉన్న ఓ మోస్తారు అంచనాలు కూడా ట్రెయిలర్ తుడిచేసింది. వారసుడు కోసం వంశీ పైడిపల్లి తెలుగులో వచ్చిన ఫ్యామిలీ మిక్స్డ్ కమర్షియల్ స్టోరీనే తీసుకోవడం అందరినీ నిరాశ పరుస్తోంది. ఈ కోవలో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఉమ్మడి కుటుంబం , సాఫీగా సాగుతున్న వారి జీవితంలో ఓ వ్యాపార సమస్య, హీరో ఫాదర్ కంపెనీ దక్కించుకునేందుకు చూసే స్టైలిష్ విలన్… ఫైనల్ గా హీరో విలన్ కి చెక్ పెట్టి మళ్లీ తన కుటుంబాన్ని సంతోషంగా ఉండేలా చేయడం, ఇలా విజయ్ కోసం వంశీ పడిపల్లి ఓ రొటీన్ ఫార్ములా ఫ్యామిలీ కథే రాసుకోవడంతో నెటిజన్లు వారసుడు ట్రైలర్ ని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.
దాదాపు ఇదే కథతో ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ , రాం చరణ్, ఇలా స్టార్స్ అంతా తెలుగులో సినిమాలు చేసేశారు. మరి కోలీవుడ్ ఎంట్రీ కోసం వంశీ రొటీన్ అనిపించే తెలుగు కథనే అటు ఇటు చేసి కొన్ని మార్పులతో ఈ సినిమా తీశాడంటూ ట్రోలర్స్ వీడియో లతో ట్రోలింగ్ మొదలెట్టారు. అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం, సరైనోడు, అల వైకుంఠ పురం, అజ్ఞాత వాసి , మహర్షి సినిమాల ఛాయలు వారసుడు లో గట్టిగా కనిపిసున్నాయి. మరి ఈ రొటీన్ కథతో వంశీ పైడిపల్లి తమిళ్, తెలుగు ప్రేక్షకులని సంక్రాంతి బరిలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
This post was last modified on January 4, 2023 9:48 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…