సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాల్లో ముందుగా డబ్బింగ్ సినిమాల ట్రైలర్స్ ఒకటి తర్వాత మరొకటి రిలీజ్ అయ్యాయి. ఇటీవల ‘తెగింపు’ ట్రెయిలర్ వచ్చింది. అజిత్ ఈ ట్రైలర్ తో మంచి మార్కులు స్కోర్ చేసి ఎట్రాక్ట్ చేశాడు. ఈసారి విజయ్ వంతు. తాజాగా ‘వారసుడు’ ట్రెయిలర్ రిలీజైంది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ ట్రైలర్ ట్రోలర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చేసింది.
ఇప్పటి వారసుడు మీద ఉన్న ఓ మోస్తారు అంచనాలు కూడా ట్రెయిలర్ తుడిచేసింది. వారసుడు కోసం వంశీ పైడిపల్లి తెలుగులో వచ్చిన ఫ్యామిలీ మిక్స్డ్ కమర్షియల్ స్టోరీనే తీసుకోవడం అందరినీ నిరాశ పరుస్తోంది. ఈ కోవలో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఉమ్మడి కుటుంబం , సాఫీగా సాగుతున్న వారి జీవితంలో ఓ వ్యాపార సమస్య, హీరో ఫాదర్ కంపెనీ దక్కించుకునేందుకు చూసే స్టైలిష్ విలన్… ఫైనల్ గా హీరో విలన్ కి చెక్ పెట్టి మళ్లీ తన కుటుంబాన్ని సంతోషంగా ఉండేలా చేయడం, ఇలా విజయ్ కోసం వంశీ పడిపల్లి ఓ రొటీన్ ఫార్ములా ఫ్యామిలీ కథే రాసుకోవడంతో నెటిజన్లు వారసుడు ట్రైలర్ ని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.
దాదాపు ఇదే కథతో ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ , రాం చరణ్, ఇలా స్టార్స్ అంతా తెలుగులో సినిమాలు చేసేశారు. మరి కోలీవుడ్ ఎంట్రీ కోసం వంశీ రొటీన్ అనిపించే తెలుగు కథనే అటు ఇటు చేసి కొన్ని మార్పులతో ఈ సినిమా తీశాడంటూ ట్రోలర్స్ వీడియో లతో ట్రోలింగ్ మొదలెట్టారు. అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం, సరైనోడు, అల వైకుంఠ పురం, అజ్ఞాత వాసి , మహర్షి సినిమాల ఛాయలు వారసుడు లో గట్టిగా కనిపిసున్నాయి. మరి ఈ రొటీన్ కథతో వంశీ పైడిపల్లి తమిళ్, తెలుగు ప్రేక్షకులని సంక్రాంతి బరిలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
This post was last modified on January 4, 2023 9:48 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…