Movie News

నాగ్‌తో అనుకున్న సినిమా వేరేవాళ్లతో..?

కోలీవుడ్లో మల్టీ టాలెంట్ ఉన్న హీరోల్లో ధనుష్ ఒకడు. అతను కేవలం నటుడు మాత్రమే కాదు.. సింగర్, లిరిసిస్ట్, రైటర్, డైరెక్టర్. అన్ని రకాలుగానూ తన టాలెంట్ ఏంటో చూపించాడు. ‘పవర్ పాండి’ సినిమాతో రైటర్ కమ్ డైరెక్టర్‌గా ధనుష్ తన అభిరుచిని చాటుకున్నాడు. సీనియర్ నటుడు రాజ్ కిరణ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా మంచి హిట్టయింది. అందులో రాజ్ యంగ్ ఏజ్ క్యారెక్టర్ని ధనుషే చేశాడు.

ఈ సినిమా తర్వాత కొంచెం పెద్ద బడ్జెట్లో, భారీ కాన్వాస్‌లో ‘రుద్ర’ అనే సినిమా చేయడానికి ధనుష్ కొన్నేళ్ల ముందు రంగం సిద్ధం చేసుకున్నాడు. తనే ముఖ్య పాత్ర పోషిస్తూ.. నాగార్జున, అరవింద్ స్వామి లాంటి సీనియర్ నటులను కీలక పాత్రలకు ఎంచుకున్నాడు. ఈ సినిమాకు అంతా ఓకే చేసుకుని, ఇక షూటింగ్‌కు వెళ్లడమే ఆలస్యం అనుకున్నారు.

కానీ ఏం జరిగిందో ఏమో.. ఉన్నట్లుండి ఆ చిత్రానికి బ్రేక్ పడింది. బహుశా బడ్జెట్ సమస్యల వల్లే సినిమా ఆగిపోయి ఉంటుందని ప్రచారం జరిగింది. కొన్నేళ్ల పాటు దర్శకత్వం ఊసే ఎత్తని ధనుష్.. ఇప్పుడు మళ్లీ తన డ్రీమ్ ప్రాజెక్టును బయటికి తీస్తున్నట్లు సమాచారం. ధనుష్ కోరుకున్న బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీయడానికి సన్ పిక్చర్స్ వాళ్లు ముందుకు వచ్చారట. కాకపోతే ఈసారి కాస్టింగ్ అంతా మారిపోతున్నట్లు తెలుస్తోంది.

నాగ్, అరవింద్ స్వామి సహా ఇంతకుముందు అనుకున్న ఆర్టిస్టులందరినీ మార్చేస్తున్నారట. ఎస్.జె.సూర్య, విష్ణు విశాల్ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తారట. వీరికి తోడు ధనుష్ కూడా నటిస్తాడట. కథను కూడా కొంచెం మార్చి కొత్త టైటిల్‌తో రంగంలోకి దిగనున్నాడట ధనుష్. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ధనుష్.. ‘కెప్టెన్ మిల్లర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. వెంకీ అట్లూరితో చేసిన ‘సార్’ విడుదలకు సిద్ధమవుతోంది. శేఖర్ కమ్ములతో ఇటీవలే ధనుష్ ఓ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Satya

Recent Posts

దృశ్యం 3 తెలుగు అభిమానులకు షాక్

రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…

3 minutes ago

ఈ రచ్చ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…

47 minutes ago

కన్నప్ప పునఃదర్శనం ఇంత త్వరగానా

మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…

1 hour ago

సాయికృష్ణ ఘటనపై చంద్రబాబు సీరియస్

విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…

2 hours ago

అమెరికా గ‌ట్టి స‌వాల్… ఇప్పుడైనా మోడీ నోరువిప్పేనా?

అమెరికానుంచి త‌ర‌చుగా భార‌త్‌కు అనేక స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. వ‌ల‌స విధానానికి సంబంధించి, హెచ్‌-1బీ వీసాల‌కు సంబంధించి కూడా భార‌త్‌కు అమెరికా…

3 hours ago

ఇలాగైతే వైసీపీని దేవుడు కూడా కాపాడలేడు

ఓ పరామర్శ అయినా, ఓ సాయం అయినా, ఓ ఓదార్పు అయినా, ఓ కేసు అయినా, ఓ పథకం అయినా……

3 hours ago