కోలీవుడ్లో మల్టీ టాలెంట్ ఉన్న హీరోల్లో ధనుష్ ఒకడు. అతను కేవలం నటుడు మాత్రమే కాదు.. సింగర్, లిరిసిస్ట్, రైటర్, డైరెక్టర్. అన్ని రకాలుగానూ తన టాలెంట్ ఏంటో చూపించాడు. ‘పవర్ పాండి’ సినిమాతో రైటర్ కమ్ డైరెక్టర్గా ధనుష్ తన అభిరుచిని చాటుకున్నాడు. సీనియర్ నటుడు రాజ్ కిరణ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా మంచి హిట్టయింది. అందులో రాజ్ యంగ్ ఏజ్ క్యారెక్టర్ని ధనుషే చేశాడు.
ఈ సినిమా తర్వాత కొంచెం పెద్ద బడ్జెట్లో, భారీ కాన్వాస్లో ‘రుద్ర’ అనే సినిమా చేయడానికి ధనుష్ కొన్నేళ్ల ముందు రంగం సిద్ధం చేసుకున్నాడు. తనే ముఖ్య పాత్ర పోషిస్తూ.. నాగార్జున, అరవింద్ స్వామి లాంటి సీనియర్ నటులను కీలక పాత్రలకు ఎంచుకున్నాడు. ఈ సినిమాకు అంతా ఓకే చేసుకుని, ఇక షూటింగ్కు వెళ్లడమే ఆలస్యం అనుకున్నారు.
కానీ ఏం జరిగిందో ఏమో.. ఉన్నట్లుండి ఆ చిత్రానికి బ్రేక్ పడింది. బహుశా బడ్జెట్ సమస్యల వల్లే సినిమా ఆగిపోయి ఉంటుందని ప్రచారం జరిగింది. కొన్నేళ్ల పాటు దర్శకత్వం ఊసే ఎత్తని ధనుష్.. ఇప్పుడు మళ్లీ తన డ్రీమ్ ప్రాజెక్టును బయటికి తీస్తున్నట్లు సమాచారం. ధనుష్ కోరుకున్న బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీయడానికి సన్ పిక్చర్స్ వాళ్లు ముందుకు వచ్చారట. కాకపోతే ఈసారి కాస్టింగ్ అంతా మారిపోతున్నట్లు తెలుస్తోంది.
నాగ్, అరవింద్ స్వామి సహా ఇంతకుముందు అనుకున్న ఆర్టిస్టులందరినీ మార్చేస్తున్నారట. ఎస్.జె.సూర్య, విష్ణు విశాల్ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తారట. వీరికి తోడు ధనుష్ కూడా నటిస్తాడట. కథను కూడా కొంచెం మార్చి కొత్త టైటిల్తో రంగంలోకి దిగనున్నాడట ధనుష్. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ధనుష్.. ‘కెప్టెన్ మిల్లర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. వెంకీ అట్లూరితో చేసిన ‘సార్’ విడుదలకు సిద్ధమవుతోంది. శేఖర్ కమ్ములతో ఇటీవలే ధనుష్ ఓ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
This post was last modified on January 4, 2023 9:39 pm
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…