2021 దసరాకు ‘పెళ్ళిసంద-డి’ అనే చిన్న సినిమా రిలీజైంది. అందులోని కథాకథనాలు చూస్తే మూడు దశాబ్దాల వెనక్కి వెళ్లి అప్పటి సినిమాలు చూస్తున్న ఫీలింగ్ కలిగింది. మరీ ముతకగా అనిపించే కథ.. ఔట్ డేటెడ్ నరేషన్తో సినిమా ప్రేక్షకులకు చుక్కలు చూపించింది. ఐతే అలాంటి సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితమే దక్కింది. అందుకు ముఖ్య కారణం.. అందమైన యువ జంట.. ఆహ్లాదకరమైన పాటలు.. వాటి చిత్రీకరణ. హీరో హీరోయిన్లను చూడ్డానికే చాలా వరకు జనం థియేటర్లకు వెళ్లారు.
ఈ చిత్రంతోనే పూర్తి స్థాయి హీరోగా మారిన శ్రీకాంత్ కొడుకు రోషన్.. తెలుగులోకి అరంగేట్రం చేసిన కన్నడ కథానాయిక శ్రీలీల ప్రేక్షకుల మెప్పు పొందారు. వీరికి మంచి భవిష్యత్తు ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అంచనాలకు తగ్గట్లే శ్రీలీలకు తెలుగులో అవకాశాలు వరుస కట్టేశాయి. ఆల్రెడీ రవితేజతో ఆమె నటించిన ధమాకా రిలీజై సూపర్ హిట్ దిశగా అడుగులేస్తోంది. ఇందులో శ్రీలీల మరోసారి ప్రేక్షకులను తన అందం, డ్యాన్స్తో ఫిదా చేసేసింది.
తొలి సినిమాను మించి రెండో చిత్రం పెద్ద హిట్టవడంతో శ్రీలీల టాలీవుడ్లో నెక్స్ట్ బిగ్ స్టార్ హీరోయిన్గా అవతరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె ఇప్పటికే బాలయ్య సినిమాలో ముఖ్య పాత్ర చేస్తోంది. ఇంకో రెండు మూడు సినిమాలు తన చేతిలో ఉన్నాయి. ‘పెళ్ళిసంద-డి’ హీరోయిన్ ఇలా దూసుకెళ్తుంటే.. హీరో రోషన్ మాత్రం ఏడాది తర్వాత కూడా అడ్రస్ లేడు.
హీరోయిన్ల మాదిరి హీరోలు గ్యాప్ లేకుండా, వరుసబెట్టి సినిమాలు చేసేయరన్నది వాస్తవమే. ‘పెళ్ళిసంద-డి’తో దక్కిన విజయాన్ని, పేరును నిలబెట్టుకుంటూ మంచి సినిమా చేయాలని, స్టార్గా ఎస్టాబ్లిష్ కావాలని రోషన్ జాగ్రత్తగా అడుగులు వేస్తుండొచ్చు. కానీ ఇప్పటికీ తన తర్వాతి సినిమా ఏదో తేల్చుకోకపోవడం.. కొత్త సినిమా గురించి చిన్న హింట్ కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. మరీ ఇంత గ్యాప్ వస్తే జనాలు కుర్రాడిని మరిచిపోతారు. ‘పెళ్ళిసంద-డి’తో వచ్చిన ఊపు కంటిన్యూ అవ్వదు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా రోషన్ కొత్త సినిమాను ఓకే చేసి పట్టాలెక్కించాల్సిన బాధ్యత అతడి తండ్రి శ్రీకాంత్దే.
This post was last modified on January 4, 2023 2:25 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…