టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు వెళ్లిన తాప్సి పన్ను.. అక్కడ ఏ అండా లేకుండా సొంతంగా కష్టపడి నిలదొక్కుకుంది. తనకంటూ మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు తన పేరు మీద సినిమాలు ఆడే రేంజ్ వచ్చింది. తన లాగే కష్టపడి ఎదిగిన తాప్సిని చూసి సంతోషించాల్సిన, ప్రోత్సహించాల్సిన కంగనా రనౌత్ పదే పదే ఆమెను టార్గెట్ చేయడం.. దారుణమైన కామెంట్లు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం.
తాప్సి తనను కాపీ కొడుతుందని.. ఆమె ఎప్పుడూ బాలీవుడ్ మాఫియాకు సపోర్ట్ చేస్తుందని.. తరచుగా విమర్శలు చేస్తూ ఉంటుంది కంగనా. తాజాగా మరోసారి తాప్సిని టార్గెట్ చేసిందామె. తాప్సి గురించి పాజిటివ్ కామెంట్ చేస్తున్నట్లే చేసి.. ఆమెను కించపరిచే వ్యాఖ్యలు చేసింది ఓ ఇంటర్వ్యూలో కంగనా.
తాప్సి, స్వర భాస్కర్ ప్రతిభావంతులైన నటీమణులని.. కానీ వాళ్లు బాలీవుడ్ మాఫియా కారణంగా బి-గ్రేడ్ హీరోయిన్లుగా మిగిలిపోయారని వ్యాఖ్యానించింది కంగనా. తాప్సి లాంటి వాళ్లు నెపోటిజం బ్యాచ్కు సపోర్ట్ చేస్తారని.. వీళ్ల వల్లే నెపోటిజం వర్ధిల్లుతోందని కూడా కంగనా కామెంట్ చేసింది.
దీనిపై తాప్సి సెటైరికల్గా ఓ ట్వీట్ వేసింది. తనను, స్వరను బి-గ్రేడ్ హీరోయిన్లుగా కంగనా పేర్కొనడంపై స్పందిస్తూ.. 10, 12 తరగతుల్లో గ్రేడ్లు ఇచ్చేవారని, ఇప్పుడు కూడా గ్రేడింగ్స్ ఇస్తున్నారా అని ఆమె ప్రశ్నించింది. తాను కరణ్ జోహార్ సపోర్టర్ అంటూ కంగనా చేసిన ఆరోపణలపై ఆమె స్పందిస్తూ.. తాను ఎప్పుడూ కరణ్ను పొగడలేదని.. అలాగని తిట్టాల్సిన అవసరం కూడా లేదని అంది.
This post was last modified on July 20, 2020 7:15 am
నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా నిలవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…