టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు వెళ్లిన తాప్సి పన్ను.. అక్కడ ఏ అండా లేకుండా సొంతంగా కష్టపడి నిలదొక్కుకుంది. తనకంటూ మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు తన పేరు మీద సినిమాలు ఆడే రేంజ్ వచ్చింది. తన లాగే కష్టపడి ఎదిగిన తాప్సిని చూసి సంతోషించాల్సిన, ప్రోత్సహించాల్సిన కంగనా రనౌత్ పదే పదే ఆమెను టార్గెట్ చేయడం.. దారుణమైన కామెంట్లు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం.
తాప్సి తనను కాపీ కొడుతుందని.. ఆమె ఎప్పుడూ బాలీవుడ్ మాఫియాకు సపోర్ట్ చేస్తుందని.. తరచుగా విమర్శలు చేస్తూ ఉంటుంది కంగనా. తాజాగా మరోసారి తాప్సిని టార్గెట్ చేసిందామె. తాప్సి గురించి పాజిటివ్ కామెంట్ చేస్తున్నట్లే చేసి.. ఆమెను కించపరిచే వ్యాఖ్యలు చేసింది ఓ ఇంటర్వ్యూలో కంగనా.
తాప్సి, స్వర భాస్కర్ ప్రతిభావంతులైన నటీమణులని.. కానీ వాళ్లు బాలీవుడ్ మాఫియా కారణంగా బి-గ్రేడ్ హీరోయిన్లుగా మిగిలిపోయారని వ్యాఖ్యానించింది కంగనా. తాప్సి లాంటి వాళ్లు నెపోటిజం బ్యాచ్కు సపోర్ట్ చేస్తారని.. వీళ్ల వల్లే నెపోటిజం వర్ధిల్లుతోందని కూడా కంగనా కామెంట్ చేసింది.
దీనిపై తాప్సి సెటైరికల్గా ఓ ట్వీట్ వేసింది. తనను, స్వరను బి-గ్రేడ్ హీరోయిన్లుగా కంగనా పేర్కొనడంపై స్పందిస్తూ.. 10, 12 తరగతుల్లో గ్రేడ్లు ఇచ్చేవారని, ఇప్పుడు కూడా గ్రేడింగ్స్ ఇస్తున్నారా అని ఆమె ప్రశ్నించింది. తాను కరణ్ జోహార్ సపోర్టర్ అంటూ కంగనా చేసిన ఆరోపణలపై ఆమె స్పందిస్తూ.. తాను ఎప్పుడూ కరణ్ను పొగడలేదని.. అలాగని తిట్టాల్సిన అవసరం కూడా లేదని అంది.
This post was last modified on July 20, 2020 7:15 am
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…