టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు వెళ్లిన తాప్సి పన్ను.. అక్కడ ఏ అండా లేకుండా సొంతంగా కష్టపడి నిలదొక్కుకుంది. తనకంటూ మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు తన పేరు మీద సినిమాలు ఆడే రేంజ్ వచ్చింది. తన లాగే కష్టపడి ఎదిగిన తాప్సిని చూసి సంతోషించాల్సిన, ప్రోత్సహించాల్సిన కంగనా రనౌత్ పదే పదే ఆమెను టార్గెట్ చేయడం.. దారుణమైన కామెంట్లు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం.
తాప్సి తనను కాపీ కొడుతుందని.. ఆమె ఎప్పుడూ బాలీవుడ్ మాఫియాకు సపోర్ట్ చేస్తుందని.. తరచుగా విమర్శలు చేస్తూ ఉంటుంది కంగనా. తాజాగా మరోసారి తాప్సిని టార్గెట్ చేసిందామె. తాప్సి గురించి పాజిటివ్ కామెంట్ చేస్తున్నట్లే చేసి.. ఆమెను కించపరిచే వ్యాఖ్యలు చేసింది ఓ ఇంటర్వ్యూలో కంగనా.
తాప్సి, స్వర భాస్కర్ ప్రతిభావంతులైన నటీమణులని.. కానీ వాళ్లు బాలీవుడ్ మాఫియా కారణంగా బి-గ్రేడ్ హీరోయిన్లుగా మిగిలిపోయారని వ్యాఖ్యానించింది కంగనా. తాప్సి లాంటి వాళ్లు నెపోటిజం బ్యాచ్కు సపోర్ట్ చేస్తారని.. వీళ్ల వల్లే నెపోటిజం వర్ధిల్లుతోందని కూడా కంగనా కామెంట్ చేసింది.
దీనిపై తాప్సి సెటైరికల్గా ఓ ట్వీట్ వేసింది. తనను, స్వరను బి-గ్రేడ్ హీరోయిన్లుగా కంగనా పేర్కొనడంపై స్పందిస్తూ.. 10, 12 తరగతుల్లో గ్రేడ్లు ఇచ్చేవారని, ఇప్పుడు కూడా గ్రేడింగ్స్ ఇస్తున్నారా అని ఆమె ప్రశ్నించింది. తాను కరణ్ జోహార్ సపోర్టర్ అంటూ కంగనా చేసిన ఆరోపణలపై ఆమె స్పందిస్తూ.. తాను ఎప్పుడూ కరణ్ను పొగడలేదని.. అలాగని తిట్టాల్సిన అవసరం కూడా లేదని అంది.
This post was last modified on July 20, 2020 7:15 am
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు విద్యార్థులను అనుమతిస్తున్నారు. సమావేశాలను వారు ప్రత్యక్షంగా…