Hesham Abdul Wahab
టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి తెలియంది కాదు. తమన్ రెమ్యునరేషన్ ని చిన్న నిర్మాతలు భరించలేరు. టాప్ ప్రొడ్యూసర్లకు డేట్లు ఇవ్వడానికే మహా కష్టమైపోయి ఒక్కోసారి పెద్ద హీరోలకు కూడా యావరేజ్ ఆల్బమ్స్ పడుతున్నాయి. క్రేజీ ప్యాన్ ఇండియా సినిమాల్లో సగం తన చేతిలోనే ఉన్నాయి. ఈ సంక్రాంతికే రెండు బడా రిలీజులు రెడీ అయ్యాయి.
ఇక దేవిశ్రీ ప్రసాద్ హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా తన డిమాండ్ ప్రకారమే పారితోషికం తీసుకుంటున్నాడు. తాజాగా వాల్తేరు వీరయ్య పాటలు క్లిక్ అయ్యాక ఇక తగ్గేదేలే అనడం సహజం. పైగా పుష్ప 2 మీద ఓ రేంజ్ హైప్ ఉంది.
ఇక అనూప్ రూబెన్స్, మిక్కీ జె మేయర్ లాంటి వాళ్ళ గ్రాఫ్ ఒకసారి పైకి మూడుసార్లు కిందికి అన్నట్టు ఎగుడుదిగుడుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ల అవసరం చాలా ఉంది. పక్కన అనిరుద్ రవిచందర్ భీభత్సమైన ఫామ్ లో ఉన్నా మనవాళ్లకు చిక్కడం లేదు. త్రివిక్రమ్ పట్టుకొచ్చి అజ్ఞాతవాసి ఇస్తే అది కాస్తా డిజాస్టర్ అయ్యింది.
నాని జెర్సీ, గ్యాంగ్ లీడర్ కి కోరిమరీ పిలిపించుకున్నాడు. నిరాశ పరచలేదు కానీ పది కాలాల పాటు నిలిచిపోయే సాంగ్స్ అయితే రాలేదు. అందుకే అర్జెంట్ గా ఇంకొన్ని యంగ్ టాలెంట్స్ కావాలి. ఇప్పుడా స్థానంలో హేషం అబ్దుల్ వహాబ్ కనిపిస్తున్నాడు.
మలయాళంలో హృదయంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఇతనికి టాలీవుడ్ డెబ్యూ విజయ దేవరకొండ ఖుషితో దక్కింది. అది లేట్ అవుతోంది కానీ ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చాడనే టాక్ ఉంది. తాజాగా నాని 30 ఆఫర్ వచ్చింది. ఇదీ ఎమోషనల్ జర్నీనే. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ దట్టించినట్టు కాన్సెప్ట్ లాంచ్ వీడియోలో చెప్పేశారు.
ఇవి కనక సరిగ్గా క్లిక్ అయితే అబ్దుల్ వహాబ్ పంట పండినట్టే. కాకపోతే హరీష్ జైరాజ్, యువన్ శంకర్ రాజా, గోపి సుందర్ లాగా ఏదో రెండు మూడేళ్లు తాత్కాలికంగా పద్ధతిలో కాక ఇక్కడే స్థిరపడితే ఓ కొరత తీరిపోతుంది. ఇతననే కాదు రెహమాన్ లాంటి ప్రభంజనాలు ఇండస్ట్రీకి ఇంకా రావాలి
This post was last modified on January 3, 2023 6:09 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…