Movie News

ఎన్టీఆర్ భలే డేట్ పట్టాడుగా..

జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరుగుతున్నా ఓపిగ్గా ఉంటున్నారు. ఐతే వారికి ఉత్సాహాన్నిస్తూ ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుందని, 2024 ఏప్రిల్ 5న సినిమా రిలీజవుతుందని తాజాగా ప్రకటన విడుదల చేసింది చిత్ర బృందం.

ఇంకా షూటింగ్ మొదలవకముందే రిలీజ్ డేట్ ప్రకటించడం ఏంటని ఆశ్చర్యం కలిగినా.. పాన్ ఇండియా స్థాయలో రిలీజయ్యే ఈ చిత్రానికి ముందే డేట్ ఇవ్వడం ద్వారా ఇంకెవరూ కర్చీఫ్ వేయకుండా చూసుకోవాలని చిత్ర బృందం భావించినట్లుంది. రిలీజ్ డేట్ విషయంలో కొరటాల అండ్ టీం ప్లానింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారిప్పుడు. ఎన్టీఆర్ చాలా మంచి డేటే పట్టేశాడన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏప్రిల్ 5 శుక్రవారం కాగా.. ఆ వీకెండ్లో సినిమా జోరు చూపించడం ఖాయం. ఇక 9న ఉగాది పండుగ వస్తోంది. కాబట్టి ఆ రోజు సెలవు బాగా కలిసి వస్తుంది. తర్వాత 11వ తారీఖు రంజాన్ సెలవు ఉంది. కాబట్టి ఆ రోజూ సినిమా సందడి కొనసాగే అవకాశముంది. సినిమాకు మంచి టాక్ వచ్చి ఎక్కువ రోజులు నిలబడేట్లయితే.. తర్వాత కూడా కలిసి మరో సెలవు కలిసి వస్తుంది. 17న శ్రీరామ నవమి కావడంతో రెండో వారంలో కూడా సినిమాకు అడ్వాంటేజ్ దక్కనున్నట్లే.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి.. బాలీవుడ్లో భారీ చిత్రాలేవీ లేకపోయి, తన సినిమాకు మంచి టాక్ తెచ్చుకున్నాడంటే వసూళ్ల మోత మోగిపోవడం ఖాయం. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరికి చిత్రీకరణ పూర్తి చేసి.. ఆ తర్వాత నాలుగు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపట్టనున్నారు. ఈ చిత్రానికి జాన్వి కపూర్‌ను కథానాయికగా ఎంచుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

This post was last modified on January 2, 2023 2:07 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…

5 hours ago

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

8 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

8 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

9 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

10 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

11 hours ago