ఏడాదికి ఎన్ని సినిమాలొచ్చినా తమ అభిమాన హీరో నుండి ఓ సినిమా రాలేదనే వెలితి ఫ్యాన్స్ లో ఉంటుంది. గతేడాది అల్లు అర్జున్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. సుకుమార్ ‘పుష్ప 2’ తో బన్నీ ని మరో సినిమా చేయకుండా సంవత్సరం పైనే బ్లాక్ చేసేశాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి లాస్ట్ ఇయర్ నిరాశే మిగిలింది. ఇక ఈ ఇయర్ లో అయినా పుష్ప 2 థియేటర్స్ లోకి వస్తుందా ? అంటే చెప్పలేని పరిస్థితి. షూటింగ్ నత్త నడకన సాగడమే అందరికీ సందేహం కలిగిస్తుంది.
ఇక తాజాగా ఎన్టీయార్ ను కూడా కొరటాల శివ ఏడాది పాటు మరో సినిమా చేయకుండా బ్లాక్ చేసేశాడు. #NTR30 సినిమా 2023 లో రావడం లేదని తాజా ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. దీంతో యన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఇయర్ తమ హీరో సినిమా రాదని తెలిసి నిరాశ చెందుతున్నారు. పోనీయ్ 2024 సంక్రాంతి కానుకగా అని ప్రకటించినా వారు సంతోష పడేవారేమో కానీ వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్ అని తెలిశాక తీవ్ర నిరాశకి లోనవుతున్నారు. కొందరు అభిమనులైతే అన్నీ నెలలు ఏం తీస్తావ్ అంటూ కోపంతో కొరటాలను సోషల్ మీడియాలో నేరుగా ప్రశ్నిస్తున్నారు.
నిజానికి ‘ ఆచార్య’ తర్వాత కొరటాల ఎన్టీఆర్ సినిమా కోసం చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. అన్నీ ఆచి తూచి ప్లాన్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. ఫిబ్రవరి నుండి షూటింగ్ మొదలు పెట్టి ఎక్కువ రోజులు తీయబోతున్నాడు. అల్లు అర్జున్ నుండి ఒక ఏడాది సుకుమార్ లాగేసుకొని అభిమనులని నిరాశ పరిస్తే ఇప్పుడు సుక్కు రూట్లోనే ఎన్టీఆర్ ను బ్లాక్ చేసి తారక్ ఫ్యాన్స్ ను న్యూ ఇయర్ రోజు డిసప్పాయింట్ చేశాడు కొరటాల. ఏదేమైనా స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలకు ఇంత టైమ్ తీసుకుంటే ఎలా మరి సుక్కు , కొరటాల ఆలోచించాల్సిందే .
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…