టాలీవుడ్లో ఏ పెద్ద సినిమా రిలీజవుతున్నా.. నైజాం ఏరియా హక్కులు దక్కించుకోవడానికి ముందుండేది దిల్ రాజే. ఓవైపు ప్రొడక్షన్లో చాలా బిజీగా ఉన్నా, పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తున్నా సరే.. డిస్ట్రిబ్యూషన్ వదిలేయకుండా ఆ రంగంలోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు Dil Raju.
నైజాంలో థియేటర్ల మీద, అలాగే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మీద తిరుగులేని పట్టున్న రాజు.. పెద్ద సినిమాలకు ఫ్యాన్సీ ఆఫర్లు ఇచ్చి తన సంస్థ ద్వారా రిలీజ్ చేస్తుంటారు. టాలీవుడ్లో కొన్ని పెద్ద బేనర్లు సొంతంగా నైజాంలో తమ సినిమాలను రిలీజ్ చేసుకున్నా సరే.. రాజు సహకారం లేకుండా పని సాఫీగా నడవదన్నది ఇండస్ట్రీ వర్గాల మాట.
ఐతే సంస్థ మొదలైన దగ్గర్నుంచి తమ చిత్రాలను Dil Raju కే ఇస్తూ వచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. ఇప్పుడు సొంతంగా నైజాంలో డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏర్పాటు చేసుకుని సంక్రాంతికి తమ సంస్థ నుంచి వస్తున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలను దాన్నుంచే రిలీజ్ చేయడానికి సిద్ధం కావడం రాజుకు పెద్ద షాక్ అన్న చర్చ నడుస్తోంది.
ఈ విషయమై రాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైత్రీ వాళ్లు సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టుకుని, ఈ బిజినెస్లోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమే అంటూనే.. ఈ విషయంలో తాను హర్టయినట్లు చెప్పకనే చెప్పేశారు రాజు. మైత్రీ సంస్థ తొలి చిత్రాన్ని మినహాయిస్తే ప్రతి సినిమానూ తానే నైజాంలో రిలీజ్ చేశానని.. వాళ్లకు ఫ్యాన్సీ రేట్లు ఇచ్చానని.. ‘ఉప్పెన’ సినిమా విషయంలో చిన్న ఇబ్బంది తలెత్తినా సరే.. ఆ తర్వాత కూడా తనకే ఆ సంస్థ మూడు చిత్రాలను ఇచ్చారని రాజు గుర్తు చేశాడు. నిజంగా తనతో ఏదైనా ఇబ్బంది ఉంటే ‘ఉప్పెన’ తర్వాత తనకు సినిమా ఇచ్చేవారు కాదు కదా అని రాజు అన్నాడు.
మైత్రీ వాళ్లు కేవలం ఇప్పుడు రిలీజ్ చేస్తున్న రెండు సినిమాలతో అంతా అయిపోదని.. రెండేళ్ల తర్వాత బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే తమ నిర్ణయం కరెక్టా కాదా అన్నది అర్థమవుతుందని.. అప్పుడు దిల్ రాజు, శిరీష్ల వర్త్ ఏంటో తెలుస్తుందని.. తమ సంస్థ ద్వారా సినిమాలు రిలీజ్ చేస్తే పని ఎంత సాఫీగా సాగుతుందో.. ఎంత రెవెన్యూ వస్తుందో అర్థమవుతుందని రాజు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే తాను ఇంత కాలం ఎంతో సహకరించినా.. తనను నమ్మకుండా కొత్తగా మైత్రీ వాళ్లు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టడం రాజును కొంత బాధించినట్లే కనిపిస్తోంది.
This post was last modified on December 29, 2022 9:42 pm
పెద్ది కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టేందుకు రామ్…
దక్షిణాది సినీ రంగంలో ఒక ధృవతార రాలిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఆర్.బి.చౌదరి కన్ను…
అది మార్చి.. ఎన్నికలకు 50 రోజులకు పైగానే సమయం ఉంది. సర్వేల సంస్థలు ప్రజలను కలుస్తున్నాయి. మీకు ఏ సీఎం…
తమిళనాడులో విజయ్ జయకేతనం ఎగరేశాక సినిమా తారల రాజకీయ ప్రభావం గురించి మళ్ళీ చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా ముగ్గురు లెజెండ్స్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబోలో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే.…
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారని ఇన్నాళ్లూ జరిగిన ప్రచారంలో అస్సలు నిజం లేదని తేలిపోయింది.…