టాలీవుడ్లో ఏ పెద్ద సినిమా రిలీజవుతున్నా.. నైజాం ఏరియా హక్కులు దక్కించుకోవడానికి ముందుండేది దిల్ రాజే. ఓవైపు ప్రొడక్షన్లో చాలా బిజీగా ఉన్నా, పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తున్నా సరే.. డిస్ట్రిబ్యూషన్ వదిలేయకుండా ఆ రంగంలోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు Dil Raju.
నైజాంలో థియేటర్ల మీద, అలాగే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మీద తిరుగులేని పట్టున్న రాజు.. పెద్ద సినిమాలకు ఫ్యాన్సీ ఆఫర్లు ఇచ్చి తన సంస్థ ద్వారా రిలీజ్ చేస్తుంటారు. టాలీవుడ్లో కొన్ని పెద్ద బేనర్లు సొంతంగా నైజాంలో తమ సినిమాలను రిలీజ్ చేసుకున్నా సరే.. రాజు సహకారం లేకుండా పని సాఫీగా నడవదన్నది ఇండస్ట్రీ వర్గాల మాట.
ఐతే సంస్థ మొదలైన దగ్గర్నుంచి తమ చిత్రాలను Dil Raju కే ఇస్తూ వచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. ఇప్పుడు సొంతంగా నైజాంలో డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏర్పాటు చేసుకుని సంక్రాంతికి తమ సంస్థ నుంచి వస్తున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలను దాన్నుంచే రిలీజ్ చేయడానికి సిద్ధం కావడం రాజుకు పెద్ద షాక్ అన్న చర్చ నడుస్తోంది.
ఈ విషయమై రాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైత్రీ వాళ్లు సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టుకుని, ఈ బిజినెస్లోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమే అంటూనే.. ఈ విషయంలో తాను హర్టయినట్లు చెప్పకనే చెప్పేశారు రాజు. మైత్రీ సంస్థ తొలి చిత్రాన్ని మినహాయిస్తే ప్రతి సినిమానూ తానే నైజాంలో రిలీజ్ చేశానని.. వాళ్లకు ఫ్యాన్సీ రేట్లు ఇచ్చానని.. ‘ఉప్పెన’ సినిమా విషయంలో చిన్న ఇబ్బంది తలెత్తినా సరే.. ఆ తర్వాత కూడా తనకే ఆ సంస్థ మూడు చిత్రాలను ఇచ్చారని రాజు గుర్తు చేశాడు. నిజంగా తనతో ఏదైనా ఇబ్బంది ఉంటే ‘ఉప్పెన’ తర్వాత తనకు సినిమా ఇచ్చేవారు కాదు కదా అని రాజు అన్నాడు.
మైత్రీ వాళ్లు కేవలం ఇప్పుడు రిలీజ్ చేస్తున్న రెండు సినిమాలతో అంతా అయిపోదని.. రెండేళ్ల తర్వాత బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే తమ నిర్ణయం కరెక్టా కాదా అన్నది అర్థమవుతుందని.. అప్పుడు దిల్ రాజు, శిరీష్ల వర్త్ ఏంటో తెలుస్తుందని.. తమ సంస్థ ద్వారా సినిమాలు రిలీజ్ చేస్తే పని ఎంత సాఫీగా సాగుతుందో.. ఎంత రెవెన్యూ వస్తుందో అర్థమవుతుందని రాజు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే తాను ఇంత కాలం ఎంతో సహకరించినా.. తనను నమ్మకుండా కొత్తగా మైత్రీ వాళ్లు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టడం రాజును కొంత బాధించినట్లే కనిపిస్తోంది.
This post was last modified on December 29, 2022 9:42 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…