ఈ మధ్య టాలీవుడ్లో హీరోలను మించి వార్తల్లో నిలుస్తున్నాడు దిల్ రాజు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినా.. బయట స్టేజ్ ఎక్కి ఏదైనా కామెంట్ చేసినా.. వైరల్ అయిపోతున్నాయి. అలాగే ఆయన చర్యలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. గత కొన్ని నెలల్లో రాజు చుట్టూ ముసురుకున్న వివాదాలు కూడా తక్కువ కాదు.
ఈ ఏడాది వేసవిలో రిలీజైన మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ను దిల్ రాజే నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేయగా.. ఈ సినిమా వసూళ్ల గురించి ఆయన చేసిన పరోక్ష వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. డిస్ట్రిబ్యూటర్లుగా తాము నిర్మాతలకు ఇచ్చే వసూళ్ల లెక్కలు వేరని.. వాళ్లు ప్రకటించేవి వేరని ఆయన వ్యాఖ్యానించడం చిన్న దుమారాన్ని రేపింది. ఈ వ్యాఖ్యల విషయంలో మహేష్ బాబు ఫీలయ్యాడని.. తన తర్వాతి చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజుకు ఇవ్వొద్దని హారిక హాసిని క్రియేషన్స్ వాళ్లకు చెప్పాడని గుసగుసలు వినిపించాయి.
ఈ ప్రచారంపై దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. మహేష్ బాబు చాలా సెన్సిటివ్ అని.. ఎవరో ఏదో చెబితే నమ్మేసి ఆ సమయానికి కోపగించుకుని ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని.. కానీ తర్వాత ఏది కరెక్టో అదే చేస్తాడని.. ఏదైనా విషయమై క్లారిటీ ఇస్తే అర్థం చేసుకుంటాడని రాజు పేర్కొన్నాడు. మహేష్ తర్వాతి సినిమాకు తాను ఫ్యాన్సీ రేటు ఇస్తే నిర్మాతలు హక్కులు ఇవ్వకుండా ఉంటారా.. తాను ఒక వేళ ఆ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తే ఏమంటారు అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. పరోక్షంగా తన వ్యాఖ్యల విషయంలో మహేష్ ఫీలైన విషయాన్ని అంగీకరించాడు రాజు.
ఇక తన ‘కార్తికేయ-2’ చిత్రం రిలీజ్ డేట్ మార్పించారంటూ ఓ ఇంటర్వ్యూలో హీరో నిఖిల్ కన్నీళ్లు పెట్టుకోవడంపైనా రాజు స్పందించాడు. అప్పుడు అందరూ తన వైపే వేలు చూపించారని.. ఐతే నిఖిల్ను పక్కన పెట్టుకుని ‘కార్తికేయ-2’ సక్సెస్ మీట్లో దీనిపై తాను వివరణ ఇచ్చానని.. తాను ఏ సినిమానూ దెబ్బ తీయాలని కోరుకోనని రాజు చెప్పాడు. ఆగస్టు తొలి వారంలో మూడు సినిమాలు వస్తే ఇబ్బందని.. ఒక సినిమాను వాయిదా వేసుకుంటే మంచిదని ముగ్గురు నిర్మాతలకూ తాను చెప్పానని.. చివరికి నిఖిల్ సినిమా నిర్మాతలే వెనక్కి తగ్గారని రాజు తెలిపాడు. ఇక ఆగస్టు 22 నుంచి కార్తికేయ-2 వెనక్కి వెళ్లడం గురించి చెబుతూ.. తన ‘థ్యాంక్యూ’ సినిమా ఓవర్ బడ్జెట్ అయిందని.. కాబట్టి పోటీ లేకుండా ‘కార్తికేయ-2’ను వాయిదా వేయించాలని తాను రిక్వెస్ట్ చేశాను తప్ప బలవంతంగా ఆ సినిమా డేట్ మార్పించలేదని రాజు తేల్చేశాడు.
This post was last modified on December 29, 2022 5:01 pm
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…