ఈ మధ్య టాలీవుడ్లో హీరోలను మించి వార్తల్లో నిలుస్తున్నాడు దిల్ రాజు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినా.. బయట స్టేజ్ ఎక్కి ఏదైనా కామెంట్ చేసినా.. వైరల్ అయిపోతున్నాయి. అలాగే ఆయన చర్యలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. గత కొన్ని నెలల్లో రాజు చుట్టూ ముసురుకున్న వివాదాలు కూడా తక్కువ కాదు.
ఈ ఏడాది వేసవిలో రిలీజైన మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ను దిల్ రాజే నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేయగా.. ఈ సినిమా వసూళ్ల గురించి ఆయన చేసిన పరోక్ష వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. డిస్ట్రిబ్యూటర్లుగా తాము నిర్మాతలకు ఇచ్చే వసూళ్ల లెక్కలు వేరని.. వాళ్లు ప్రకటించేవి వేరని ఆయన వ్యాఖ్యానించడం చిన్న దుమారాన్ని రేపింది. ఈ వ్యాఖ్యల విషయంలో మహేష్ బాబు ఫీలయ్యాడని.. తన తర్వాతి చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజుకు ఇవ్వొద్దని హారిక హాసిని క్రియేషన్స్ వాళ్లకు చెప్పాడని గుసగుసలు వినిపించాయి.
ఈ ప్రచారంపై దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. మహేష్ బాబు చాలా సెన్సిటివ్ అని.. ఎవరో ఏదో చెబితే నమ్మేసి ఆ సమయానికి కోపగించుకుని ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని.. కానీ తర్వాత ఏది కరెక్టో అదే చేస్తాడని.. ఏదైనా విషయమై క్లారిటీ ఇస్తే అర్థం చేసుకుంటాడని రాజు పేర్కొన్నాడు. మహేష్ తర్వాతి సినిమాకు తాను ఫ్యాన్సీ రేటు ఇస్తే నిర్మాతలు హక్కులు ఇవ్వకుండా ఉంటారా.. తాను ఒక వేళ ఆ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తే ఏమంటారు అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. పరోక్షంగా తన వ్యాఖ్యల విషయంలో మహేష్ ఫీలైన విషయాన్ని అంగీకరించాడు రాజు.
ఇక తన ‘కార్తికేయ-2’ చిత్రం రిలీజ్ డేట్ మార్పించారంటూ ఓ ఇంటర్వ్యూలో హీరో నిఖిల్ కన్నీళ్లు పెట్టుకోవడంపైనా రాజు స్పందించాడు. అప్పుడు అందరూ తన వైపే వేలు చూపించారని.. ఐతే నిఖిల్ను పక్కన పెట్టుకుని ‘కార్తికేయ-2’ సక్సెస్ మీట్లో దీనిపై తాను వివరణ ఇచ్చానని.. తాను ఏ సినిమానూ దెబ్బ తీయాలని కోరుకోనని రాజు చెప్పాడు. ఆగస్టు తొలి వారంలో మూడు సినిమాలు వస్తే ఇబ్బందని.. ఒక సినిమాను వాయిదా వేసుకుంటే మంచిదని ముగ్గురు నిర్మాతలకూ తాను చెప్పానని.. చివరికి నిఖిల్ సినిమా నిర్మాతలే వెనక్కి తగ్గారని రాజు తెలిపాడు. ఇక ఆగస్టు 22 నుంచి కార్తికేయ-2 వెనక్కి వెళ్లడం గురించి చెబుతూ.. తన ‘థ్యాంక్యూ’ సినిమా ఓవర్ బడ్జెట్ అయిందని.. కాబట్టి పోటీ లేకుండా ‘కార్తికేయ-2’ను వాయిదా వేయించాలని తాను రిక్వెస్ట్ చేశాను తప్ప బలవంతంగా ఆ సినిమా డేట్ మార్పించలేదని రాజు తేల్చేశాడు.
This post was last modified on December 29, 2022 5:01 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…