అక్కినేని అభిమానుల చూపంతా ఇప్పుడు ‘ఏజెంట్’ మీదే ఉంది. భారీ అంచనాల మధ్య ఆ ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసి.. వరుసగా మూడు ఎదురు దెబ్బలు తిన్న అఖిల్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో తొలి విజయాన్నందుకుని.. ఆ తర్వాత చేస్తున్న భారీ చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమాతో అఖిల్ అసలు సత్తా చూపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ కావడం.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లకు పేరుపడ్డ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడంతో దీనిపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ఐతే ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ ఏడాదే ‘ఏజెంట్’ థియేటర్లలోకి దిగాల్సింది.
ముందు ఆగస్టులో రిలీజ్ అన్నారు. తర్వాత క్రిస్మస్ రిలీజ్ అన్న చర్చ నడిచింది. ఆపై 2023 సంక్రాంతికి షెడ్యూల్ అవుతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ డేట్లను సినిమా అందుకోలేకపోయింది. చివరికి ఇప్పుడు ఆ సినిమాను ఫిబ్రవరి రిలీజ్కు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఒక దశలో వేసవి విడుదల గురించి కూడా ఆలోచించారట కానీ.. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం కావడం, వేసవికి తీవ్రమైన పోటీ ఉండడంతో ఫిబ్రవరి రిలీజ్కు ముహూర్తం చూసేశారట. ఆ నెల మూడో వారంలో ‘ఏజెంట్’ రిలీజయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారట. నూతన సంవత్సర కానుకగా ఒక స్టైలిష్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్న ‘ఏజెంట్’ టీం.. అందులోనే రిలీజ్ డేట్ను ప్రకటిస్తుందని సమాచారం.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మోడల్ సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. చాన్నాళ్ల తర్వాత వక్కంతం వంశీ కథతో సురేందర్ రూపొందిస్తున్న సినిమా ఇది. ఇందులో విలన్ల మీద చాలా వైల్డ్గా రైడ్ చేసే సీక్రెట్ ఏజెంట్ పాత్ర చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా టీజర్ చూస్తే ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ అన్న సంకేతాలు కనిపించాయి.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…