మొన్నామధ్య తమిళనాడులో బాబాని భారీ ఎత్తున రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వింతేమీ లేదు కానీ దానికి కూడా తెల్లవారుఝామున నాలుగు గంటలకు షోలు వేస్తే చాలా చోట్ల కిక్కిరిసిపోయి ఫ్యాన్స్ తో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. అసలు అంత పెద్ద డిజాస్టర్ కి ఈ రెస్పాన్స్ ఏంటా అని మీడియా సైతం ఆశ్చర్యపోయింది.
కట్ చేస్తే అదేమీ మన జల్సా, పోకిరి లాగా రికార్డులు పెట్టలేకపోయింది. కానీ డీసెంట్ రెవిన్యూతో ఫ్లాప్ మూవీకి ఈ మాత్రం రావడమే గొప్ప అది రజిని మేనియా ప్రభావమని చెప్పుకునేలా బయట పడింది. కట్ చేస్తే ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇదే ఫాలో అవుతున్నారు
ఎల్లుండి రిలీజ్ కాబోతున్న ఖుషికి మెయిన్ సెంటర్స్ లో సూర్యుడు పొద్దు పొడవకుండానే షోలు వేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో ఉదయం అయిదు నుంచి ఎనిమిది మధ్య ప్రీమియర్లు వేస్తుంటే అన్నీ ఆఫ్ లైన్ లోనే సోల్డ్ అవుట్ అవుతున్నాయి.
నమ్మశక్యం కాని విషయం ఏంటంటే వీటికి సైతం బ్లాక్ వెయ్యి దాకా నడుస్తోందట. క్రేజ్ చూసిన థియేటర్ యాజమాన్యాలు ఏకంగా వారం మొత్తం రోజు నాలుగు ఆటలతో స్క్రీనింగ్ చేసేలా అగ్రిమెంట్లు చేసుకున్నట్టు తెలిసింది. రీ రిలీజుల ట్రెండ్ డౌన్ అవుతున్న సమయంలో ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించేదే
ఇదంతా బాగానే ఉంది ఏదో ఒకటి రెండు రోజులకు అంటే పర్వాలేదు కానీ మరీ వారం మొత్తం జనాన్ని ఫుల్ చేసే కెపాసిటీ ఖుషికి ఉందా అనేది వేచి చూడాలి. ఎందుకంటే గతంలో జల్సాని రెండు మూడు రోజులకు పరిమితం చేసినా మంచి కలెక్షన్లు వచ్చాయి. పోకిరి కూడా అంతే. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి ఓకే అనిపించింది. ఆపై ఇంకేవి వీటిలో సగం కూడా అందుకోలేదు. మరి ఖుషిని మీద ఇంత బజ్ నడుస్తోందంటే చిన్న విషయం కాదు. అసలే ఈ శుక్రవారం మార్కెట్ లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడంతో ధమాకా తర్వాత మూవీ లవర్స్ ఛాయస్ ఖుషినే అవుతోంది. అందుకే ఈ రచ్చ
This post was last modified on December 29, 2022 12:15 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…