సంక్రాంతి సినిమాలకు సంబంధించి ఏ చిన్న కదలిక వచ్చినా సరే ఫ్యాన్స్ వెంటనే అలెర్ట్ అయిపోతున్నారు. కొత్త సంగతులు ఏం వింటామాని విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అసలే చిరంజీవి బాలకృష్ణల మధ్య పండగ క్లాష్. ఇంతకన్నా కిక్ ఇచ్చే అంశం మూవీ లవర్స్ కు ఏముంటుంది. అందుకే వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ అనగానే అభిమానులూ తెగ ఎదురు చూశారు. లైవ్ ఆప్షన్ ఇవ్వడంతో కంటెంట్ గురించి ఏమైనా విశేషాలు బయటికి వస్తాయేమోనని శ్రద్ధగా ఫాలో అయ్యారు. దానికి తగ్గట్టే కొన్ని కీలకమైన ఇన్ ఫుట్స్ లీక్స్ సభా వేదికగా టీమ్ సభ్యులు పంచేసుకున్నారు.
దర్శకుడు బాబీ మాట్లాడుతూ ఆ మధ్య గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోహన్ రాజా మాట్లాడుతూ కేవలం చిరంజీవి కనుసైగతో ఆ బ్లాక్ ని డిజైన్ చేశానని చెప్పారని, అయితే తనకు అలా ఇష్టం ఉండదని, మాస్ ఊగిపోయే విధంగా ఎనిమిది నిమిషాల పాటు స్క్రీన్ మీద మెగాస్టార్ మాస్ యుఫోరియాని గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో చూపించానని తనలో ఫ్యాన్ బాయ్ ని బయట పెట్టేసుకున్నాడు. మొన్నే ఇంట్రో గురించి చెప్పిన మాటలు మర్చిపోక ముందే ఇప్పుడు విశ్రాంతి గురించి కొంత ఇన్ఫో ఇచ్చేశాడు. పూనకాలు అనే ట్యాగ్ లైన్ పెట్టడానికి కారణమే ఈ ఎపిసోడ్ అన్న రీతిలో ఓపెన్ అయిపోయాడు.
మరి ఇక్కడ మాస్ మహారాజ రవితేజ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది మాత్రం బయట పడలేదు. టైటిల్ సాంగ్ లో చూపించిన యాక్షన్ బిట్స్ అన్నీ బహుశా ఈ ఇంటర్వెల్ గురించే అయ్యుండొచ్చు. ఇంతగా చెబుతున్న బాబీ మీద ఫ్యాన్స్ విపరీతమైన అంచనాలు పెంచేసుకుంటున్నారు. అసలే ఆచార్య చేసిన గాయం ఇంకా మానలేదు. గాడ్ ఫాదర్ హిట్టే కానీ గర్వంగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విధంగా ఫైనల్ వసూళ్లు తగ్గిపోయాయి. అందుకే వాల్తేరు వీరయ్య ఆ లెక్కలన్నీ సరిచేయాలనే ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి బాబీ నిజంగా కాన్ఫిడెన్సా అనేది ఇంకో పదిహేను రోజుల్లో తేలిపోతుంది.
This post was last modified on December 28, 2022 8:40 am
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…