రోహిత్ శెట్టి అనే బాలీవుడ్లో తోపు డైరెక్టర్. హిందీలో పదికి పైగా వంద కోట్ల సినిమాలు ఇచ్చిన ఘనత అతడి సొంతం. రొటీన్ కథలకే మంచి మసాలా అద్ది ఈజీగా హిట్ చేసేస్తాడని అతడికి పేరుంది. ఎక్కువగా సౌత్ సినిమాల నుంచి ఇన్స్పైర్ అయి అతను సినిమాలు తీస్తుంటాడు.టెంపర్ సహా కొన్ని సౌత్ సినిమాలను రీమేక్ చేసే అతను హిట్లు కొట్టాడు. అలాంటి వాడు ఈ మధ్య సౌత్ సినిమాలను కొంచెం తక్కువ చేసి మాట్లాడాడు. ఓవైపు దక్షిణాది చిత్రాలను కాపీ కొడుతూ ఈ కామెంట్లేంటి అంటూ అతడి మీద సౌత్ నెటిజన్లు విరుచుకుపడ్డారు.
ఐతే అంత బిల్డప్ ఇచ్చిన రోహిత్ శెట్టికి ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద షాకే తగిలింది. హిట్ మెషీన్గా పేరున్న అతడికి కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ ఎదురైంది. టెంపర్ రీమేక్ సింబా తర్వాత రణ్వీర్ సింగ్తో రోహిత్ తీసిన సర్కస్ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది.
సర్కస్ మీద ముందు మంచి అంచనాలే ఉన్నాయి కానీ.. దీని ట్రైలర్ తుస్సుమనిపించడంతో అంచనాలు పడిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగా జరిగిన సినిమాకు టాక్ కీలకంగా మారింది. కానీ ఇటు రోహిత్, అటు రణ్వీర్ కెరీర్లలో అత్యంత చెత్త సినిమా అనే టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు చుక్కలు కనిపించడం మొదలైంది.
తొలి రోజే చాలా తక్కువ వసూళ్లు రాబట్టిన సర్కస్.. ఆ తర్వాత కూడా ఎంతమాత్రం పుంజుకోలేకపోయింది. పేరుకు భారీ సినిమానే కానీ.. వీకెండ్ మొత్తంలో ఇండియాలో కనీసం 20 కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. ఒకప్పుడైతే ఇలాంటి కాంబినేషన్లో సినిమా రిలీజైతే తొలి రోజే ఈజీగా 20 కోట్లు వచ్చేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడో ఒక సినిమా మాత్రమే ఆడుతోంది. చాలా వరకు బోల్తా కొట్టేస్తున్నాయి. సర్కస్ ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ 50 కోట్లు వసూలు చేయడం కూడా కష్టంగా ఉంది. అంటే దీన్ని కేవలం డిజాస్టర్ అని సరిపెట్టేయలేం. అంతకంటే పెద్ద పదం వాడాలి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…