రోహిత్ శెట్టి అనే బాలీవుడ్లో తోపు డైరెక్టర్. హిందీలో పదికి పైగా వంద కోట్ల సినిమాలు ఇచ్చిన ఘనత అతడి సొంతం. రొటీన్ కథలకే మంచి మసాలా అద్ది ఈజీగా హిట్ చేసేస్తాడని అతడికి పేరుంది. ఎక్కువగా సౌత్ సినిమాల నుంచి ఇన్స్పైర్ అయి అతను సినిమాలు తీస్తుంటాడు.టెంపర్ సహా కొన్ని సౌత్ సినిమాలను రీమేక్ చేసే అతను హిట్లు కొట్టాడు. అలాంటి వాడు ఈ మధ్య సౌత్ సినిమాలను కొంచెం తక్కువ చేసి మాట్లాడాడు. ఓవైపు దక్షిణాది చిత్రాలను కాపీ కొడుతూ ఈ కామెంట్లేంటి అంటూ అతడి మీద సౌత్ నెటిజన్లు విరుచుకుపడ్డారు.
ఐతే అంత బిల్డప్ ఇచ్చిన రోహిత్ శెట్టికి ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద షాకే తగిలింది. హిట్ మెషీన్గా పేరున్న అతడికి కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ ఎదురైంది. టెంపర్ రీమేక్ సింబా తర్వాత రణ్వీర్ సింగ్తో రోహిత్ తీసిన సర్కస్ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది.
సర్కస్ మీద ముందు మంచి అంచనాలే ఉన్నాయి కానీ.. దీని ట్రైలర్ తుస్సుమనిపించడంతో అంచనాలు పడిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగా జరిగిన సినిమాకు టాక్ కీలకంగా మారింది. కానీ ఇటు రోహిత్, అటు రణ్వీర్ కెరీర్లలో అత్యంత చెత్త సినిమా అనే టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు చుక్కలు కనిపించడం మొదలైంది.
తొలి రోజే చాలా తక్కువ వసూళ్లు రాబట్టిన సర్కస్.. ఆ తర్వాత కూడా ఎంతమాత్రం పుంజుకోలేకపోయింది. పేరుకు భారీ సినిమానే కానీ.. వీకెండ్ మొత్తంలో ఇండియాలో కనీసం 20 కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. ఒకప్పుడైతే ఇలాంటి కాంబినేషన్లో సినిమా రిలీజైతే తొలి రోజే ఈజీగా 20 కోట్లు వచ్చేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడో ఒక సినిమా మాత్రమే ఆడుతోంది. చాలా వరకు బోల్తా కొట్టేస్తున్నాయి. సర్కస్ ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ 50 కోట్లు వసూలు చేయడం కూడా కష్టంగా ఉంది. అంటే దీన్ని కేవలం డిజాస్టర్ అని సరిపెట్టేయలేం. అంతకంటే పెద్ద పదం వాడాలి.
This post was last modified on December 27, 2022 6:25 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…