రోహిత్ శెట్టి అనే బాలీవుడ్లో తోపు డైరెక్టర్. హిందీలో పదికి పైగా వంద కోట్ల సినిమాలు ఇచ్చిన ఘనత అతడి సొంతం. రొటీన్ కథలకే మంచి మసాలా అద్ది ఈజీగా హిట్ చేసేస్తాడని అతడికి పేరుంది. ఎక్కువగా సౌత్ సినిమాల నుంచి ఇన్స్పైర్ అయి అతను సినిమాలు తీస్తుంటాడు.టెంపర్ సహా కొన్ని సౌత్ సినిమాలను రీమేక్ చేసే అతను హిట్లు కొట్టాడు. అలాంటి వాడు ఈ మధ్య సౌత్ సినిమాలను కొంచెం తక్కువ చేసి మాట్లాడాడు. ఓవైపు దక్షిణాది చిత్రాలను కాపీ కొడుతూ ఈ కామెంట్లేంటి అంటూ అతడి మీద సౌత్ నెటిజన్లు విరుచుకుపడ్డారు.
ఐతే అంత బిల్డప్ ఇచ్చిన రోహిత్ శెట్టికి ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద షాకే తగిలింది. హిట్ మెషీన్గా పేరున్న అతడికి కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ ఎదురైంది. టెంపర్ రీమేక్ సింబా తర్వాత రణ్వీర్ సింగ్తో రోహిత్ తీసిన సర్కస్ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది.
సర్కస్ మీద ముందు మంచి అంచనాలే ఉన్నాయి కానీ.. దీని ట్రైలర్ తుస్సుమనిపించడంతో అంచనాలు పడిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగా జరిగిన సినిమాకు టాక్ కీలకంగా మారింది. కానీ ఇటు రోహిత్, అటు రణ్వీర్ కెరీర్లలో అత్యంత చెత్త సినిమా అనే టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు చుక్కలు కనిపించడం మొదలైంది.
తొలి రోజే చాలా తక్కువ వసూళ్లు రాబట్టిన సర్కస్.. ఆ తర్వాత కూడా ఎంతమాత్రం పుంజుకోలేకపోయింది. పేరుకు భారీ సినిమానే కానీ.. వీకెండ్ మొత్తంలో ఇండియాలో కనీసం 20 కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. ఒకప్పుడైతే ఇలాంటి కాంబినేషన్లో సినిమా రిలీజైతే తొలి రోజే ఈజీగా 20 కోట్లు వచ్చేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడో ఒక సినిమా మాత్రమే ఆడుతోంది. చాలా వరకు బోల్తా కొట్టేస్తున్నాయి. సర్కస్ ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ 50 కోట్లు వసూలు చేయడం కూడా కష్టంగా ఉంది. అంటే దీన్ని కేవలం డిజాస్టర్ అని సరిపెట్టేయలేం. అంతకంటే పెద్ద పదం వాడాలి.
This post was last modified on December 27, 2022 6:25 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…