వచ్చే సంక్రాంతికి రాబోయే వీర సింహా రెడ్డి , వాల్తేరు వీరయ్య సినిమాలు ఒకే బేనర్ నిర్మించిన సంగతి తెలిసిందే. అలాగే రెండు సినిమాల్లోనూ శృతి హాసనే హీరోయిన్. సహజంగా ఒక హీరోల పోటీతో పాటు సంక్రాంతి హీరోయిన్స్ కూడా పోటీ పడుతుంటారు. అయితే ఈసారి మాత్రం శృతితో శృతికే పోటీ జరగనుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకున్నా సంక్రాంతి విన్నర్ శృతినే అవుతుంది.
ఇక రష్మిక కూడా వారసుడుతో శృతి పోటీ ఇవ్వనుంది. కానీ తెలుగు బడా సినిమాల పరంగా చూస్తే మాత్రం ఈసారి శృతి దే పై చేయి కానుంది. మరి ఇటు చిరు అటు బాలయ్యతో ఇప్పటికే క్రేజీ స్టెప్స్ వేసి ఇరు అభిమానులని ఎట్రాక్ట్ చేస్తుంది శృతి. ముఖ్యంగా వీర సింహా రెడ్డిలో చాలా హాట్ గా కనిపిస్తూ కుర్ర కారును ఆకట్టుకుంటుంది. మరి ఈ రెండు సినిమాల్లో తన అందం అభినయం తో ఎక్కువ మార్కులు ఎందులో స్కోర్ చేస్తుందో చూడాలి.
ఏదేమైనా వచ్చే సంక్రాంతికి చిరు , బాలయ్య మధ్యలో ప్రతీ థియేటర్స్ లో శృతి పోస్టర్ పడబోతుంది. ఇక మైత్రి కి కూడా ఇదో గొప్ప అనుభూతిగా మారనుంది. ఒకే బేనర్ నుండి సంక్రాంతి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం ఇదే మొదటి సారి మరి.
This post was last modified on December 27, 2022 11:59 am
అసలు భారతీయుడు 2 ఎప్పుడు రిలీజనేది తేలలేదు కానీ అప్పుడే మూడో భాగానికి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. కమల్ హాసన్…
దేశంలో సార్వత్రిక ఎన్నికలు కీలకదశకు చేరుకున్న నేపథ్యంలో దేశంలో వివిద నియోజకవర్గాలలో నిలబడ్డ ప్రముఖులలో ఎవరు గెలుస్తారు ? అని…
https://www.youtube.com/watch?v=CKpbdCciELk జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర పాటల సందడి మొదలైపోయింది. నాలుగేళ్లకు పైగా సుదీర్ఘమైన…
ఒక హీరో వద్దన్న స్టోరీలు ఇంకొకరు తీసుకోవడం సినీ పరిశ్రమలో లెక్కలేనన్నిసార్లు జరిగి ఉంటుంది. త్రివిక్రమ్ చెప్పినప్పుడు నిద్రరాకపోయి ఉంటే…
యానిమల్ విడుదలైన టైంలో, అంతకు ముందు కబీర్ సింగ్ సమయంలో బాలీవుడ్ విమర్శకులు, కొందరు నటీనటులు అదే పనిగా దర్శకుడు…
ఎన్నికల ప్రచారంలో ఎండనక.. వాననక.. నానా కష్టాలూ పడిన రాజకీయ ప్రముఖులు, పోలింగ్ తర్వాత, కౌంటింగ్కి ముందు.. కొంత ఉపశమనం…