వచ్చే సంక్రాంతికి రాబోయే వీర సింహా రెడ్డి , వాల్తేరు వీరయ్య సినిమాలు ఒకే బేనర్ నిర్మించిన సంగతి తెలిసిందే. అలాగే రెండు సినిమాల్లోనూ శృతి హాసనే హీరోయిన్. సహజంగా ఒక హీరోల పోటీతో పాటు సంక్రాంతి హీరోయిన్స్ కూడా పోటీ పడుతుంటారు. అయితే ఈసారి మాత్రం శృతితో శృతికే పోటీ జరగనుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకున్నా సంక్రాంతి విన్నర్ శృతినే అవుతుంది.
ఇక రష్మిక కూడా వారసుడుతో శృతి పోటీ ఇవ్వనుంది. కానీ తెలుగు బడా సినిమాల పరంగా చూస్తే మాత్రం ఈసారి శృతి దే పై చేయి కానుంది. మరి ఇటు చిరు అటు బాలయ్యతో ఇప్పటికే క్రేజీ స్టెప్స్ వేసి ఇరు అభిమానులని ఎట్రాక్ట్ చేస్తుంది శృతి. ముఖ్యంగా వీర సింహా రెడ్డిలో చాలా హాట్ గా కనిపిస్తూ కుర్ర కారును ఆకట్టుకుంటుంది. మరి ఈ రెండు సినిమాల్లో తన అందం అభినయం తో ఎక్కువ మార్కులు ఎందులో స్కోర్ చేస్తుందో చూడాలి.
ఏదేమైనా వచ్చే సంక్రాంతికి చిరు , బాలయ్య మధ్యలో ప్రతీ థియేటర్స్ లో శృతి పోస్టర్ పడబోతుంది. ఇక మైత్రి కి కూడా ఇదో గొప్ప అనుభూతిగా మారనుంది. ఒకే బేనర్ నుండి సంక్రాంతి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం ఇదే మొదటి సారి మరి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…