అన్నీ సర్దుకున్నాయి 2022 బ్రహ్మాండమైన సినిమాలు హిట్లు ఫ్లాపులతో సెలవు తీసుకుని వచ్చే ఏడాది సంక్రాంతితో గ్రాండ్ ఓపెనింగ్ దక్కబోతోందని ఆనందంలో ఉన్న సినిమా పరిశ్రమకు మళ్ళీ కరోనా కేసుల కలవరం విపరీతమైన ఆందోళనకు గురి చేస్తోంది. బిఎఫ్ 7 పేరుతో పిలుస్తున్న కొత్త వేరియంట్ దేశంలోకి ప్రవేశించింది. కొందరు విదేశీయులను టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ రావడంతో వాళ్ళను ఐసోలేషన్ కు పంపడం, మరొకరికి వ్యాపించకుండా చూడటం లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే పబ్లిక్ లో ఇంకా దీని పట్ల సీరియస్ నెస్ రాలేదు. ఆ ఏం జరుగుతుందనే ధీమాలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడం ఎక్కడికి దారి తీస్తుందోననే టెన్షన్ మొదలయ్యింది. ఇవాళ కోవిద్ డ్రై రన్ తో పాటు వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. అసలే సంక్రాంతి ఇంకో పదిహేను రోజుల్లో రాబోతోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు, తెగింపు, కళ్యాణం కమనీయం, విద్య వాసుల అహం అంటూ సందడి ఓ రేంజ్ లో ఉండబోతోంది. థియేటర్ల అగ్రిమెంట్లు, అడ్వాన్సులు ఇచ్చి పుచ్చుకోవడాలు, సంబరాలకు అభిమానుల ఏర్పాట్లు, స్క్రీన్ల పంపకాలు ఇవన్నీ తెరవెనుక భారీ ఎత్తున్న ప్లానింగ్ చేసుకుంటున్నాయి.
ఇలాంటి టైంలో ఏ చిన్న ట్విస్టు వచ్చినా తట్టుకోవడం కష్టం. ఎందుకంటే ఏవైనా ఆంక్షలంటూ మొదలైతే ముందు ప్రభావితం చెందేది సినిమా పరిశ్రమే. ఒకవేళ రిలీజులు వాయిదా పడినా ఆగిపోయినా వచ్చే నష్టం ఒకటి రెండు కోట్లలో ఉండదు. వాటి మీద వచ్చే వడ్డీతో ఇంకో మీడియం బడ్జెట్ సినిమా తీసేంత లెవెల్ లో ఉంటాయి. ప్రస్తుతానికి చైనాలో తీవ్రంగా ఉన్న ఈ మహమ్మారి మన దేశం గడప తొక్కకుంటే అదే పది వేలు. వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులు వగైరా ఎన్ని వేసినా వేయించుకున్నా మళ్ళీ ఇంత తక్కువ గ్యాప్ లో ఈ షాకులు తినాల్సి రావడం మింగుడు పడని విషయమే.
This post was last modified on December 26, 2022 11:25 am
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…