డబ్బింగ్ సినిమానే అయినప్పటికీ స్ట్రెయిట్ మూవీ రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు ప్లాన్ చేసిన వారసుడుకి నిన్న చెన్నైలో ఆడియో రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేశారు. పేరుకి పాటల విడుదలన్నారు కానీ అంతకు మించి చాలానే జరిగాయి.
కిక్కిరిసిపోయిన అభిమాన సందోహం మధ్య నిర్మాత దిల్ రాజు దీన్ని నిర్వహించిన తీరు చూసి సోషల్ మీడియాలో లీకైన వీడియోలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. మొత్తం క్యాస్ట్ అండ్ క్రూతో అందరూ హాజరయ్యారు. స్టేజి మీద విజయ్ పాట పాడటం, చిన్నగా స్టెప్పు వేయడం లాంటి ఆకర్షణలు తోడయ్యాయి.
ఒక తెలుగు నిర్మాత ఈ స్థాయిలో వేడుక నిర్వహించడం కోలీవుడ్ మీడియాలోనూ హైలైట్ అయ్యింది. సరే అక్కడి సంబరం ముగిసింది కాబట్టి ఇక్కడా అదే స్థాయిలో చేస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే విజయ్ ఇప్పటిదాకా తన డబ్బింగ్ ఈవెంట్లకు ఎన్నడూ రాలేదు.
కనీసం ఒక ప్రెస్ మీట్ లేదా ఇంటర్వ్యూ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు అలా కుదరదు. రాజుగారు పెద్ద రిలీజ్ ప్లాన్ చేశారు కాబట్టి దానికి సహకరించాలి. ఒకవేళ చేస్తే మటుకు హైదరాబాదే మంచి ఆప్షన్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గెస్ట్ గా అనుకున్నారు కానీ అది జరిగే అవకాశం లేదని ఇన్ సైడ్ టాక్.
ప్రస్తుతానికి వారసుడుకి ఏపీ తెలంగాణలో ఏమంత బజ్ లేదు. థియేటర్ల పంచాయితీ పక్కనపెడితే భారీ ఓపెనింగ్స్ వచ్చే సూచనలు లేవు. రంజితమే ఒరిజినల్ లో ఎంత ఛార్ట్ బస్టర్ అయినా మనదగ్గర అంత దూకుడుగా వెళ్ళలేదు. సో హైప్ పెరగాలంటే ఏదో చేయాలి. దానికి ట్రైలర్ ఎంతమేరకు దోహదం చేస్తుందో చెప్పలేం.
ఎందుకంటే వారసుడు ఓ రెగ్యులర్ ఫార్ములాలో వెళ్లే ఫ్యామిలీ కం కమర్షియల్ డ్రామా. జనంలో దీన్ని చూసే తీరాలన్న ఆసక్తి రేపాలంటే పబ్లిసిటీ కంటెంట్ ని బలంగా ప్లాన్ చేసుకోవాలి. మరి దిల్ రాజు మనసులో ఏముందో ఏమేం చేయబోతున్నారో చూడాలి
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…