టాలీవుడ్ బాక్సాఫీస్ కొన్ని నెలల నుంచి డల్లుగా నడుస్తోంది. దసరాకు ‘గాడ్ ఫాదర్’, ఈ నెలలో ‘హిట్-2’ కొంచెం సందడి చేశాయి.. మిగతా సినిమాలు చాలా వరకు తేడా కొట్టేశాయి. క్రిస్మస్ టైంలో సందడి నెలకొంటుందని ఆశిస్తే.. ఈ సీజన్కు షెడ్యూల్ అయిన సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ షాకైంది.
మాస్ రాజా రవితేజ సినిమా ‘ధమాకా’.. ‘కార్తికేయ-2’ సక్సెస్ కొట్టిన నిఖిల్-అనుపమ జంటగా నటించిన ‘18 పేజెస్’ చిత్రాలకు మంచి బజ్ ఉన్నట్లే కనిపించినా.. అడ్వాన్స్ బుకింగ్స్లో అతి ప్రతిఫలించలేదు. బుక్ మై షోలో ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో కనిపించిన స్క్రీన్లు చాలా చాలా తక్కువ. ‘18 పేజెస్’ స్థాయి తక్కువ కాబట్టి ఓకే కానీ.. రవితేజ సినిమాకు ఎన్నడూ లేని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఇంత వీక్గా ఉండడం చూసి చాలామంది షాకైపోయారు. ఇక చిత్ర బృందం కూడా బాగా టెన్షన్ పడే ఉంటుందనడంలో సందేహం లేదు.
కానీ రిలీజ్ రోజు మాత్రం పరిస్థితి మారిపోయింది. ‘ధమాకా’ థియేటర్ల దగ్గర బాగానే సందడి కనిపించింది. మార్నింగ్ షోలకు చాలా చోట్ల ఫుల్స్ పడ్డాయి. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా, రివ్యూలు కూడా అందుకు తగ్గట్లే ఉన్నా.. ఆ ప్రభావం సినిమా వసూళ్లపై పడినట్లు కనిపించలేదు. సాయంత్రం, రాత్రి షోలకు మంచి ఆక్యుపెన్సీలతో నడిచింది ‘దమాకా’.
అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువగా ఉండి, పాజిటివ్ రివ్యూలు తెచ్చుకోని సినిమాకు సాయంత్రానికి థియేటర్లు ఖాళీ అయిపోతుంటాయి. కానీ ‘ధమాకా’ విషయంలో అలా జరగలేదు. మాస్ రాజా ఫ్యాన్స్ ఈ సినిమాతో శాటిస్ఫై అయినట్లే ఉన్నారు. కమర్షియల్ హంగులకు లోటు లేకపోవడం ప్లస్ అయినట్లుంది. తొలి రోజు ఈ చిత్రం రూ.9 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయడం కూడా ట్రేడ్ వర్గాలకు షాకింగే. ఇది రవితేజ మాస్ ఫాలోయింగ్కు నిదర్శనం అని, ఇదే ఊపు శని, ఆదివారాల్లో కూడా కొనసాగితే బయ్యర్లు చాలా వరకు సేఫ్ అయిపోతారని అంటున్నారు.
This post was last modified on December 24, 2022 9:51 pm
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…