క్రిస్మస్ సినిమాల సందడి పూర్తయింది. ఇక ప్రేక్షకుల చూపు సంక్రాంతి సినిమాల మీదే ఉన్నాయి. వచ్చే ఏడాది పొంగల్ బరిలో చిరు , బాలయ్య బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతుండటంతో మూవీ సర్కిల్స్ లో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతానికి రెండు సినిమాలకు షూటింగ్స్ క్లైమాక్స్ వచ్చేశాయి. ఓ వైపు ప్రమోషన్స్ కూడా మొదలెట్టారు.
ఇదే సంక్రాంతికి విజయ్ , అజిత్ డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో విడుదల కాబోతున్నాయి. దిల్ రాజు ‘వారసుడు’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక మైత్రి నిర్మాతలు కూడా రెండు సినిమాలపై గట్టిగా ఇన్వెస్ట్ చేసి కూర్చున్నారు. యూవీ క్రియేషన్స్ నుండి కూడా ఓ చిన్న సినిమా బరిలో దిగింది. యూవీ నిర్మాతలు ఈ సీజన్ లో తమ సినిమాకు కూడా ఎంతో కొంత కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు.
ఇప్పటికే సంక్రాంతి సినిమాలకు సంబంధించి భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాల నిర్మలందరూ భయబ్రాంతులతో అడుగేసే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మళ్ళీ కోవిడ్ 19 కేసులు పెరుగుతుండటంతో మాస్క్ తప్పనిసరి అని అంటూ ప్రచారం జరుగుతుంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మళ్ళీ కరోన ఎంటరైతే ఎలా పోరాటం చేయాలనే ప్లాన్స్ తో మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. చైనాలో ఇప్పటికే కోవిడ్ మరణాలు ఎక్కువవుతుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో మళ్ళీ భయం మొదలైంది. చాలా మంది మాస్కులతో బయటికొస్తున్నారు.
మరి ఈ క్రమంలో వచ్చే సంక్రాంతికి జనవరిలో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందా ? అనే డైలమాలో పడ్డారు నిర్మాతలు. తమ సినిమాలపై పెట్టుకున్న ఆశలను గుర్తుచేసుకుంటూ లోలోపల భయపడుతున్నారు. ఇక్కడ కోవిడ్ ఎఫెక్ట్ అంతగా లేకపోతే పర్లేదు కానీ లేదంటే సంక్రాంతి సినిమాలపై గట్టి ఎఫెక్ట్ పడుతుంది.
This post was last modified on December 23, 2022 9:57 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…