ఒక పీరియాడిక్ సినిమాకో లేదా ఓ భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా కోసమే టీం ఏకంగా రెండేళ్ళు , మూడేళ్ళు తీసుకున్నారంటే కామన్ కానీ ఓ సింపుల్ కథకి ఎక్కువ టైం తీసుకోవడం కామెడీగానే ఉంటుంది. తాజాగా నిఖిల్ 18 పేజిస్ కి ఇదే జరిగింది. ఈ సినిమాను రెండేళ్ళ క్రితం ప్రారంభించారు. కరోన కంటే ముందే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యలో కొన్ని నెలలు లాక్ డౌన్ తో షూట్ జరగలేదు. నిఖిల్ ‘కార్తికేయ2’ తో పాటు అప్పుడప్పుడు ఈ సినిమాకి కొన్ని డేట్స్ ఇస్తూ వచ్చాడు. అందువల్ల షూట్ కాస్త ఆలస్యంగా జరుగుతూ వచ్చింది.
అయితే దీని కంటే తర్వాత మొదలైన కార్తికేయ 2 ఎప్పుడో రిలీజైతే 18 పెజీస్ మాత్రం పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. దీనికి కారణం యూనిట్ రీ షూట్స్ పని ఎక్కువగా పెట్టుకోవడమే. షూట్ ఎప్పుడో పూర్తయినా మధ్యలో రీ షూట్స్ చేస్తూనే వచ్చారు. రిలీజ్ చివరి క్షణం వరకూ ఈ సినిమాకి వెనుక మరమ్మత్తులు జరుగుతూనే ఉన్నాయి. సుకుమార్ రిలీజ్ కి రెండ్రోజుల ముందు ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చొని కొన్ని డిస్కషన్స్ లేవదీసి మళ్ళీ కొంత రీ ఎడిట్ చేయించారని సమాచారం.
ఇక అనుపమ కూడా రిలీజ్ కి ముందు రోజు వరకూ డబ్బింగ్ చెప్పింది. ఈ విషయం ఆమె స్వయంగా మీడియాతో చెప్పుకుంది. ఓవర్సీస్ వరకు అనుపమ పాత్రకు మరో అమ్మాయి డబ్బింగ్ చెప్పగా తెలుగులో మాత్రం అనుపమ వాయిసే ఉంది. ఇవన్నీ తెలిసాక యూనిట్ ఈ సింపుల్ లవ్ స్టోరీ సినిమా కోసం ఇంత కష్టపడటం అవసరమా ? అనే ప్రశ్న చూసిన చాలా మందికి కలిగింది. సుకుమార్ ఇచ్చిన కథ కూడా కాస్త రొటీన్ గానే ఉంది. కాకపోతే నెరేషన్ కొంత వరకూ ఆకట్టుకుంది. ఆర్టిస్టులు కొందరే, లోకేషన్స్ కూడా ఇక్కడిక్కడే (హైదరాబాద్ లోనే). మరి ఈ పేజీల కోసం టీం చివరి వరకూ కసరత్తులు చేయడం ఎందుకో వారికే తెలియాలి.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…