ఒక పీరియాడిక్ సినిమాకో లేదా ఓ భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా కోసమే టీం ఏకంగా రెండేళ్ళు , మూడేళ్ళు తీసుకున్నారంటే కామన్ కానీ ఓ సింపుల్ కథకి ఎక్కువ టైం తీసుకోవడం కామెడీగానే ఉంటుంది. తాజాగా నిఖిల్ 18 పేజిస్ కి ఇదే జరిగింది. ఈ సినిమాను రెండేళ్ళ క్రితం ప్రారంభించారు. కరోన కంటే ముందే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యలో కొన్ని నెలలు లాక్ డౌన్ తో షూట్ జరగలేదు. నిఖిల్ ‘కార్తికేయ2’ తో పాటు అప్పుడప్పుడు ఈ సినిమాకి కొన్ని డేట్స్ ఇస్తూ వచ్చాడు. అందువల్ల షూట్ కాస్త ఆలస్యంగా జరుగుతూ వచ్చింది.
అయితే దీని కంటే తర్వాత మొదలైన కార్తికేయ 2 ఎప్పుడో రిలీజైతే 18 పెజీస్ మాత్రం పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. దీనికి కారణం యూనిట్ రీ షూట్స్ పని ఎక్కువగా పెట్టుకోవడమే. షూట్ ఎప్పుడో పూర్తయినా మధ్యలో రీ షూట్స్ చేస్తూనే వచ్చారు. రిలీజ్ చివరి క్షణం వరకూ ఈ సినిమాకి వెనుక మరమ్మత్తులు జరుగుతూనే ఉన్నాయి. సుకుమార్ రిలీజ్ కి రెండ్రోజుల ముందు ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చొని కొన్ని డిస్కషన్స్ లేవదీసి మళ్ళీ కొంత రీ ఎడిట్ చేయించారని సమాచారం.
ఇక అనుపమ కూడా రిలీజ్ కి ముందు రోజు వరకూ డబ్బింగ్ చెప్పింది. ఈ విషయం ఆమె స్వయంగా మీడియాతో చెప్పుకుంది. ఓవర్సీస్ వరకు అనుపమ పాత్రకు మరో అమ్మాయి డబ్బింగ్ చెప్పగా తెలుగులో మాత్రం అనుపమ వాయిసే ఉంది. ఇవన్నీ తెలిసాక యూనిట్ ఈ సింపుల్ లవ్ స్టోరీ సినిమా కోసం ఇంత కష్టపడటం అవసరమా ? అనే ప్రశ్న చూసిన చాలా మందికి కలిగింది. సుకుమార్ ఇచ్చిన కథ కూడా కాస్త రొటీన్ గానే ఉంది. కాకపోతే నెరేషన్ కొంత వరకూ ఆకట్టుకుంది. ఆర్టిస్టులు కొందరే, లోకేషన్స్ కూడా ఇక్కడిక్కడే (హైదరాబాద్ లోనే). మరి ఈ పేజీల కోసం టీం చివరి వరకూ కసరత్తులు చేయడం ఎందుకో వారికే తెలియాలి.
This post was last modified on December 24, 2022 10:34 am
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 6…
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…
ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…
భారత దేశ చరిత్రలో ఇదోక అనూహ్యమైన.. అసహ్యించుకునే ఘటన. ఈ దేశాన్ని పాలించి, రైతుల మన్ననలు, మహిళల మన్ననలు పొందిన…
ఏపీ సీఎం జగన్.. నీరో చక్రవర్తిని తలపిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచ లన వ్యాఖ్యలు చేశారు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…