తెలుగు తెర నట దిగ్గజం కైకాల సత్యనారాయణ మరణం సినీ ఇండస్ట్రీని కుదిపేసింది. అనేక మంది పాత, కొత్త తరం నటులతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ జ్ఞాపకాల దొంతరలు కదులుతున్నా యి. అనేక గుబాళింపైన జ్ఞాపకాలు.. తెలుగు ప్రేక్షకులను కలచి వేస్తున్నాయి. కైకాల ఇలాంటి వారా.. అలాంటి వారా.. అంటూ.. ఆయన స్మృతులను నెమరు వేసుకుంటున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కైకాలతో తనకు ఉన్న అనుబంధం చర్చించుకున్నారు. “ఉప్పు చేప అంటే.. కైకాలకు ఎంతో ఇష్టం. ఎన్ని కూరలు ఉన్నా.. ఎన్ని పచ్చళ్లు, పిండి వంటలు పెట్టినా.. పక్క ఉప్పు చేప-పప్పు చారు లేకపోతే.. ఏదో వెలితిగా ఫీలయ్యేవారు” అని చిరు ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అంతేకాదు.. ఇటీవల జరిగిన ఓఘటనను కూడా చిరు గుర్తు చేసుకున్నారు.
“నటన, రుచికరమైన భోజనం రెండూ కైకాలకు ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతి వంటను ఆయన ఎంతో ఇష్టంగా తినేవారు. గతేడాది, ఈ ఏడాది ఆయన జన్మదినం సందర్భంగా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిలిగిన సంతృప్తి. అప్పుడు ఆయన సురేఖతో.. “అమ్మా.. ఉప్పు చేప వండి పంపించు” అని అన్నప్పుడు.. “మీరు త్వరగా కోలుకోండి ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం” అని చెప్పాం. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోషపడ్డారు. కానీ, ఇప్పుడు మన మధ్యనుంచి వెళ్లిపోయారు” అని గుర్తుచేసుకున్నారు.
This post was last modified on December 23, 2022 2:46 pm
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…