తెలుగు తెర నట దిగ్గజం కైకాల సత్యనారాయణ మరణం సినీ ఇండస్ట్రీని కుదిపేసింది. అనేక మంది పాత, కొత్త తరం నటులతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ జ్ఞాపకాల దొంతరలు కదులుతున్నా యి. అనేక గుబాళింపైన జ్ఞాపకాలు.. తెలుగు ప్రేక్షకులను కలచి వేస్తున్నాయి. కైకాల ఇలాంటి వారా.. అలాంటి వారా.. అంటూ.. ఆయన స్మృతులను నెమరు వేసుకుంటున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కైకాలతో తనకు ఉన్న అనుబంధం చర్చించుకున్నారు. “ఉప్పు చేప అంటే.. కైకాలకు ఎంతో ఇష్టం. ఎన్ని కూరలు ఉన్నా.. ఎన్ని పచ్చళ్లు, పిండి వంటలు పెట్టినా.. పక్క ఉప్పు చేప-పప్పు చారు లేకపోతే.. ఏదో వెలితిగా ఫీలయ్యేవారు” అని చిరు ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అంతేకాదు.. ఇటీవల జరిగిన ఓఘటనను కూడా చిరు గుర్తు చేసుకున్నారు.
“నటన, రుచికరమైన భోజనం రెండూ కైకాలకు ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతి వంటను ఆయన ఎంతో ఇష్టంగా తినేవారు. గతేడాది, ఈ ఏడాది ఆయన జన్మదినం సందర్భంగా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిలిగిన సంతృప్తి. అప్పుడు ఆయన సురేఖతో.. “అమ్మా.. ఉప్పు చేప వండి పంపించు” అని అన్నప్పుడు.. “మీరు త్వరగా కోలుకోండి ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం” అని చెప్పాం. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోషపడ్డారు. కానీ, ఇప్పుడు మన మధ్యనుంచి వెళ్లిపోయారు” అని గుర్తుచేసుకున్నారు.
This post was last modified on December 23, 2022 2:46 pm
అభిమానులు భయపడినట్టే జరిగేలా ఉంది. మే 9 హరిహర వీరమల్లు వస్తుందని గంపెడాశలతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి షాక్…
థియేటర్లలో జనాలు లేక అలో లక్ష్మణా అంటూ అల్లాడిపోతున్న బయ్యర్లకు ఊరట కలిగించేందుకు ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు…
మెగాస్టార్ ఫాంటసీ మూవీ విశ్వంభర నుంచి ప్రమోషన్ పరంగా ఇప్పటిదాకా రెండు కంటెంట్స్ వచ్చాయి. మొదటిది టీజర్. దీనికొచ్సిన నెగటివిటీ…
మాములుగా సీనియర్ దర్శకులకు వరసగా డిజాస్టర్లు పడితే కంబ్యాక్ కావడం అంత సులభంగా ఉండదు. అసలు వాళ్ళ కథలు వినడానికే…
ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని…
ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి…