కొన్ని నెలల కిందట యువ కథానాయకుడు నితిన్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’కు బాక్సాఫీస్ దగ్గర పెద్ద షాకే తగిలింది. ఆ సినిమా బాగా లేకపోవడం వల్ల డిజాస్టర్ అయిన మాట వాస్తవమే కానీ.. నితిన్ గత సినిమాలతో పోలిస్తే దీనికి సరిగ్గా ఓపెనింగ్స్ కూడా రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గరే సినమా తుస్సుమనిపించింది. టాలీవుడ్లో అసలు నెగెటివిటీ లేని హీరోల్లో ఒకడైన నితిన్.. ఈ చిత్రం విషయంలో మాత్రం బాగా నెగెటివిటీ ఎదుర్కొన్నాడు. ఐతే అందులో అతడి తప్పేమీ లేదు.
ఈ చిత్రంతో దర్శకుడిగా మారిన ఎడిటర్ శేఖర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని అనే విషయం లేటుగా వెలుగులోకి వచ్చి గతంలో అతను ప్రత్యర్థి పార్టీల మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హైలైట్ అయి దర్శకుడిగా అతడి తొలి చిత్రం మీద విపరీతమైన నెగెటివ్ ప్రచారానికి కారణమయ్యాయి. ఏపీలో జగన్ సర్కారు మీద వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతున్న టైంలో శేఖర్ పాత కామెంట్ల మీద దుమారం రేగి అదంతా సినిమా మెడకు చుట్టుకోవడం గమనార్హం.
జనాల మూడ్ అనేది ఈ సినిమా విషయంలో వ్యతిరేకంగా పని చేసిందని చెప్పాలి. ఇప్పుడు విశాల్ సైతం ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నట్లుగా కనిపిస్తోంది. అతను తాజాగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొనియాడడం.. ‘ఐ లవ్ జగన్’ అని స్టేట్మెంట్ ఇవ్వడం.. టీడీపీ, జనసేన మద్దతుదారులకు అస్సలు నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో అతడి కొత్త చిత్రం ‘లాఠీ’ గురించి బాగా నెగెటివ్ ప్రచారం జరిగింది.
సినిమాలు ఆడే సిటీలు, టౌన్లలో జనాల మూడ్ కూడా జగన్ సర్కారు విషయంలో వ్యతిరేకంగా ఉండడం వల్లో ఏమో..ఆ ఎఫెక్ట్ ‘లాఠీ’ మీద గట్టిగా పడినట్లు తెలుస్తోంది. విశాల్ గత చిత్రాలతో పోలిస్తే దీనికి కనీస ఓపెనింగ్స్ రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గరే సినిమా తేలిపోయింది. రిలీజ్ రోజు సినిమాకు బాగా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. ఈ చిత్రం మీద పెట్టిన మూడు కోట్ల పెట్టుబడిలో సగం కూడా వెనక్కి వచ్చేలా కనిపించడం లేదు.
This post was last modified on December 23, 2022 11:02 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…