కరోనా తర్వాత బాలీవుడ్ ఎంతగా డీలా పడిపోయిందో.. పెద్ద పెద్ద సినిమాలు ఎలా బోల్తా కొట్టాయో చూశాం. ఎప్పుడో ఒకసారి ఓ సినిమా బాగా ఆడడం.. హమ్మయ్య పరిస్థితి మెరుగుపడిందిలే అనుకుంటే.. మళ్లీ స్లంప్ మొదలుకావడం.. ఇదీ వరస. కొన్ని వారాల కిందట ‘దృశ్యం-2’ బాగా ఆడిందని సంతోషపడితే.. ఆ తర్వాత ప్రతి వారం బాక్సాఫీస్ వెలవెలబోతూనే వస్తోంది.
క్రిస్మస్ కానుకగా రిలీజవుతున్న ‘సర్కస్’తో మళ్లీ బాక్సాఫీస్కు వస్తుందని బాలీవుడ్ జనాలు ఆశించారు. ‘సింబా’ లాంటి బ్లాక్ బస్టర్ చేసిన రోహిత్ శెట్టి-రణ్వీర్ సింగ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం.. హిట్ మెషీన్గా పేరున్న రోహిత్ తన మార్కు ఎంటర్టైనరే ట్రై చేయడంతో సినిమా సూపర్ హిట్టవడం గ్యారెంటీ అనుకున్నారు. కానీ ఈ సినిమా ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడం, ఇంకేవో కారణాలు తోడై అడ్వాన్స్ బుకింగ్స్ తుస్సుమనిపించేశాయి.
ఈ కాంబినేషన్కు ఉన్న క్రేజ్ను బట్టి చూస్తే ‘దృశ్యం-2’ను మించి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయని అనుకున్నారు. కానీ పెద్దగా బజ్ లేకుండా రిలీజైన థ్యాంక్ గాడ్, రక్షాబంధన్ లాంటి చిత్రాల కంటే దీనికి తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత మంచి కాంబినేషన్లో వచ్చిన సినిమా పట్ల కూడా హిందీ ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
టాక్ బాగున్నా కూడా సినిమా బాగా ఆడుతుందా లేదా అన్న సందేహాలు కలుగుతుండగా.. టాక్ అటు ఇటు అయితే మాత్రం ‘సర్కస్’ రూపంలో బాలీవుడ్కు మరో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఆకర్షణలకైతే లోటు లేదు. రణ్వీర్ సింగ్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఇందులో రణ్వీర్ సర్కస్లో విన్యాసాలు చేసే కుర్రాడిగా కనిపించనున్నాడు. ఇదొక పీరియడ్ ఫిలిం అని ట్రైలర్ను బట్టి అర్థమవుతోంది.
This post was last modified on December 23, 2022 10:58 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…