కరోనా తర్వాత బాలీవుడ్ ఎంతగా డీలా పడిపోయిందో.. పెద్ద పెద్ద సినిమాలు ఎలా బోల్తా కొట్టాయో చూశాం. ఎప్పుడో ఒకసారి ఓ సినిమా బాగా ఆడడం.. హమ్మయ్య పరిస్థితి మెరుగుపడిందిలే అనుకుంటే.. మళ్లీ స్లంప్ మొదలుకావడం.. ఇదీ వరస. కొన్ని వారాల కిందట ‘దృశ్యం-2’ బాగా ఆడిందని సంతోషపడితే.. ఆ తర్వాత ప్రతి వారం బాక్సాఫీస్ వెలవెలబోతూనే వస్తోంది.
క్రిస్మస్ కానుకగా రిలీజవుతున్న ‘సర్కస్’తో మళ్లీ బాక్సాఫీస్కు వస్తుందని బాలీవుడ్ జనాలు ఆశించారు. ‘సింబా’ లాంటి బ్లాక్ బస్టర్ చేసిన రోహిత్ శెట్టి-రణ్వీర్ సింగ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం.. హిట్ మెషీన్గా పేరున్న రోహిత్ తన మార్కు ఎంటర్టైనరే ట్రై చేయడంతో సినిమా సూపర్ హిట్టవడం గ్యారెంటీ అనుకున్నారు. కానీ ఈ సినిమా ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడం, ఇంకేవో కారణాలు తోడై అడ్వాన్స్ బుకింగ్స్ తుస్సుమనిపించేశాయి.
ఈ కాంబినేషన్కు ఉన్న క్రేజ్ను బట్టి చూస్తే ‘దృశ్యం-2’ను మించి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయని అనుకున్నారు. కానీ పెద్దగా బజ్ లేకుండా రిలీజైన థ్యాంక్ గాడ్, రక్షాబంధన్ లాంటి చిత్రాల కంటే దీనికి తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత మంచి కాంబినేషన్లో వచ్చిన సినిమా పట్ల కూడా హిందీ ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
టాక్ బాగున్నా కూడా సినిమా బాగా ఆడుతుందా లేదా అన్న సందేహాలు కలుగుతుండగా.. టాక్ అటు ఇటు అయితే మాత్రం ‘సర్కస్’ రూపంలో బాలీవుడ్కు మరో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఆకర్షణలకైతే లోటు లేదు. రణ్వీర్ సింగ్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఇందులో రణ్వీర్ సర్కస్లో విన్యాసాలు చేసే కుర్రాడిగా కనిపించనున్నాడు. ఇదొక పీరియడ్ ఫిలిం అని ట్రైలర్ను బట్టి అర్థమవుతోంది.
This post was last modified on December 23, 2022 10:58 am
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…