ప్రభాస్ తో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తీసే సూపర్ హీరో సినిమా కోసం భారీ సెటప్ ప్లాన్ చేస్తున్నారు వైజయంతి మూవీస్ అధినేత అశ్వని దత్. ఈ చిత్రంలో పాన్ ఇండియా అప్పీల్ ఉన్న నాయిక ఉండాలని అశ్విన్ ట్రై చేస్తున్నాడు. దీపికా పదుకోన్ ని సంప్రదించారు కాని ఆమె ఇంకా సమ్మతం చెప్పలేదు.
ఆమె డేట్స్ పరంగా చిక్కులు ఉండే అవకాశం కూడా ఉందట. అందుకే ఎన్ని కాల్షీట్స్ అయినా ఇచ్చే హీరోయిన్ కోసం అశ్విన్ చూస్తున్నాడు. కియారా అద్వానీ పేరు పరిశీలనలో ఉందని, ఆమెకు కూడా కబీర్ సింగ్ వల్ల దేశ వ్యాపితంగా యువతలో క్రేజ్ ఉంది కనుక ఆమె అయినా బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నాడట.
నిజంగా ఈ సినిమాలో అవకాశం కియారాకు వెళితే ఆమె రేంజ్ మరింత పెరుగుతుంది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైందనే లోటు కూడా తీరిపోతుంది. రాధే శ్యామ్ షూటింగ్ వేసవి లోగా పూర్తి చేసి ఆ తర్వాత డిలే లేకుండా దీనికి డేట్స్ ఇస్తానని ప్రభాస్ మాట ఇవ్వడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని అశ్విన్ వేగవంతం చేసాడు.
This post was last modified on July 18, 2020 12:55 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…