ప్రభాస్ తో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తీసే సూపర్ హీరో సినిమా కోసం భారీ సెటప్ ప్లాన్ చేస్తున్నారు వైజయంతి మూవీస్ అధినేత అశ్వని దత్. ఈ చిత్రంలో పాన్ ఇండియా అప్పీల్ ఉన్న నాయిక ఉండాలని అశ్విన్ ట్రై చేస్తున్నాడు. దీపికా పదుకోన్ ని సంప్రదించారు కాని ఆమె ఇంకా సమ్మతం చెప్పలేదు.
ఆమె డేట్స్ పరంగా చిక్కులు ఉండే అవకాశం కూడా ఉందట. అందుకే ఎన్ని కాల్షీట్స్ అయినా ఇచ్చే హీరోయిన్ కోసం అశ్విన్ చూస్తున్నాడు. కియారా అద్వానీ పేరు పరిశీలనలో ఉందని, ఆమెకు కూడా కబీర్ సింగ్ వల్ల దేశ వ్యాపితంగా యువతలో క్రేజ్ ఉంది కనుక ఆమె అయినా బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నాడట.
నిజంగా ఈ సినిమాలో అవకాశం కియారాకు వెళితే ఆమె రేంజ్ మరింత పెరుగుతుంది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైందనే లోటు కూడా తీరిపోతుంది. రాధే శ్యామ్ షూటింగ్ వేసవి లోగా పూర్తి చేసి ఆ తర్వాత డిలే లేకుండా దీనికి డేట్స్ ఇస్తానని ప్రభాస్ మాట ఇవ్వడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని అశ్విన్ వేగవంతం చేసాడు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…