ప్రభాస్ తో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తీసే సూపర్ హీరో సినిమా కోసం భారీ సెటప్ ప్లాన్ చేస్తున్నారు వైజయంతి మూవీస్ అధినేత అశ్వని దత్. ఈ చిత్రంలో పాన్ ఇండియా అప్పీల్ ఉన్న నాయిక ఉండాలని అశ్విన్ ట్రై చేస్తున్నాడు. దీపికా పదుకోన్ ని సంప్రదించారు కాని ఆమె ఇంకా సమ్మతం చెప్పలేదు.
ఆమె డేట్స్ పరంగా చిక్కులు ఉండే అవకాశం కూడా ఉందట. అందుకే ఎన్ని కాల్షీట్స్ అయినా ఇచ్చే హీరోయిన్ కోసం అశ్విన్ చూస్తున్నాడు. కియారా అద్వానీ పేరు పరిశీలనలో ఉందని, ఆమెకు కూడా కబీర్ సింగ్ వల్ల దేశ వ్యాపితంగా యువతలో క్రేజ్ ఉంది కనుక ఆమె అయినా బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నాడట.
నిజంగా ఈ సినిమాలో అవకాశం కియారాకు వెళితే ఆమె రేంజ్ మరింత పెరుగుతుంది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైందనే లోటు కూడా తీరిపోతుంది. రాధే శ్యామ్ షూటింగ్ వేసవి లోగా పూర్తి చేసి ఆ తర్వాత డిలే లేకుండా దీనికి డేట్స్ ఇస్తానని ప్రభాస్ మాట ఇవ్వడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని అశ్విన్ వేగవంతం చేసాడు.
This post was last modified on July 18, 2020 12:55 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…