Movie News

వీర‌మ‌ల్లు టెన్ష‌న్ తీర్చిన ప‌వ‌న్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వ‌రుస‌గా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి సినిమాలు అనౌన్స్ అవుతుంటే.. ఎలా స్పందించాలో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది అభిమానుల్లో. చేతిలో ఉన్న భారీ చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సంగ‌తి తేల్చ‌కుండా, ఎంత‌కీ ఆ సినిమాను పూర్తి చేయ‌కుండా కొత్త‌గా సినిమాలు ప్ర‌క‌టించి ఏం ప్ర‌యోజ‌నం అనుకున్నారు వారు. ఇక ఆ చిత్ర ద‌ర్శ‌కుడు క్రిష్‌, నిర్మాత ఎ.ఎం.ర‌త్నంల ప‌రిస్థితేంటో చెప్పాల్సిన ప‌ని లేదు.
కొన్నేళ్లుగా వాళ్లిద్ద‌రూ ఈ ప్రాజెక్టుకే అంకిత‌మై ఉన్నారు. ఖ‌ర్చు త‌డిసి మోపెడ‌వుతుండ‌డం ర‌త్నంలో టెన్ష‌న్ పెంచేస్తోంది. ప‌లుమార్లు రిలీజ్ డేట్ మార్చుకున్న ఈ సినిమా చివ‌ర‌గా 2023 వేస‌వికి ఫిక్స్ అయింది. కానీ ప‌వ‌న్ తీరు చూస్తుంటే అప్ప‌టికైనా సినిమా రిలీజ‌వుతుందా లేదా అన్న సందేహాలు క‌లిగాయి. కానీ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు టీం టెన్ష‌న్ తీరుస్తూ.. ప‌వ‌న్ ఇటీవ‌ల నిల‌క‌డగా షూటింగ్‌కు హాజ‌రు కావ‌డం విశేషం.

చాలా నెల‌ల త‌ర్వాత ప‌వ‌న్‌.. గ్యాప్ ఇవ్వ‌కుండా దాదాపు రెండు వారాలు రెగ్యుల‌ర్‌గా షూటింగ్‌కు వ‌చ్చాడ‌ట‌. రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్టింగ్స్‌, పెద్ద సంఖ్య‌లో ఆర్టిస్టులు, వేల‌మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల కాంబినేష‌న్లో కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను ప‌వ‌న్ పూర్తి చేశాడ‌ట‌. ఈ షెడ్యూల్ బ్రేక్ లేకుండా సాగిపోవ‌డంతో మేజ‌ర్ పార్ట్ ఫినిష్ అయిపోయిన‌ట్లు స‌మాచారం.

షెడ్యూల్ మొద‌ల‌య్యే ముందు నెల‌కొన్న సందేహాలను ప‌టాపంచ‌లు చేస్తూ ప‌వ‌న్ వ‌రుస‌గా షూటింగ్‌కు రావ‌డం చిత్ర బృందంలో మంచి హుషారు తెచ్చిన‌ట్లు స‌మాచారం. ఇలా ఇంకో మూడు వారాలు ప‌వ‌న్ కాల్ షీట్లు ఇస్తే సినిమా పూర్త‌యిపోతుంద‌ని తెలుస్తోంది. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఆల్రెడీ లైన్లో ఉన్న రెండు సినిమాల సంగ‌తి కూడా చూసేసి ఆ త‌ర్వాత ఎన్నిక‌ల కోసం పూర్తిగా స‌మ‌యం కేటాయించాల‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

This post was last modified on December 22, 2022 6:22 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

36 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

52 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago