ఇప్పటిదాకా తెలుగులో చాలా సినిమాల్లో నటించింది నయనతార. ఐతే ఒక్క శ్రీరామరాజ్యం సినిమా వేడుకలో తప్ప ఇంకే ప్రమోషనల్ ఈవెంట్లోనూ ఆమె కనిపించింది లేదు. అది కూడా తనకు చివరి సినిమాగా భావించి ఆ వేడుకకు వచ్చింది. దానికి ముందు ఆమె ఎప్పడూ ప్రమోషన్లలో పాల్గొన్నది లేదు. తమిళంలో కూడా చాలా సినిమాల ప్రమోషన్లకు ఆమె దూరంగా ఉంది.
నటించడం వరకే తన పని అని, ప్రమోషన్లకు రాను అని ముందే తాను చెప్పేస్తానన్నది ఆమె వాదన. అలా అని ఆమె ఏ సినిమానూ ప్రమోట్ చేయదా అంటే అదేం లేదు. తన భర్త విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో లేదా నిర్మాణంలో తెరకెక్కే సినిమాలు, అలాగే కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మాత్రం ఆమె ప్రమోషన్లు చేస్తుంటుంది. తాజాగా విఘ్నేష్ ప్రొడక్షన్లోనే తెరకెక్కిన కనెక్ట్ సినిమాను అటు తమిళంలో, ఇటు తెలుగులో ఆమె ప్రమోట్ చేస్తోంది.
తెలుగులో యాంకర్ సుమతో ఆమె ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసింది. ఐతే ఈ ఇంటర్వ్యూ చూశాక వచ్చే కౌంటర్లను ముందే ఊహించి తాను ప్రమోషన్లు చేయని విషయంలో ప్రశ్నలు అడిగించుకుంది నయన్. ఎందుకు సినిమా వేడుకల్లో, ఇంటర్వ్యూల్లో పాల్గొనరు అని అడిగితే.. తాను ఎప్పట్నుంచో సుమతోనే ఇంటర్వ్యూ చేయాలని చూస్తున్నానని.. కానీ ఆమె బిజీగా ఉండడంతో వేరే వాళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టం లేక చేయలేదని నవ్వుతూ చెప్పింద నయన్.
మరి గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్లో కూడా ఎందుకు పాల్గొనలేదు అని అడిగితే.. అప్పుడు తాను ఫారిన్లో ఉన్నట్లు వెల్లడించింది. కానీ ఇది జస్ట్ కవరింగ్ అని ఎవరికైనా అర్థమైపోతుంది. నయన్ ఒప్పుకుంటే సుమతో ఎప్పుడో ఇంటర్వ్యూలు చేయించేవారు మన నిర్మాతలు. అలాగే ఆమె ఇండియాలో ఉండగా ఇక్కడ ఎన్నో ఈవెంట్లు జరిగాయి. అందులో వేటికీ ఆమె హాజరవకపోవడాన్ని ఎలా సమర్థించుకుంటుందో మరి?
This post was last modified on December 22, 2022 6:19 am
2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో కూటమి పార్టీలకు చెందిన శ్రేణుల నుంచి ఓ వినూత్న నినాదం వినిపించింది. సైకో…
బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ మీద జరిగిన రివ్యూలు, ఆన్ లైన్ విశ్లేషణలు, సోషల్…
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే ఎంటర్ టైనర్ కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఏవేవో పేర్లు అనుకుని…
"తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ విషయంలో కఠినంగా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు."- ఇదీ.. కొన్నిరోజుల కిందట పోలీసు బాస్ చేసిన కామెంట్లు.…
ఎదురు చూసి చూసి అభిమానులే అంచనాలు తగ్గించేసుకున్న హరిహర వీరమల్లు గేరు మార్చబోతోందని తాజా సమాచారం. ఈ రోజు నుంచి…
నిన్న జరిగిన లార్వెన్ ఏఐ స్టూడియో ప్రారంభోత్సవంలో దర్శకులను ఉద్దేశించి నిర్మాత దిల్ రాజు అన్న మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.…