ఇప్పటిదాకా తెలుగులో చాలా సినిమాల్లో నటించింది నయనతార. ఐతే ఒక్క శ్రీరామరాజ్యం సినిమా వేడుకలో తప్ప ఇంకే ప్రమోషనల్ ఈవెంట్లోనూ ఆమె కనిపించింది లేదు. అది కూడా తనకు చివరి సినిమాగా భావించి ఆ వేడుకకు వచ్చింది. దానికి ముందు ఆమె ఎప్పడూ ప్రమోషన్లలో పాల్గొన్నది లేదు. తమిళంలో కూడా చాలా సినిమాల ప్రమోషన్లకు ఆమె దూరంగా ఉంది.
నటించడం వరకే తన పని అని, ప్రమోషన్లకు రాను అని ముందే తాను చెప్పేస్తానన్నది ఆమె వాదన. అలా అని ఆమె ఏ సినిమానూ ప్రమోట్ చేయదా అంటే అదేం లేదు. తన భర్త విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో లేదా నిర్మాణంలో తెరకెక్కే సినిమాలు, అలాగే కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మాత్రం ఆమె ప్రమోషన్లు చేస్తుంటుంది. తాజాగా విఘ్నేష్ ప్రొడక్షన్లోనే తెరకెక్కిన కనెక్ట్ సినిమాను అటు తమిళంలో, ఇటు తెలుగులో ఆమె ప్రమోట్ చేస్తోంది.
తెలుగులో యాంకర్ సుమతో ఆమె ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసింది. ఐతే ఈ ఇంటర్వ్యూ చూశాక వచ్చే కౌంటర్లను ముందే ఊహించి తాను ప్రమోషన్లు చేయని విషయంలో ప్రశ్నలు అడిగించుకుంది నయన్. ఎందుకు సినిమా వేడుకల్లో, ఇంటర్వ్యూల్లో పాల్గొనరు అని అడిగితే.. తాను ఎప్పట్నుంచో సుమతోనే ఇంటర్వ్యూ చేయాలని చూస్తున్నానని.. కానీ ఆమె బిజీగా ఉండడంతో వేరే వాళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టం లేక చేయలేదని నవ్వుతూ చెప్పింద నయన్.
మరి గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్లో కూడా ఎందుకు పాల్గొనలేదు అని అడిగితే.. అప్పుడు తాను ఫారిన్లో ఉన్నట్లు వెల్లడించింది. కానీ ఇది జస్ట్ కవరింగ్ అని ఎవరికైనా అర్థమైపోతుంది. నయన్ ఒప్పుకుంటే సుమతో ఎప్పుడో ఇంటర్వ్యూలు చేయించేవారు మన నిర్మాతలు. అలాగే ఆమె ఇండియాలో ఉండగా ఇక్కడ ఎన్నో ఈవెంట్లు జరిగాయి. అందులో వేటికీ ఆమె హాజరవకపోవడాన్ని ఎలా సమర్థించుకుంటుందో మరి?
This post was last modified on December 22, 2022 6:19 am
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…