టాలీవుడ్ లో ఆ మధ్య కొంచెం గ్యాప్ చూసిన అనుపమ పరమేశ్వరన్ కు ఈ ఏడాది కార్తికేయ 2 రూపంలో బ్లాక్ బస్టర్ పడ్డాక మళ్ళీ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఎల్లుండి విడుదల కాబోతున్న 18 పేజెస్ మీద సైతం కాన్ఫిడెంట్ గా ఉంది. నిఖిల్ జోడి మరోసారి రిపీట్ కావడంతో ఫ్యాన్స్ హిట్ సెంటిమెంట్ ని ఫీలవుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ దూకుడుగా లేవు కానీ ట్రైలర్ వచ్చాక డీసెంట్ బజ్ అయితే కనిపిస్తోంది. టాక్ కీలకంగా వ్యవహరించే ఇలాంటి సినిమాలకు ఓపెనింగ్స్ పెద్ద అద్భుతాలు చేయవు కానీ బాగుందనే మాట బయటికి వస్తే చాలు ఆటోమేటిక్ గా జనాలు థియేటర్లకు వచ్చేస్తారు.
దీని ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతున్న అనుపమకు డీజే టిల్లు 2కి సంబంధించిన టాపిక్ డిస్కషన్ కు వచ్చినప్పుడు ఆ ఒక్కటి అడగొద్దని స్కిప్ కొట్టేసింది. షూటింగ్ ప్రారంభానికి ముందు ఓకే చెప్పి తర్వాత ఏవో కారణాల వల్ల బయటికి వచ్చి తిరిగి మళ్ళీ జాయిన్ కానున్నారనే వార్త నిన్నటి నుంచి చక్కర్లు కొడుతోంది. దాని గురించే అడిగితే దాటవేత సమాధానం తప్ప క్లారిటీ ఇవ్వలేదు. ఇది కేవలం 18 పేజెస్ కు సంబంధించిన ఇంటరాక్షన్ కాబట్టి దీని గురించి తర్వాత మాట్లాడుదాం అని తేల్చేసింది. స్పష్టంగా నేను అందులో లేనని చెప్పలేదంటే ఇన్ డైరెక్ట్ గా ఉన్నట్టేనని ఒప్పుకున్నట్టా?
దీని తర్వాత అనుపమ నటించిన బటర్ ఫ్లై త్వరలో హాట్ స్టార్ ద్వారా నేరుగా ఓటిటి రిలీజ్ జరుపుకోనుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈగల్ లోనూ జోడి కట్టనుంది. ఇవి కాకుండా సైరన్ అనే తమిళ మూవీ నిర్మాణంలో ఉంది. డీజే టిల్లు స్క్వేర్ కనక కన్ఫర్మ్ అయితే మళ్ళీ ఈ లిస్టులోకి చేర్చుకోవచ్చు. మలయాళంలోనూ జెఎస్కె తన చేతిలోనే ఉంది. గత ఏడాది రౌడీ బాయ్స్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా ఈ సంవత్సరం కార్తికేయ 2తో వచ్చిన సక్సెస్ ఇప్పుడీ 18 పేజెస్ తో కంటిన్యూ అయితే కెరీర్ ని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫలితం దక్కుతుందో మరి.
This post was last modified on December 21, 2022 1:59 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…