బాలీవుడ్లో ఈ మధ్య మెరుపులు బాగా తగ్గిపోయాయి. నార్త్ మార్కెట్ను దున్నేస్తున్న సౌత్ సినిమాలను చూసి కంగారు పడుతూ తాము ఎలాంటి సినిమాలు తీయాలో తెలియక సతమతం అవుతున్నారు. ఇలాంటి టైంలో కొన్ని సినిమాలు మాత్రం వారిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ మధ్య అజయ్ దేవగణ్ సినిమా ‘దృశ్యం-2’ చాలా మంచి ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం యథాప్రకారమే బోల్తా కొట్టేశాయి.
ఇప్పుడు బాలీవుడ్లో మళ్లీ ఆశలు రేకెత్తిస్తున్న సినిమాల్లో ‘కుత్తే’ ఒకటి. అర్జున్ కపూర్, టబు, రాధికా మదన్, నసీరుద్దీన్ షా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్ర ట్రైలర్ తాజాగా లాంచ్ అయింది. అది ఇన్స్టంట్ హిట్టయిపోయి ప్రేక్షకుల్లో సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. ఈ మధ్య కాలంలో బెస్ట్ ట్రైలర్ కట్గా దీన్ని క్రిటిక్స్ అభివర్ణిస్తున్నారు. ఆ ట్రైలర్ చూస్తే ఈ మాట నిజమే అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే.
చాప్టర్-1 అంటూ ముందుగా పాత్రల పరిచయం.. చాప్టర్-2 అంటూ తర్వాత కథ గురించి హింట్ ఇవ్వడం.. ఇలా ఆసక్తికరంగా ట్రైలర్ కట్ చేశారు. కథ పరంగా చూసుకుంటే ఇది కొత్తదేమీ కాదు. అటవీ ప్రాంతంలో మూణ్నాలుగు కోట్ల డబ్బుతో ఓ వ్యాన్ వెళ్తోందని.. దాన్ని కొట్టేద్దామని వేర్వేరు వ్యక్తులు ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగడం.. అక్కడ వారికి ఎదురయ్యే అనుభవాలు.. వీళ్లు వెళ్లేసరికే ఆ డబ్బును వేరొకరు కొట్టేయడం.. తర్వాత వీరిలో పరస్పర గొడవలు.. ఈ నేపథ్యంలో నడిచే కథ ఇది.
దొంగా దొంగా, క్షణక్షణం లాంటి సినిమాలో ఎప్పుడో ఈ టైపు స్టోరీలు చూశాం. కాకపోతే ట్రీట్మెంట్ కొంచెం భిన్నంగా, పూర్తి ఎంటర్టైనింగ్గా ఉన్నట్లు కనిపిస్తోంది ‘కుత్తే’లో. ట్రైలర్ మాత్రం భలేగా కట్ చేశారు. నాన్ స్టాప్ ఎంటర్టైనర్ ఇదనే సంకేతాలు ఇచ్చారు. ‘కుత్తే’ అనే టైటిల్కు తగ్గట్లే పాత్రలన్నింటిదీ కుక్కల మనస్తత్వమే అన్నట్లు ట్రైలర్లో చూపించడం విశేషం. అర్జున్తో పాటు టబు, రాధికా ట్రైలర్లో బాగా హైలైట్ అయ్యారు. అస్మాన్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముదుకు రానుంది.
This post was last modified on December 21, 2022 1:45 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…