లేడీ సూపర్ స్టార్ గా అభిమానులు పిలుచుకునే నయనతార తను నటించే సినిమాలో ఎంత పెద్ద స్టార్ ఉన్నా సరే ప్రమోషన్లకు రాదన్న విషయం మీడియాకే కాదు సగటు సామాన్య ప్రేక్షకులకూ తెలుసు. గాడ్ ఫాదర్ అంటే అప్పుడేదో హానీమూన్, పిల్లల హడావిడి అనుకోవచ్చు కానీ అంతకు ముందు అదే చిరంజీవితో సైరా నరసింహారెడ్డిలో నటించినప్పుడూ ముంబై నుంచి హైదరాబాద్ దాకా ఏ ఒక్క ఈవెంట్ లోనూ తను కనిపించలేదు. బాలయ్యతో జైసింహా చేసినా ట్రీట్ మెంట్ లో మార్పు ఉండదు. శ్రీరామరాజ్యం టైంలో మాత్రమే కొంచెం బయట కనిపించింది కానీ ప్రభాస్, తారక్ ఎవరితో జోడి కట్టినా తన ధోరణి ఎప్పుడూ ఒక్కటే.
కానీ విచిత్రంగా కొత్త మూవీ కనెక్ట్ విషయంలో మాత్రం దీనికి మినహాయింపు ఇచ్చింది. ఎన్నడూ లేనిది అచ్చ తెలుగులో సుమకో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆ చిత్రం విశేషాలతో పాటు టాలీవుడ్ హీరోలతో తన అనుభవాలు, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి పొగడ్తలు కురిపించింది. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. కనెక్ట్ కేవలం తొంభై తొమ్మిది నిమిషాల చిన్న సినిమా. అది కూడా ఇంటర్వెల్ లేకుండా ఏకధాటిగా సాగుతుంది. పైగా కాన్సెప్ట్ కూడా మరీ కొత్తదేం కాదు. లాక్ డౌన్ టైంలో ఒంటరిగా ఉన్న వ్యక్తుల జీవితాల్లో దెయ్యం వస్తే ఎలా ఉంటుందన్న పాయింట్ తో రూపొందింది.
సరే దాని రిజల్ట్ ఎలా ఉంటుందన్నది రేపు తేలుతుంది కానీ నయన్ లో ఈ మార్పు కేవలం కనెక్ట్ కే పరిమితమా లేక ఇకపై చేయబోయే వాటికి కూడా వర్తిస్తుందన్నది చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రాజమౌళి లాంటి దర్శకుడే ప్రమోషన్ కోసం దేశ విదేశాలు తిరుగుతున్న ట్రెండ్ లో నా పద్ధతి నాదే అనే తరహాలో నయనతార వ్యవహరించిన శైలి ఇకపై సాగకపోవచ్చు. అసలే పెళ్ళై బిడ్డల తల్లిగా మారాక ఆఫర్లలో హెచ్చు తగ్గులు సహజంగా ఉంటాయి. వాటిని బ్యాలన్స్ చేయడం చాలా కష్టం. కొందరు మాత్రమే దీన్ని నెగ్గుకురాగలిగారు. ,మరి నయన్ ప్లానింగ్ ఎలా ఉంటుందో
This post was last modified on December 21, 2022 11:22 am
పెళ్లి లేదు ప్రెగ్నెంటూ లేదు, కొడుకు పేరు కృష్ణమనోహర్ అనేది కొత్త సామెత. కొన్ని రిలీజ్ డేట్ల వ్యవహారం చూస్తుంటే…
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…