టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ఈ మధ్య ఎక్కువగా నెగెటివ్ న్యూస్లే వినిపిస్తున్నాయి. ఆమె అనారోగ్యం గురించి ఎక్కువ చర్చ నడుస్తుండగా.. ఆ ప్రభావం తన సినిమాల మీద కూడా ప్రతికూల ప్రభావమే చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ విజయ్ దేవరకొండతో సమంత చేస్తున్న ఖుషి మూవీ షూటింగ్ తన అనారోగ్యం కారణంగానే ఆగిన సంగతి తెలిసిందే.
ఐతే సమంత కోలుకోవడానికి చాలా టైం పడుతుందని, ఇప్పట్లో ఈ షూటింగ్ మొదలు కాదని ఓ ప్రచారం నడుస్తుండగా..అది చాలదన్నట్లుసమంత నటించాల్సిన హిందీ సినిమాలకు కూడా బ్రేక్ పడిందని.. ఆ సినిమాల నుంచి సమంతను తప్పిస్తున్నారని కొత్త రూమర్లు ఊపందుకున్నాయి. రోజు రోజుకూ ఇలాంటి వార్తలు పెరిగిపోతుండడంతో సమంత టీం స్పందించింది. ఆమె గురించి జరుగుతున్న ప్రచారం అబద్ధమంటూ తన మేనేజర్ మీడియాకు క్లారిటీ ఇచ్చాడు.
సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోందని.. సంక్రాంతి తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి షూటింగ్లో పాల్గొంటుందని సమంత ప్రతినిధి మీడియాకు స్పష్టం చేశారు. ఆ సినిమా అయ్యాక సమంత ఒప్పుకున్న బాలీవుడ్ సినిమాలకు పని చేస్తుందన్నాడు. జనవరి నుంచే సమంత ఒక హిందీ సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉండగా.. ఖుషి మూవీ ఆలస్యం కావడం వల్ల ఇది కూడా లేటవుతోందని.. ఏప్రిల్-మే నెలల నుంచి ఆమె బాలీవుడ్ చిత్రాలకు పని చేయొచ్చని అతను తెలిపాడు.
సినిమా షూటింగ్ కోసం నెలల పాటు నిర్మాతలు వేచి చూసేలా చేయడం భావ్యం కాదని.. ఇలా వేచి చూడలేకపోతే ప్రత్యామ్నాయాలు చూసుకోవచ్చని సమంత తన నిర్మాతలకు చెప్పిందని.. ఐతే తాను సైన్ చేసిన ఏ ప్రాజెక్టుకూ సమంత దూరం కాలేదని.. ఆమె గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమని తన ప్రతినిధి స్పష్టం చేశారు.
This post was last modified on December 20, 2022 10:15 pm
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. లక్షల్లోనే ఉద్యోగాలకు ప్రతిష్టాత్మక సంస్థలు మంగళం పాడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోక్స్…
ఇండియాలో ఓటీటీల హవా మొదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో…
తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన టీవీ ఛానెళ్లలో ఈటీవీ ఒకటి. 90వ దశకంలో ప్రైవేటు టీవీ ఛానెళ్ల జోరు పెరుగుతున్న…
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, దివంగత నటుడు కోటా శ్రీనివాసరావులు నటించిన ‘హై హై…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ఫలితం పట్ల దర్శకుడు ఆదిత్య హాసన్ టెన్షన్ పడుతున్న…
భారత్లో కొత్త కార్లు కొనేవాళ్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. ఆగస్టులో పెట్రోల్ కార్ల కంటే CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు…