టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ఈ మధ్య ఎక్కువగా నెగెటివ్ న్యూస్లే వినిపిస్తున్నాయి. ఆమె అనారోగ్యం గురించి ఎక్కువ చర్చ నడుస్తుండగా.. ఆ ప్రభావం తన సినిమాల మీద కూడా ప్రతికూల ప్రభావమే చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ విజయ్ దేవరకొండతో సమంత చేస్తున్న ఖుషి మూవీ షూటింగ్ తన అనారోగ్యం కారణంగానే ఆగిన సంగతి తెలిసిందే.
ఐతే సమంత కోలుకోవడానికి చాలా టైం పడుతుందని, ఇప్పట్లో ఈ షూటింగ్ మొదలు కాదని ఓ ప్రచారం నడుస్తుండగా..అది చాలదన్నట్లుసమంత నటించాల్సిన హిందీ సినిమాలకు కూడా బ్రేక్ పడిందని.. ఆ సినిమాల నుంచి సమంతను తప్పిస్తున్నారని కొత్త రూమర్లు ఊపందుకున్నాయి. రోజు రోజుకూ ఇలాంటి వార్తలు పెరిగిపోతుండడంతో సమంత టీం స్పందించింది. ఆమె గురించి జరుగుతున్న ప్రచారం అబద్ధమంటూ తన మేనేజర్ మీడియాకు క్లారిటీ ఇచ్చాడు.
సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోందని.. సంక్రాంతి తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి షూటింగ్లో పాల్గొంటుందని సమంత ప్రతినిధి మీడియాకు స్పష్టం చేశారు. ఆ సినిమా అయ్యాక సమంత ఒప్పుకున్న బాలీవుడ్ సినిమాలకు పని చేస్తుందన్నాడు. జనవరి నుంచే సమంత ఒక హిందీ సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉండగా.. ఖుషి మూవీ ఆలస్యం కావడం వల్ల ఇది కూడా లేటవుతోందని.. ఏప్రిల్-మే నెలల నుంచి ఆమె బాలీవుడ్ చిత్రాలకు పని చేయొచ్చని అతను తెలిపాడు.
సినిమా షూటింగ్ కోసం నెలల పాటు నిర్మాతలు వేచి చూసేలా చేయడం భావ్యం కాదని.. ఇలా వేచి చూడలేకపోతే ప్రత్యామ్నాయాలు చూసుకోవచ్చని సమంత తన నిర్మాతలకు చెప్పిందని.. ఐతే తాను సైన్ చేసిన ఏ ప్రాజెక్టుకూ సమంత దూరం కాలేదని.. ఆమె గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమని తన ప్రతినిధి స్పష్టం చేశారు.
This post was last modified on December 20, 2022 10:15 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…