‘అవతార్-2’ సినిమా మీద ఉన్న అంచనాల ప్రకారం చూస్తే ప్రపంచవ్యాప్తంగా సినిమా వసూళ్ల రికార్డులన్నీ బద్దలైపోతాయనే అనుకున్నారంతా. కానీ రిలీజ్ దగ్గర పడేసరికి హైప్ కొన్ని కారణాల వల్ల తగ్గిపోయింది. అందుకు ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడం ఒక కారణం కావచ్చు. దీనికి తోడు ప్రిమియర్ల నుంచి మిక్స్డ్ టాక్ రావడం కూడా మైనస్ అయింది. ఇక రిలీజ్ రోజు కూడా టాక్ అందుకు తగ్గట్లే వచ్చింది. ఉన్నంతలో మెరుగైన వసూళ్లే సాధించినప్పటికీ.. ఓవరాల్గా మాత్రం సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.
వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం 450 మిలియన్లకు అటు ఇటుగా వసూళ్లు రాబట్టింది. మామూలుగా చూస్తే ఇది చాలా పెద్ద ఫిగర్ కానీ.. ‘అవతార్-2’ స్థాయికి మాత్రం వసూళ్లు చాలా తక్కువే. రికార్డుల లెక్కలు తీస్తే ‘ఎవెంజర్స్: ది ఎండ్గేమ్’ను బీట్ చేయకపోగా.. చాలా చిత్రాల కంటే ‘అవతార్-2’ వెనుకబడింది.
ఈ ప్రభావం ‘అవతార్-2’ నిర్మాణ భాగస్వామి, డిస్ట్రిబ్యూటర్ అయిన డిస్నీ సంస్థ మీద బాగానే పడింది. ఆ సంస్థ షేర్లు మార్కెట్లూ బాగా పతనం అవుతుండడమే ఇందుకు సూచిక. 52 వారాల లో లెవల్కి ‘డిస్నీ’ షేర్లు పడిపోవడం గమనార్హం. ఆల్రెడీ డిస్నీ షేర్లు కొంచెం దెబ్బ తినగా ‘అవతార్-2’ బాక్సాఫీస్ బ్యాడ్ పెర్ఫామెన్స్ ప్రతికూల ప్రభావం చూపింది. ఆ మధ్య ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు డివైడ్ టాక్ రాగానే పీవీఆర్ సంస్థ షేర్లు పడిపోవడం తెలిసిందే. ఇది కూడా అలాంటిదే.
వీకెండ్ వరకు ‘అవతార్-2’ జోరు చూపించినా.. ఆ తర్వాత వసూళ్లు పడిపోయాయి. ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో మినహా ఎక్కడా ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో లేదు. వరల్డ్ వైడ్ ఈ సినిమా 2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.16 వేల కోట్లు) సాధిస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అవ్వదు. కానీ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఫుల్ రన్ వసూళ్లు 1.5 బిలియన్ డాలర్ల మార్కును కూడా అందుకోవడం కష్టమే అనిపిస్తోంది.
This post was last modified on December 20, 2022 5:37 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…