కొత్త సినిమాలకు మంచి రిలీజ్ డేట్ కనిపించినపుడు.. ఒకేసారి మూణ్నాలుగు సినిమాలు పోటీకి సై అనడం చూస్తూనే ఉంటాం. ఇలా పోటీ పడటం వల్ల ఒక సినిమా కలెక్షన్లపై ఇంకోదాని ప్రభావం ఉంటుందని తెలిసినా.. అనివార్య పరిస్థితుల్లో రిలీజ్ చేస్తుంటారు. ఏటా తెరకెక్కే సినిమాలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోక తప్పని పరిస్థితి తలెత్తింది.
ఐతే ఇప్పుడు థియేటర్లన్నీ మూతపడి ఉన్నాయి. కొత్త సినిమాలు చాలా వరకు ఫస్ట్ కాపీతో రెడీ అయి కూడా విడుదలకు నోచుకోకుండా ఉన్నాయి. వీటిలో కొన్నిటిని ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తున్నారు. ఐతే అక్కడైనా రిలీజ్ విషయంలో ఆగి.. ఆచితూచి రిలీజ్ చేస్తున్నారా అంటే అదీ లేదు.
ఓటీటీ రిలీజ్కు రెడీ అయిన సినిమాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండటంతో ఒకే వీకెండ్లో మూణ్నాలుగు సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితి తలెత్తుతోంది. ఈ నెలాఖర్లో ఒకే వారాంతంలో నాలుగు కొత్త చిత్రాలు ఓటీటీల్లో విడుదలవుతుండటం విశేషం. ఆ నాలుగు సినిమాలూ నాలుగు వేర్వేరు ఓటీటీల్లో రిలీజవుతుండటం విశేషం. అమేజాన్ ప్రైంలో విద్యాబాలన్ సినిమా శకుంతలా దేవిని జులై 31న విడుదల చేయబోతున్నట్లు ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా నెట్ ఫ్లిక్స్ వాళ్లు అదే రోజు నవాజుద్దీన్ సిద్దిఖీ చిత్రం రాత్ అకేలి హై ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మరోవైపు హాట్ స్టార్ వాళ్లు లూట్ కేస్ చిత్రాన్ని జులై 31కే షెడ్యూల్ చేశారు. దీనికి ఒక రోజు ముందు జీ5లో విద్యుత్ జమాల్ చిత్రం యారా రిలీజ్ కాబోతోంది. ఓటీటీల్లోనూ ఒక రిలీజ్ డేట్ కోసం ఇంత పోటీ నెలకొనడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on July 17, 2020 10:00 pm
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…