కొత్త సినిమాలకు మంచి రిలీజ్ డేట్ కనిపించినపుడు.. ఒకేసారి మూణ్నాలుగు సినిమాలు పోటీకి సై అనడం చూస్తూనే ఉంటాం. ఇలా పోటీ పడటం వల్ల ఒక సినిమా కలెక్షన్లపై ఇంకోదాని ప్రభావం ఉంటుందని తెలిసినా.. అనివార్య పరిస్థితుల్లో రిలీజ్ చేస్తుంటారు. ఏటా తెరకెక్కే సినిమాలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోక తప్పని పరిస్థితి తలెత్తింది.
ఐతే ఇప్పుడు థియేటర్లన్నీ మూతపడి ఉన్నాయి. కొత్త సినిమాలు చాలా వరకు ఫస్ట్ కాపీతో రెడీ అయి కూడా విడుదలకు నోచుకోకుండా ఉన్నాయి. వీటిలో కొన్నిటిని ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తున్నారు. ఐతే అక్కడైనా రిలీజ్ విషయంలో ఆగి.. ఆచితూచి రిలీజ్ చేస్తున్నారా అంటే అదీ లేదు.
ఓటీటీ రిలీజ్కు రెడీ అయిన సినిమాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండటంతో ఒకే వీకెండ్లో మూణ్నాలుగు సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితి తలెత్తుతోంది. ఈ నెలాఖర్లో ఒకే వారాంతంలో నాలుగు కొత్త చిత్రాలు ఓటీటీల్లో విడుదలవుతుండటం విశేషం. ఆ నాలుగు సినిమాలూ నాలుగు వేర్వేరు ఓటీటీల్లో రిలీజవుతుండటం విశేషం. అమేజాన్ ప్రైంలో విద్యాబాలన్ సినిమా శకుంతలా దేవిని జులై 31న విడుదల చేయబోతున్నట్లు ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా నెట్ ఫ్లిక్స్ వాళ్లు అదే రోజు నవాజుద్దీన్ సిద్దిఖీ చిత్రం రాత్ అకేలి హై ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మరోవైపు హాట్ స్టార్ వాళ్లు లూట్ కేస్ చిత్రాన్ని జులై 31కే షెడ్యూల్ చేశారు. దీనికి ఒక రోజు ముందు జీ5లో విద్యుత్ జమాల్ చిత్రం యారా రిలీజ్ కాబోతోంది. ఓటీటీల్లోనూ ఒక రిలీజ్ డేట్ కోసం ఇంత పోటీ నెలకొనడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…
రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…
అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…
ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…