కొంచెం మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ భారీ వసూళ్లతో సాగిపోతుంటే.. ‘అవతార్-2’ను డిజాస్టర్ అని అప్పుడే ఎలా తీర్మానించేశారు అని ఆశ్చర్యం కలగుుతోందా? ఐతే ఇది మొత్తంగా ‘అవతార్-2’ వసూళ్లకు సంబంధించిన విషయం కాదు. ఆ సినిమా 2డీ వెర్షన్ ముచ్చట. ఈ చిత్రాన్ని 2డీ, త్రీడీ, 4డీఎక్స్.. ఇలా వివిధ ఫార్మాట్లలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
4డీ ఎక్స్ స్క్రీన్లు ఇండియాలో చాలా పరిమితంగా ఉన్నాయి. త్రీడీలో మాత్రం సినిమా విస్తృతంగా రిలీజైంది. మల్టీప్లెక్సులన్నీ దాదాపుగా త్రీడీ వెర్షన్నే రిలీజ్ చేశాయి. వాటిలో ఆక్యుపెన్సీ చాలా బాగుంది. తొలి రోజు నుంచి త్రీడీ థియేటర్లన్నీ దాదాపు హౌస్ ఫుల్స్తోనే నడుస్తున్నాయి. మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ వసూళ్లలో పెద్ద డ్రాప్ అయితే లేదు. ఐతే సింగిల్ స్క్రీన్లలో ‘అవతార్-2’ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు.
రెనొవేట్ చేసి ఆధునిక టెక్నాలజీని సమకూర్చుకుని పిక్చర్, సౌండ్ క్వాలిటీ బాగున్న సింగిల్ స్క్రీన్లలో ‘అవతార్-2’ బాగానే ఆడుతోంది. అలాంటి థియేటర్లలో చాలా వరకు త్రీడీ వెర్షన్నే ప్రదర్శిస్తున్నారు. అలా కాకుండా సాధారణ థియేటర్లు, 2డీ వెర్షన్ ప్రదర్శిస్తున్న థియేటర్లు మాత్రం తొలి రోజు నుంచే వెలవెలబోతున్నాయి.
సమీపంలో ఉన్న మల్టీప్లెక్సుల్లో టికెట్లు దొరకని పరిస్థితి కనిపిస్తుంటే.. ఈ థియేటర్లలో టికెట్లు కొనేవారు లేరు. ‘అవతార్-2’ లాంటి విజువల్ వండర్ చూడడానికి కొంచెం ఖర్చు ఎక్కువ అయినా పర్వాలేదని ప్రేక్షకులు మంచి థియేటర్, త్రీడీ వెర్షన్ చూసుకుంటుండడంతో 2డీ వెర్షన్ ప్రదర్శిస్తున్న సింగిల్ స్క్రీన్లకు ఇబ్బందులు తప్పట్లేదు.
మొత్తంగా చెప్పాలంటే ‘అవతార్-2’ 2డీ వెర్షన్ డిజాస్టర్ అనడంలో మరో మాటలేదు. ఇక మొత్తంగా చూస్తే ‘అవతార్-2’ ఇండియాలో రెండు రోజుల్లోనే దాదాపు వంద కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఫుల్ రన్లో ఈ చిత్రం ఫుల్ రన్లో ఇండియాలో రూ.250-300 కోట్ల మధ్య వసూళ్లు సాధించే అవకాశముంది.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…