కొన్ని నెలల కిందట తమిళ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ను తెలుగులో సరిగా ఆదరించట్లేదని, ఆ సినిమాను తక్కువ చేస్తున్నారని తమిళ జనాలు, విమర్శకులు తెగ ఫీలైపోయారు. మన వాళ్లకు అభిరుచి లేదని.. తాము బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలను ఆదరించినట్లు తెలుగు వాళ్లు వేరే భాషా చిత్రాలను విశాల హృదయంతో ఆదరించట్లేదని కామెంట్లు చేశారు. కానీ ఇతర భాషా చిత్రాల విషయంలో తెలుగు వాళ్లు చూపించే పెద్ద మనసు విషయంలో దేశంలో మరే భాషకు చెందిన ప్రేక్షకులు సాటి రారు అంటే అతిశయోక్తి కాదు.
భాష, ప్రాంతం ఇవేవీ చూడకుండా సినిమా బాగుందంటే చాలు పరిగెత్తుకుని థియేటర్లకు వెళ్లిపోవడం తెలుగు ప్రేక్షకులకే చెల్లింది. ‘కాంతార’ అనే సినిమా టీంలో ఎవ్వరూ మన వారికి పరిచయం లేకపోయినా సరే.. ఆ సినిమా బాగుందన్న టాక్ రాగానే కన్నడ వెర్షన్ను ఎగబడి చూశారు. ఇక ఆ చిత్రం తెలుగులో రిలీజైతే బ్రహ్మరథం పట్టారు.
ఇటీవలే ‘లవ్ టుడే’ అనే చిన్న చిత్రం పబ్లిసిటీ లేకుండా తెలుగులో రిలీజ్ చేస్తే దాన్ని కూడా సూపర్ హిట్ చేసిన ఘతన మన వాళ్లకే సొంతం. ఇప్పుడు అవతార్-2 విషయంలోనూ తెలుగు ప్రేక్షకుల నుంచి ఇలాంటి స్పందనే కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందే నెగెటివ్ రివ్యూలు బయటికి రావడంతో ఇతర భాషల ప్రేక్షకులు అంత ఉత్సాహంగా థియేటర్లకు కదల్లేదు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ విజువల్ వండర్ను థియేటర్లలో చూసి తీరాలనే ఉత్సాహంతో పెద్ద ఎత్తున థియేటర్లకు కదిలారు.
రెండు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో ‘అవతార్-2’ రిలీజ్ కాగా.. త్రీడీ థియేటర్లన్నీ దాదాపుగా జనాలతో నిండిపోయాయి. మల్టీప్లెక్సుల్లో అయితే టికెట్లు దొరకడం కష్టమైంది. తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినా జోరేమీ తగ్గినట్లు కనిపించడం లేదు. తొలి రోజు ఇండియాలో ‘అవతార్-2’కు వచ్చిన వసూళ్లు 40 శాతానికి పైగా తెలుగు రాష్ట్రాల నుంచి రావడం చూసి జాతీయ స్థాయిలో ట్రేడ్ పండిట్లు షాకవుతున్నారు. మనవాళ్ల సినిమా అభిమానం వేరే లెవెల్ అంటూ కొనియాడుతున్నారు.
This post was last modified on December 17, 2022 10:54 pm
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…
సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…
నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…
ఈనెల 17 వ తేదీన ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజులపాటు జరిగాయి. బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో…