Movie News

మహేష్ ని బాధపెట్టిన భారీ డిజాస్టర్

సూపర్ స్టార్ గా తన ఇరవై ఏడేళ్ల సినిమాల్లో మహేష్ బాబుకి అన్ని రకాల ఫలితాలు కలగలసి ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఫ్లాప్ లు, యావరేజ్ లు ఇలా ఎన్నో. అయితే డిజాస్టర్ల విషయంలో తను అంత ఈజీగా రిసీవ్ చేసుకోలేడన్న సంగతి తెలిసిందే. అలా జరిగినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్లి కాఫీ తాగి రిలాక్స్ అయ్యేవాడినని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గుర్తే. అయితే ప్రిన్స్ ఇన్నేళ్ల కెరీర్ లో బాగా మనస్థాపం కలిగించిన మూవీ ఏదంటే ఫ్యాన్స్ ఠక్కున బాబీ అని చెబుతారేమో కానీ తనకు వ్యక్తిగతంగా డిస్ట్రబ్ చేసిన చిత్రం నాన్న కృష్ణతో కలిసి నటించిన, భార్య నమ్రతతో ప్రేమ చిగురులు తొడిగిన వంశీ అంటే షాక్ అవుతారేమో.

దీని వెనుక మహేషే స్వయంగా చెప్పిన అనుభవముంది. సోలో హీరోగా తన ప్రయాణం రాజకుమారుడుతో మొదలుపెట్టినప్పుడు మూడో సినిమా పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లో అది కూడా తండ్రి కాంబినేషన్ లో చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు. అలా 2000 సంవత్సరంలో వంశీకి శ్రీకారం చుట్టారు. బి గోపాల్ లాంటి ప్రముఖ దర్శకుడికి బాధ్యత ఇచ్చారు. అయితే సరైన రీతిలో స్క్రిప్ట్ రూపుదిద్దుకోలేదు. ఎంత ప్రయత్నించినా అందరికీ నచ్చేలా ఒక కొలిక్కి రాకపోయినా హడావిడిగా షూటింగ్ మొదలుపెట్టేశారు. జరుగుతున్నంత సేపు మహేష్ లో ఏ మాత్రం ఎగ్జైట్ మెంట్ లేక ఇది ఖచ్చితంగా పోతుందని అర్థమైపోయింది.

ఫస్ట్ కాపీ వచ్చాక ప్రివ్యూ వేస్తే అందరూ హాజరయ్యారు. ఇంటర్వెల్ కాగానే మహేష్ ఇంటికి వెళ్ళిపోయి రూంలో ఒంటరిగా పడుకుని కళ్ళు మూసుకున్నాడు. బాధగా అనిపించింది. ప్రీమియర్ అయ్యాక ఫోన్లు వచ్చాయి చాలా బాగుందని. నవ్వుకున్నాడు. రిలీజయ్యాక వంశీ మాములు డిజాస్టర్ కాలేదు. తన జోస్యమే నిజమయ్యింది. ఆర్టిస్టుగా ఒక్క శాతం కూడా సంతృప్తి కలిగించని సినిమాగా వంశీని ఎప్పటికీ గుర్తుంచుకునేలా అయ్యింది. హాలీవుడ్ మూవీ ఎంఐ2 గ్రాఫిక్స్ అనుకరించిన తీరు మీద విమర్శలు రావడంతో అప్పటి నుంచి లోకల్ గ్రాఫిక్స్ వద్దనుకుని డిసైడ్ అయ్యాడట. ఇదంతా మహేష్ టక్కరి దొంగ షూట్ లో స్వయంగా చెప్పిన ఫ్లాష్ బ్యాక్.

This post was last modified on December 17, 2022 10:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

2 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

2 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

3 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

5 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

5 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

6 hours ago