Movie News

రీయూనియన్ ఎమోషన్లో మాటిచ్చేసిన చిరు?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని డిసైడయ్యాక తొలి రెండు చిత్రాల విషయంలో కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నారు. కానీ ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి చిత్రాల తర్వాత ఆయన జోరు పెంచారు. కరోనా వల్ల ‘ఆచార్య’ కొంచెం ఆలస్యం అయినా.. ఆ సినిమా రిలీజైన కొన్ని నెలలకే ‘గాడ్ ఫాదర్’తో ప్రేక్షకులను పలకరించారు. ఇక సంక్రాంతికి ఆయన ‘వాల్తేరు వీరయ్య’తో రాబోతున్నారు. తర్వాత కొన్ని నెలలకే వేసవిలో ‘భోళా శంకర్’గా దర్శనమిస్తారు.

దీని తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయాల్సింది కానీ.. స్క్రిప్టు సంతృప్తినివ్వకపోవడంతో దాన్ని పక్కన పెట్టక తప్పలేదు. మరి ‘భోళా శంకర్’ రెడీ అయ్యాక చిరు నటించే చిత్రం ఏదా అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది. చిరుతో సినిమా చేయడానికి తెలుగులో చాలామంది నిర్మాతలే లైన్లో ఉన్నా.. ఆయన మాత్రం తమిళ నటి, నిర్మాత రాధికా శరత్‌కుమార్‌కు మాటిచ్చినట్లుగా తాజా వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఒకప్పుడు తనతో వరుసగా సినిమాలు చేసిన రాధికతో పాటు ఆమె భర్త శరత్ కుమార్ అంటే చిరుకు ప్రత్యేక అభిమానం ఉంది. శరత్ హీరోగా స్థిరపడకముందు, తనతో ‘గ్యాంగ్ లీడర్’ చేస్తున్న టైంలోనే అతడిని ఆదుకోవడానికి చిరు అప్పట్లో ముందుకొచ్చాడు. ఆర్థిక సమస్యల్లో ఉన్న తనను బయటపడేయడానికి తన ప్రొడక్షన్లో సినిమా చేయడానికి చిరు ముందుకు వచ్చాడని, పారితోషకం గురించి కూడా మాట్లాడకుండా సినిమా చేసుకోమని చెప్పాడని.. ఐతే అనుకోకుండా అదే టైంలో తాను హీరోగా బ్రేక్ అందుకోవడంతో ఆ సినిమా చేయాల్సిన అవసరం పడలేదని శరత్ కుమార్ ఒక సందర్భంగా ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చెప్పుకున్నారు.

ఐతే రాధిక, శరత్ కుమార్ ఈ మధ్య ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. రాడాన్ పిక్చర్స్ మీద ఒక టైంలో వరుసగా సీరియళ్లు, సినిమాలు నిర్మించిన రాధిక.. మధ్యలో ప్రొడక్షన్ ఆపేసింది. శరత్ నటుడిగా అంత బిజీగా ఏమీ లేడు. ఈ నేపథ్యంలో చిరుతో సినిమా చేసి రాడాన్‌ను నిలబెట్టాలని రాధిక భావించినట్లు తెలుస్తోంది. ఏటా ఎయిటీస్ రీయూనియన్ కార్యక్రమంలో చిరు, రాధిక, శరత్ కలుస్తుంటారు. ఈ మధ్యే ఆ వేడుక జరిగింది. ఆ టైంలోనే చిరు నుంచి రాధిక, శరత్ మాట తీసుకుని సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

This post was last modified on December 17, 2022 10:55 pm

Share
Show comments

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

48 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago