ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటిదాకా లేనంత భారీ స్థాయిలో, భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముదుకు వచ్చింది అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రం. ఈ సినిమాలో జేమ్స్ కామెరూన్ ఇచ్చిన విజువల్ ట్రీట్కు మెజారిటీ ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. కాకపోతే కథాకథనాల విషయంలో, నిడివి విషయంలో విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ మనం పెట్టే టికెట్ డబ్బులకు గిట్టుబాటు అవుతుందనే అభిప్రాయం సమీక్షకులు, అలాగే ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. అవతార్-2 సినిమాకు ఒక ఇండియన్ మూవీతో పోలుస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతుండడం విశేషం. తెలుగులో నారప్పగా రీమేక్ అయిన తమిళ చిత్రం అసురన్ కథతో అవతార్-2 స్టోరీకి చాలా పోలికలు కనిపిస్తుండడం విశేషం.
అసురన్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లే ఒక తండ్రి కథ. అందులో శత్రువుల దాడిలో ఒక కొడుకును కోల్పోతాడు. మిగతా కుటుంబాన్ని కాపాడుకోవడానికి హీరో శత్రువులతో పోరాడతాడు. అవతార్-2 కథ కూడా డిట్టో ఇలాగే ఉండడం విశేషం. ఐతే కథ పరంగా పోలికలు యాదృచ్ఛికంగానే జరిగి ఉండొచ్చు కానీ.. తమిళ జనాలు మాత్రం కామెరూన్ అసురన్ చిత్రాన్ని కాపీ కొట్టాడంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు.
విశేషం ఏంటంటే.. అవతార్-1కు సైతం ఓ ఇండియన్ మూవీతో పోలికలు ఉండడం విశేషం. ఆ చిత్రమే.. వియత్నాం కాలనీ. అది మోహన్ లాల్ హీరోగా నటించిన మలయాళ మూవీ. ఒక కాలనీ వాసులను ఖాళీ చేయించడానికి విలన్ బ్యాచ్ హీరోను అక్కడికి పంపడం.. అతను తర్వాత వాళ్లలో కలిసిపోయి విలన్ బ్యాచ్ను ఎదిరించడం.. ఈ నేపథ్యంలో సినిమా నడుస్తుంది. అవతార్ సినిమా సైతం పాండోరా గ్రహం నేపథ్యంలో ఇదే లైన్లో నడుస్తుందన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం తమిళంలో అదే పేరుతో రీమేక్ కావడంతో అవతార్ సినిమాలు రెంటికీ తమిళ చిత్రాలే స్ఫూర్తి అంటున్నారు తమిళ నెటిజన్లు.
This post was last modified on December 17, 2022 6:19 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…