Movie News

జ‌న‌వ‌రిలో ప‌వ‌న్ మ‌రో సినిమా అనౌన్స్‌మెంట్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త రెండు వారాల్లో షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చాడు. ఓవైపు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ఒక కొలిక్కి రాక‌ముందే సాహో ద‌ర్శ‌కుడు సుజీత్ డైరెక్ష‌న్లో డీవీవీ ఎంట‌ర్టైన్మెంట్స్ నిర్మించే సినిమాకు ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాకు అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన వారం రోజుల్లోనే హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్ స్టార్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించే కొత్త చిత్రానికి ప్రారంభోత్స‌వ వేడుక చేశారు.

త‌న‌కున్న పొలిటిక‌ల్ క‌మిట్మెంట్ల మ‌ధ్య హ‌రిహ‌ర వీర‌మ‌ల్లునే పూర్తి చేయ‌లేక‌పోతున్న ప‌వ‌న్.. ఈ సినిమాల‌ను ఎప్పుడు మొద‌లుపెడ‌తాడో, ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియ‌క అయోమ‌యంలో ప‌డిపోయారు అభిమానులు. వాళ్ల క‌న్ఫ్యూజ‌న్‌ను మ‌రింత పెంచుతూ.. త్వ‌ర‌లోనే మ‌రో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడ‌ట ప‌వ‌న్.

ఈ ఏడాది ఆరంభంలో చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చి, ఆ త‌ర్వాత ప‌క్క‌కు వెళ్లిపోయిన వినోదియ సిత్తం రీమేక్‌ను జ‌న‌వ‌రిలో ప‌వ‌న్ మొద‌లుపెట్ట‌బోతున్నాడ‌న్న‌ది తాజా స‌మాచారం. ఒక టైంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ల‌డ‌మే త‌రువాయి అన్నారు. కానీ త‌ర్వాత దాని గురించి చ‌ర్చే లేదు. దీంతో సినిమా ఆగిపోయింద‌ని అనుకున్నారంతా. కానీ ఈ సినిమా మ‌ళ్లీ తెర‌పైకి వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ప్రారంభోత్స‌వంతో పాటు షూటింగ్ కూడా మొద‌లు కానుంద‌ట‌. మ‌రి హరిహ‌ర వీర‌మ‌ల్లు ప‌రిస్థితేంటో.. కొత్త‌గా ప్ర‌క‌టించిన ఇంకో రెండు చిత్రాల సంగ‌తేంటో చూడాలి మ‌రి.

ఒరిజిన‌ల్ డైరెక్ట‌ర్ స‌ముద్ర‌ఖ‌నినే తీయ‌బోతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, అడిష‌న‌ల్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు..ఇందులో పవన్ ఒరిజినల్లో సముద్రఖని చేసిన దైవదూతలో కనిపించబోతుంటే.. తంబిరామయ్య చేసిన మిడిలేజ్డ్ క్యారెక్టర్ని యుకుడిగా మార్చి అందులో సాయిధరమ్ తేజ్‌ను నటింపజేస్తారని ఇంత‌కుముందే వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మించే ఛాన్సుంది.

This post was last modified on December 17, 2022 6:13 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

11 seconds ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

16 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

1 hour ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago