పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత రెండు వారాల్లో షాక్ల మీద షాక్లు ఇచ్చాడు. ఓవైపు క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు ఒక కొలిక్కి రాకముందే సాహో దర్శకుడు సుజీత్ డైరెక్షన్లో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు అనౌన్స్మెంట్ వచ్చిన వారం రోజుల్లోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే కొత్త చిత్రానికి ప్రారంభోత్సవ వేడుక చేశారు.
తనకున్న పొలిటికల్ కమిట్మెంట్ల మధ్య హరిహర వీరమల్లునే పూర్తి చేయలేకపోతున్న పవన్.. ఈ సినిమాలను ఎప్పుడు మొదలుపెడతాడో, ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియక అయోమయంలో పడిపోయారు అభిమానులు. వాళ్ల కన్ఫ్యూజన్ను మరింత పెంచుతూ.. త్వరలోనే మరో చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడట పవన్.
ఈ ఏడాది ఆరంభంలో చర్చల్లోకి వచ్చి, ఆ తర్వాత పక్కకు వెళ్లిపోయిన వినోదియ సిత్తం రీమేక్ను జనవరిలో పవన్ మొదలుపెట్టబోతున్నాడన్నది తాజా సమాచారం. ఒక టైంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అన్నారు. కానీ తర్వాత దాని గురించి చర్చే లేదు. దీంతో సినిమా ఆగిపోయిందని అనుకున్నారంతా. కానీ ఈ సినిమా మళ్లీ తెరపైకి వస్తున్నట్లు సమాచారం. ప్రారంభోత్సవంతో పాటు షూటింగ్ కూడా మొదలు కానుందట. మరి హరిహర వీరమల్లు పరిస్థితేంటో.. కొత్తగా ప్రకటించిన ఇంకో రెండు చిత్రాల సంగతేంటో చూడాలి మరి.
ఒరిజినల్ డైరెక్టర్ సముద్రఖనినే తీయబోతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు..ఇందులో పవన్ ఒరిజినల్లో సముద్రఖని చేసిన దైవదూతలో కనిపించబోతుంటే.. తంబిరామయ్య చేసిన మిడిలేజ్డ్ క్యారెక్టర్ని యుకుడిగా మార్చి అందులో సాయిధరమ్ తేజ్ను నటింపజేస్తారని ఇంతకుముందే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించే ఛాన్సుంది.
ఏపీ రాజధాని అమరావతిలో పనుల నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనేక…
సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…