Movie News

జ‌న‌వ‌రిలో ప‌వ‌న్ మ‌రో సినిమా అనౌన్స్‌మెంట్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త రెండు వారాల్లో షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చాడు. ఓవైపు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ఒక కొలిక్కి రాక‌ముందే సాహో ద‌ర్శ‌కుడు సుజీత్ డైరెక్ష‌న్లో డీవీవీ ఎంట‌ర్టైన్మెంట్స్ నిర్మించే సినిమాకు ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాకు అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన వారం రోజుల్లోనే హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్ స్టార్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించే కొత్త చిత్రానికి ప్రారంభోత్స‌వ వేడుక చేశారు.

త‌న‌కున్న పొలిటిక‌ల్ క‌మిట్మెంట్ల మ‌ధ్య హ‌రిహ‌ర వీర‌మ‌ల్లునే పూర్తి చేయ‌లేక‌పోతున్న ప‌వ‌న్.. ఈ సినిమాల‌ను ఎప్పుడు మొద‌లుపెడ‌తాడో, ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియ‌క అయోమ‌యంలో ప‌డిపోయారు అభిమానులు. వాళ్ల క‌న్ఫ్యూజ‌న్‌ను మ‌రింత పెంచుతూ.. త్వ‌ర‌లోనే మ‌రో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడ‌ట ప‌వ‌న్.

ఈ ఏడాది ఆరంభంలో చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చి, ఆ త‌ర్వాత ప‌క్క‌కు వెళ్లిపోయిన వినోదియ సిత్తం రీమేక్‌ను జ‌న‌వ‌రిలో ప‌వ‌న్ మొద‌లుపెట్ట‌బోతున్నాడ‌న్న‌ది తాజా స‌మాచారం. ఒక టైంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ల‌డ‌మే త‌రువాయి అన్నారు. కానీ త‌ర్వాత దాని గురించి చ‌ర్చే లేదు. దీంతో సినిమా ఆగిపోయింద‌ని అనుకున్నారంతా. కానీ ఈ సినిమా మ‌ళ్లీ తెర‌పైకి వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ప్రారంభోత్స‌వంతో పాటు షూటింగ్ కూడా మొద‌లు కానుంద‌ట‌. మ‌రి హరిహ‌ర వీర‌మ‌ల్లు ప‌రిస్థితేంటో.. కొత్త‌గా ప్ర‌క‌టించిన ఇంకో రెండు చిత్రాల సంగ‌తేంటో చూడాలి మ‌రి.

ఒరిజిన‌ల్ డైరెక్ట‌ర్ స‌ముద్ర‌ఖ‌నినే తీయ‌బోతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, అడిష‌న‌ల్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు..ఇందులో పవన్ ఒరిజినల్లో సముద్రఖని చేసిన దైవదూతలో కనిపించబోతుంటే.. తంబిరామయ్య చేసిన మిడిలేజ్డ్ క్యారెక్టర్ని యుకుడిగా మార్చి అందులో సాయిధరమ్ తేజ్‌ను నటింపజేస్తారని ఇంత‌కుముందే వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మించే ఛాన్సుంది.

This post was last modified on December 17, 2022 6:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

5 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

7 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

7 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

8 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

9 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

10 hours ago