పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత రెండు వారాల్లో షాక్ల మీద షాక్లు ఇచ్చాడు. ఓవైపు క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు ఒక కొలిక్కి రాకముందే సాహో దర్శకుడు సుజీత్ డైరెక్షన్లో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు అనౌన్స్మెంట్ వచ్చిన వారం రోజుల్లోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే కొత్త చిత్రానికి ప్రారంభోత్సవ వేడుక చేశారు.
తనకున్న పొలిటికల్ కమిట్మెంట్ల మధ్య హరిహర వీరమల్లునే పూర్తి చేయలేకపోతున్న పవన్.. ఈ సినిమాలను ఎప్పుడు మొదలుపెడతాడో, ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియక అయోమయంలో పడిపోయారు అభిమానులు. వాళ్ల కన్ఫ్యూజన్ను మరింత పెంచుతూ.. త్వరలోనే మరో చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడట పవన్.
ఈ ఏడాది ఆరంభంలో చర్చల్లోకి వచ్చి, ఆ తర్వాత పక్కకు వెళ్లిపోయిన వినోదియ సిత్తం రీమేక్ను జనవరిలో పవన్ మొదలుపెట్టబోతున్నాడన్నది తాజా సమాచారం. ఒక టైంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అన్నారు. కానీ తర్వాత దాని గురించి చర్చే లేదు. దీంతో సినిమా ఆగిపోయిందని అనుకున్నారంతా. కానీ ఈ సినిమా మళ్లీ తెరపైకి వస్తున్నట్లు సమాచారం. ప్రారంభోత్సవంతో పాటు షూటింగ్ కూడా మొదలు కానుందట. మరి హరిహర వీరమల్లు పరిస్థితేంటో.. కొత్తగా ప్రకటించిన ఇంకో రెండు చిత్రాల సంగతేంటో చూడాలి మరి.
ఒరిజినల్ డైరెక్టర్ సముద్రఖనినే తీయబోతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు..ఇందులో పవన్ ఒరిజినల్లో సముద్రఖని చేసిన దైవదూతలో కనిపించబోతుంటే.. తంబిరామయ్య చేసిన మిడిలేజ్డ్ క్యారెక్టర్ని యుకుడిగా మార్చి అందులో సాయిధరమ్ తేజ్ను నటింపజేస్తారని ఇంతకుముందే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించే ఛాన్సుంది.
This post was last modified on December 17, 2022 6:13 am
ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప 2 ది రూల్ తర్వాత మూడో భాగం ది ర్యాంపేజ్…
ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి దక్కిన ఆదరణే దానికి సాక్ష్యం.…
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…
టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…
నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…
టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…