దిల్ రాజు.. గత కొన్ని నెలల్లో టాలీవుడ్ సర్కిల్స్లో హీరోలను మించి చర్చనీయాంశం అయిన పేరు. సోషల్ మీడియాలో కూడా ఈ పేరు హాట్ టాపిక్ అయింది. సంక్రాంతి సినిమాల గురించి చర్చలంటే హీరో హీరోయిన్లు, దర్శకుల గురించి డిస్కషన్ ఉంటుంది కానీ.. దానికంటే కూడా నిర్మాత పేరు చర్చనీయాంశం కావడం ఇప్పుడే చూస్తున్నాం.
ఆయన నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘వారిసు’ మూవీ తెలుగు వెర్షన్కు థియేటర్లు కేటాయించే విషయమై తలెత్తిన వివాదం ఒక దశలో రెండు ఇండస్ట్రీల మధ్య గొడవలా మారే పరిస్థితి కనిపించింది. చిరంజీవి, బాలకృష్ణల చిత్రాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లకు దీటుగా ‘వారసుడు’కు థియేటర్లు ఇవ్వడంపై నెల కిందట్నుంచి పెద్ద చర్చే నడుస్తుండగా.. ఈ సినిమాకు సరిపడా థియేటర్లు ఇవ్వకపోతే తమిళంలో రిలీజయ్యే తెలుగు సినిమాల సంగతి చూస్తాం అన్నట్లుగా తమిళ దర్శకుడు లింగుస్వామి హెచ్చరించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజు తన వివరణతో గొడవకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.
ఐతే పండక్కి తెలుగు సినిమాలను కాదని తమిళ చిత్రాలకు ఎలా థియేటర్లు ఇస్తాం అంటూ గతంలో చేసిన ప్రకటన దగ్గర్నుంచి విజయ్ తమిళంలో పెద్ద స్టార్ కాబట్టి ‘వారసుడు’కు తమిళనాట ఎక్కువ థియేటర్లు ఇవ్వాలనే వరకు వివిధ సందర్భాల్లో దిల్ రాజు ఇచ్చిన స్టేట్మెంట్లతో తయారైన ఒక మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అపరిచితుడు’ క్లైమాక్స్లో విక్రమ్ స్ప్లిట్ పర్సనాలిటీతో నట విశ్వరూపాన్ని చూపించే సన్నివేశంతో దీన్ని పోలుస్తూ రాజు మీద మీమ్ తయారవడం విశేషం.
ఇందులో విక్రమ్కు ‘హార్ట్ కింగ్’ (దిల్ రాజుకు ఇంగ్లిష్ నామధేయం) చేసి… ‘‘తొలి ప్రాధాన్యం తెలుగు చిత్రాలకే ఇవ్వాలి’’.. ‘‘తమిళ్ అయితే ఏంట్రా ముందు మేమే అనౌన్స్ చేశాం’’.. ‘‘మనీ ఏం చేస్కుంటాం ఇండస్ట్రీ బాగుంటే చాలు’’.. ‘‘విజయ్ అజిత్ కంటే పెద్ద స్టార్. మాకు ఎక్కువ స్క్రీన్లు కావాలి’’.. అంటూ ఆయన వేర్వేరు సందర్భాల్లో ఇచ్చిన స్టేట్మెంట్లతో అదిరిపోయే లెవెల్లో ఈ మీమ్ తీర్చిదిద్దారు. ప్రకాష్ రాజ్ను ప్రేక్షకులుగా చూపించి.. ‘‘రేయ్ రేయ్ ఇరగదీస్తున్నావ్ కదయ్యా’’ అంటూ కామెంట్ కూా చూడించాడు. ఇది నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది. దిల్ రాజు చూసినా ముందు నవ్వుకుంటాడేమో కానీ.. తనపై పడ్డ పంచ్ మాత్రం ఆయనకు మంట పుట్టించేదే.
This post was last modified on December 16, 2022 9:10 pm
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…