చాలా తక్కువ టైంలో యూత్లో మంచి ఫాలోయింగ్, స్టార్ ఇమేజ్ సంపాదించి సంచలనం రేపాడు విజయ్ దేవరకొండ. ఐతే వచ్చిన సక్సెస్ను నిలబెట్టుకోవడంలో అతను కొంచెం తడబడుతున్న సంగతి తెలిసిందే.
డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్.. ఇలా వరుసగా మూడు డిజాస్టర్లు అతడి ఖాతాలో పడ్డాయి. అంతకుముందు రెండు సినిమాల సంగతేమో కానీ.. లైగర్ రిజల్ట్ మాత్రం విజయ్ కాన్ఫిడెన్స్ను బాగానే దెబ్బ తీసినట్లు కనిపిస్తోంది. దాన్నుంచి వెంటనే బయటికి వద్దామన్నా కుదరడం లేదు.
సమంతతో చేస్తున్న ఖుషి మూవీ ఆమె అనారోగ్యం కారణంగా తాత్కాలికంగా ఆగిన సంగతి తెలిసిందే. వేరే సినిమాను మొదలుపెడదామని విజయ్ చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడానికి టైం పట్టింది. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కథా చర్చలు జరిపిన విజయ్ అతడితో సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు.
ఐతే ఈ సినిమాకు నిర్మాతను సెట్ చేసుకోవడంలో కొంచెం టైం పట్టినట్లు కనిపిస్తోంది. ఐతే అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టులోకి రావడంతో టెన్షన్ లేకపోయింది. ఆయన స్క్రిప్టు విషయంలో కొన్ని అభ్యంతరాలు చెప్పడం.. ఆ మేరకు మార్పులు చేర్పులు చేయడం.. అంతా ఓకే అనుకుని షూటింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్నీ జరిగిపోయినట్లు సమాచారం. రాజు పచ్చ జెండా ఊపడంతో మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లబోతున్నారట.
విజయ్ మంచి ఫాంలో ఉండగా అతడితో సినిమా చేయడానికి రాజు గట్టిగా ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు. కానీ ఇప్పుడు విజయ్ వరుస ఫెయిల్యూర్లతో ఇబ్బంది పడుతున్న టైంలో అతను రాజుకు దొరికాడు. రామ్ చరణ్తో ఒక సినిమా ఓకే అయినట్లే అయి క్యాన్సిల్ కావడంతో గౌతమ్కు విజయ్తో హిట్టు కొట్టి తనేంటో రుజువు చేసుకోవడం చాలా అవసరం.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…